Site icon NTV Telugu

Fakhar Zaman: బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడిన.. పాకిస్థాన్ విధ్వంసకర బ్యాట్స్‌మన్‌పై నిషేధం

Fakhar Zaman

Fakhar Zaman

పాకిస్తాన్ క్రికెట్ మరోసారి కుదుపులకు గురైంది. ప్రస్తుతం జరుగుతున్న పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)లో బాల్ ట్యాంపరింగ్ వివాదం ముదిరిపోవడంతో, స్టార్ బ్యాట్స్‌మన్‌పై నిషేధం విధించింది. ఆ బ్యాట్స్‌మన్ పేరు ఫఖర్ జమాన్. పీఎస్ఎల్‌లో ఫఖర్‌పై రెండు మ్యాచ్‌ల నిషేధం విధించారు. లాహోర్ ఖలందర్స్, కరాచీ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడినట్లు రుజువైంది. ఈ నిషేధాన్ని ప్రకటిస్తూ పీసీబీ ఒక ప్రకటన జారీ చేసింది.

Also Read:Rajasekhar: యూవీ క్రియేషన్స్ అంటే రాయల్ ట్రీట్మెంటు.. బైకర్ అందుకే ఒప్పుకున్నా!

లాహోర్ ఖలందర్స్, కరాచీ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో పీఎస్ఎల్ ఆర్టికల్ 2.14ను ఉల్లంఘించినట్లు అతను దోషిగా తేలాడు. లెవెల్ 3 నేరానికి పాల్పడినట్లు రుజువైంది. మ్యాచ్ రిఫరీ రోషన్ మహానామ అతనిపై క్రమశిక్షణా విచారణ జరిపి, అన్ని సాక్ష్యాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత తీర్పు ఇచ్చారు అని పీసీబీ ఒక ప్రకటనలో తెలిపింది.

ఫఖర్ లాహోర్ తరఫున ఆడుతున్నాడు. రెండో ఇన్నింగ్స్‌లోని 19వ ఓవర్ చివర్లో కొంత నాటకీయత చోటుచేసుకుంది. చివరి ఓవర్‌లో కరాచీకి 14 పరుగులు అవసరమయ్యాయి. ఆఖరి ఓవర్‌కు ముందు జమాన్, హారిస్ రౌఫ్, లాహోర్ కెప్టెన్ షహీన్‌లతో మాట్లాడుతున్నాడు. ఈ సమయంలో అంపైర్ ఫైసల్ అఫ్రిది ఆటగాళ్లను బంతి ఇవ్వమని అడిగాడు. లాహోర్ కెప్టెన్ షహీన్ అఫ్రిది, స్క్వేర్ లెగ్ అంపైర్ షర్ఫుద్-ఉద్-దౌలాల మధ్య సుదీర్ఘ చర్చ అనంతరం, లాహోర్ ఆటగాళ్లు ఉద్దేశపూర్వకంగా బంతిని ట్యాంపర్ చేశారని నిర్ధారణ అయింది. వారికి ఐదు పరుగుల జరిమానా విధించి, బంతిని వెంటనే మార్చారు. ఫఖర్‌పై ఇప్పుడు రెండు మ్యాచ్‌ల నిషేధం విధించారు.

Also Read:Big News : రేపటి నుంచి దేశవ్యాప్తంగా పెరగనున్న సిమెంట్‌ ధరలు

లెవెల్ 3 కింద, ఒక ఆటగాడిపై కనీసం ఒకటి లేదా రెండు మ్యాచ్‌ల నిషేధం విధిస్తారు. ఈ నిబంధన కింద ఫఖర్ జమాన్‌పై రెండు మ్యాచ్‌ల నిషేధం విధించారు. అతను ఇప్పుడు ఏప్రిల్ 3న ముల్తాన్ సుల్తాన్స్‌తో, ఏప్రిల్ 9న ఇస్లామాబాద్ యునైటెడ్‌తో జరిగే మ్యాచ్‌లకు దూరమవుతాడు. పీఎస్ఎల్ ప్రవర్తనా నియమావళి ప్రకారం, ఇలాంటి సందర్భాల్లో, నిర్ణయం వెలువడిన 48 గంటల్లోగా టెక్నికల్ కమిటీకి అప్పీల్ చేసుకునే అవకాశం ఆటగాడికి ఉంటుంది.

Exit mobile version