NTV Telugu Site icon

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. 14 వాహనాలు ధ్వంసం, ఐదుగురు మృతి

Accident

Accident

Road Accident: తమిళనాడులోని క్రిష్ణగిరి జిల్లా హోసూరు సమీపంలోని పేరండ్లపల్లి వద్ద జాతీయ రహదారి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బెంగళూరు హైవేపై నమ్మశక్యం కాని రీతిలో వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 8 కార్లు, రెండు బస్సులు, 4 లారీలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా.. మరో 10 మందికి పైగా తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను హోసూరు, క్రిష్ణగిరి ఆసుపత్రులకు తరలించారు. క్షతగాత్రులలో పలువురి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు తెలిసింది.

Read Also: Pakistan Citizen: రాజస్థాన్ బార్డర్లో పాకిస్తాన్ పౌరుడు.. పట్టుకున్న పోలీసులు

బెంగళూరు – క్రిష్ణగిరి మార్గంలోని హోసూరు సమీపంలోని పేరండ్లపల్లి వద్ద ఈ ప్రమాదం జరిగింది. బెంగళూరు – క్రిష్ణగిరి హైవే పై ఇరువైపులా కిలోమీటర్ల మేరకు ట్రాఫిక్ జామ్ అయింది. గ్రానైట్‌తో వెళుతున్న లారీ బ్రేక్ ఫెయిల్ అయ్యి కారుని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఆ వెనకే వస్తున్న పలు వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. మొత్తం 15 వాహనాలు ఢీకొనగా.. 14 వాహనాలు ధ్వంసమయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.