Rs.2000 Currency Note: రూ.2వేల నోటు కనిపించడం లేదు.. ఆర్థిక మంత్రి ఏం చెప్పారంటే

2000

2000

Rs.2000 Currency Note: ప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసినా రూ.2000 నోటు చర్చే జరుగుతోంది. గత కొన్నేళ్లుగా చెలామణిలో రెండు వేల రూపాయల నోట్లు గణనీయంగా తగ్గాయి. అసలు అవి చెలామణిలో ఉన్నాయా అన్న సందేహం ప్రజల్లో నెలకొంది. ఇందుకు సంబంధించి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో మాట్లాడారు. నోట్ల రద్దు నిర్ణయం తీసుకుని దాదాపు ఆరేళ్లవుతుంది. ఆ 6 ఏళ్ల తర్వాత కరెన్సీ నోట్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి అలాంటి అప్‌డేట్ వచ్చింది.

Read Also: Mahindra Thar: ఏప్రిల్ ఆఫర్.. మహీంద్రా థార్‌పై భారీ డిస్కౌంట్..

ఈ రోజుల్లో బ్యాంకుల ఏటీఎంల నుంచి 2000 రూపాయల బదులు 500, 200 రూపాయల నోట్లు ఎక్కువగా వస్తున్నాయి. 2000 రూపాయల నోట్లను మార్కెట్ నుంచి తొలగించాలని ప్రభుత్వం యోచిస్తోందా? అన్న అంశం పార్లమెంట్‌లో చర్చకు వచ్చింది. లోక్‌సభలో ఎంపీ సంతోష్‌కుమార్‌ ఆర్థిక మంత్రిని ఈ ప్రశ్న అడిగారు. అప్పుడు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమాధానమిచ్చారు. ఆర్‌బీఐ వార్షిక నివేదిక ప్రకారం మార్చి 2017 చివరి నాటికి రూ. 500, రూ. 2000 నోట్ల మొత్తం విలువ రూ. 9.512 లక్షల కోట్లు, 2022 మార్చి చివరి నాటికి రూ. 27.057 లక్షల కోట్లకు చేరిందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో వెల్లడించారు.

Read Also: Pakistan Economic Crisis: ప్రజలకు 24 గంటలు గ్యాస్ అందించలేము.. పాక్ మంత్రి

రిజర్వ్ బ్యాంక్ బ్యాంకులకు నోట్ల గురించి ఎలాంటి రద్దుకు సంబంధించిన ఆదేశాలు జారీ చేయలేదని ఆర్థిక మంత్రి చెప్పారు. ఏ డినామినేషన్‌తో నోటును ఎప్పుడు ముద్రించాలో బ్యాంకు స్వయంగా నిర్ణయిస్తుందన్నారు. ఆర్‌బిఐ వార్షిక నివేదిక ప్రకారం.. 2019-20 సంవత్సరం నుండి 2000 రూపాయల నోటును ముద్రించలేదని ఆర్థిక మంత్రి తెలిపారు.