Good News: అధికారంలోకి వస్తే రుణాలు మాఫీ.. ఎకరాకు పదివేలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Good News: త్వరలో రానున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కర్ణాటకలోని జేడీఎస్ నాయకులు ప్రజలకు వరాల జల్లుకురిపిస్తున్నారు. తాము గనక అధికారంలోకి వస్తే రైతుల రుణాలను పూర్తిగా మాఫి చేస్తామని ఆ రాష్ట్ర మాజీ సీఎం హెచ్డీ కుమారస్వామి ప్రకటించారు. కొప్పళ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో మంగళవారం పంచరత్న రథయాత్ర సందర్భంగా ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. కుష్టగి నియోజకవర్గ జేడీఎస్ అభ్యర్థి తుకారాంను ప్రజలకు పరిచయం చేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. అంతే కాకుండా ప్రజలు తమ పార్టీని ఆదరించిన వారికి ప్రోత్సాహకాలుంటాయన్నారు.
Read Also: Uttarakhand Cracks : జోషిమఠ్ తరహాలోనే మరో రెండు నగరాల్లో పగుళ్లు
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
రాష్ట్రంలోని 51 ఉపనదులను రైతుల పొలాల్లోకి తరలించేందుకు తన వద్ద ఓ అద్భుతమైన పథకం సిద్ధంగా ఉందన్నారు. తాను యాత్రల సందర్భంగా చేస్తున్న హామీలన్నీ చిత్తశుద్ధితో అమలు చేసేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. తెలంగాణ ప్రభుత్వ తరహాలో రైతుబంధు పథకాన్ని అమలులోకి తెస్తామన్నారు. ప్రతి ఎకరాకు రూ.10వేల ప్రోత్సాహ ధనం ప్రభుత్వమే ఇస్తుందని, వీటితో రైతులు ఎంచక్కా నాణ్యమైన విత్తనాలు, ఎరువులను ఇష్టం వచ్చిన చోట కొనుగోలు చేసుకోవచ్చునని పేర్కొన్నారు. నిరుపేదలకు రూ.5 లక్షలకే ఇంటిని ఇస్తామని, ఇందుకయ్యే మిగతా ఖర్చు ప్రభుత్వం భరిస్తుందన్నారు. ఎల్కేజీ నుంచి పీయూసీ వరకు ఉచిత విద్య అందిస్తామన్నారు. పూర్తి మెజారిటీతో ఒకసారి తమకు అవకాశం ఇచ్చి చూడాలని యాత్రల సందర్భంగా ప్రజలకు విన్నవించారు.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!