పుష్ప, పుష్ప2తో టాలీవుడ్ ప్రేక్షకులకు చేరువైన మాలీవుడ్ యాక్టర్ ఫహాద్ ఫజిల్. సొంత ఇండస్ట్రీలో స్టార్ ఇమేజ్ ఉన్నా కూడా.. అక్కడే గిరిగీసుకుని కూర్చోలేదు ఫహాద్. హీరోగా కెరీర్ పీక్స్లో ఉండగా.. రిస్క్ చేసి కోలీవుడ్, టాలీవుడ్లో నెగిటివ్, సపోర్టింగ్ రోల్స్కు షిఫ్టై అక్కడ మార్కెట్ క్రియేట్ చేసుకోగలిగాడు. ముఖ్యంగా టాలీవుడ్ ప్రేక్షకులు ఫఫాను షెకావత్గా ఓన్ చేసేసుకున్నారు.
Also Read : Tollywood : ఫేడవుటౌతున్న దర్శకులకు ఛాన్సులిస్తున్న హీరోలు
ఈ లవ్ తిరిగి టాలీవుడ్ ఆడియన్స్కు ఇచ్చేందుకు నేరుగా ఇక్కడ టూ ప్రాజెక్ట్స్ ఓకే చేశాడు ఫహాద్. బాహుబలిని నిర్మించిన ఆర్కా మీడియాకు టూ మూవీస్ సైన్ చేశాడు. డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ అండ్ ఆక్సిజన్ చిత్రాలు ఎనౌన్స్ ఇంచుమించు టూ ఇయర్స్ కూడా కావొస్తుంది. కానీ ఒక్క మూవీ కూడా ప్రేక్షకుల ముందుకు రాలేదు. ఇంకా షూటింగ్ దశలోనే ఉన్నాయి ఈ వెంచర్స్. గత అక్టోబర్లోనే డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ షూటింగ్ స్టార్టైంది. ప్రజెంట్ ఈ షూట్లోనే పాల్గొంటున్నాడు ఫఫా. శశాంక్ యేలేటీ ఈ మూవీకి దర్శకుడు. ఇది కంప్లీటయ్యాక ఆక్సిజన్ మొదలు పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ రెండింటితో పాటు లేటెస్టుగా మరో టాలీవుడ్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడన్నది బజ్. అనిల్ రావిపూడి నెక్ట్స్ విక్టరీ వెంకటేష్తో మూవీని ప్లాన్ చేస్తున్నాడని సమాచారం. ఇందులో కీ రోల్ కోసం ఫహాద్ ఫజిల్ను సంప్రదించాడని టాలీవుడ్ సినీ సర్కిల్స్లో ఓ వార్త సర్క్యులేట్ అవుతోంది. త్రివిక్రమ్ షూటింగ్ కంప్లీట్ కాగానే.. వెంకీ ఈ మూవీకి షిఫ్ట్ కాబోతున్నాడట. నెక్ట్స్ ఇయర్ సంక్రాంతికి రిలీజ్ చేసే ప్లాన్లో ఉన్నాడు అనిల్. ఇదే నిజమైతే ఇప్పటి వరకు రీజనల్ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నా అనిల్… మాలీవుడ్ మార్కెట్లో కూడా దూసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్లే లెక్క.
