Exit Polls Failed: సర్వేలకు అందని ఓటర్ నాడి.. తలకిందులైన ఎగ్జిట్ పోల్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుత కాలంలో ఎన్నికల ఫలితాల కంటే ముందు వచ్చే ఎగ్జిట్ పోల్స్ ఓటర్లలో తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. సాంకేతికత పెరిగినప్పటికీ.. మారుతున్న ఓటరు నాడిని పట్టుకోవడంలో ఈ సర్వేలు తరచుగా విఫలమవుతున్నాయి. రాజకీయ ముఖచిత్రం ఇప్పుడు కేవలం కుల, మత సమీకరణాలకే పరిమితం కాకుండా, సంక్షేమ పథకాలు, మహిళా ఓటర్ల ప్రాధాన్యతలు మరియు యువత ఆకాంక్షల చుట్టూ తిరుగుతోంది. క్షేత్రస్థాయిలో ఉన్న నిశ్శబ్ద విప్లవాన్ని అంచనా వేయడంలో డేటా విశ్లేషకులు విఫలమవుతుండటంతో, ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తలకిందులై ‘ఓటరు తీర్పు’ అనేది అంతుచిక్కని రహస్యంగా మారుతోంది. రాజకీయ చైతన్యం పెరిగిన క్రమంలో ఓటరు తన మనసులోని మాటను పోలింగ్ బూత్ వరకు దాచిపెడుతుండటమే ఈ సర్వేల వైఫల్యానికి ప్రధాన కారణం.
దేశవ్యాప్తంగా జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు రాజకీయ విశ్లేషకులను విస్మయానికి గురిచేశాయి. ముఖ్యంగా తమిళనాడులో సంప్రదాయ రాజకీయాలను కాదని, నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీని ఓటర్లు అక్కున చేర్చుకున్నారు. కేవలం 25 స్థానాలకే పరిమితమవుతుందని సర్వేలు అంచనా వేయగా, అంచనాలను తలకిందులు చేస్తూ టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించింది. రైతు రుణమాఫీ, మహిళలకు నెలకు రూ.2,500 వంటి ఆకర్షణీయమైన హామీలు ఇక్కడ ప్రధానంగా పనిచేశాయి. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ హ్యాట్రిక్ విజయం సాధిస్తుందని అందరూ భావించినా.. బీజేపీ అనూహ్యంగా 192 స్థానాలను కైవసం చేసుకుని దీదీ కోటను బద్దలు కొట్టింది. మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ 80 నుంచి 90 స్థానాలకే పరిమితం కావడం గమనార్హం.
Also Read
- CNG Biogas Blending: ఇక CNGలో బయోగ్యాస్..? పేడ నుంచి వచ్చే గ్యాస్ కలిపితే మైలేజ్ తగ్గుతుందా.?
- YS Jagan: గాంధీ పుట్టిన దేశంలో ప్రజాస్వామ్యానికి సంకెళ్లు.. సీఎం చంద్రబాబుపై వైఎస్ జగన్ మండిపాటు..
- Iran-Trump: ‘హార్ముజ్ మా కంట్రోల్లోనే ఉంది’.. ట్రంప్ వ్యాఖ్యలకు ఇరాన్ కౌంటర్
- Operation Sindoor: రఫెల్ భయంతో వణికిన పాకిస్తాన్.. తన ఎఫ్-16లను దాచి పెట్టిన దాయాది..
కేరళలో కూడా అదే పరిస్థితి పునరావృతమైంది. ఎల్డీఎఫ్ మళ్ళీ వస్తుందన్న అంచనాలను తలకిందులు చేస్తూ.. యూడీఎఫ్ పక్షాన ఓటర్లు నిలిచారు. ముఖ్యమంత్రి పినరయి విజయన్ మరియు ఆయన మంత్రివర్గ సహచరులు వెనుకంజలో ఉండటం తీవ్ర చర్చకు దారితీసింది. అయితే, అస్సాం మరియు పుదుచ్చేరిలో మాత్రం అంచనాలు నిజమవుతూ బీజేపీ తన పట్టును నిలుపుకుంది. అస్సాంలో హిమంత బిశ్వ శర్మ హ్యాట్రిక్ విజయం సాధించి రికార్డు సృష్టించారు.
మొత్తానికి ఈ ఎన్నికలు ప్రాంతీయ సెంటిమెంట్లు, మహిళా సంక్షేమం, కొత్త తరం నాయకత్వంపై ప్రజలకున్న నమ్మకాన్ని స్పష్టం చేశాయి. జాతీయ స్థాయి అంశాల కంటే స్థానిక నిరుద్యోగిత, ఆర్థిక భరోసా వంటి అంశాలే ఓటర్లను ప్రభావితం చేశాయని ఈ ఫలితాలు నిరూపించాయి. సాంప్రదాయ పార్టీల కంటే మార్పు కోరుకునే కొత్త శక్తుల వైపు యువత మొగ్గు చూపడం ఈ ఎన్నికల హైలైట్. సర్వేలు ఇటువంటి విషయాలను పట్టుకోవడంలో విఫలం అవుతున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తాజావార్తలు
-
CNG Biogas Blending: ఇక CNGలో బయోగ్యాస్..? పేడ నుంచి వచ్చే గ్యాస్ కలిపితే మైలేజ్ తగ్గుతుందా.?
-
YS Jagan: గాంధీ పుట్టిన దేశంలో ప్రజాస్వామ్యానికి సంకెళ్లు.. సీఎం చంద్రబాబుపై వైఎస్ జగన్ మండిపాటు..
-
Irumudi: ‘ఇరుముడి’తో మారిపోయిన మాస్ రాజా.. రవితేజ కెరీర్కి ఈ సినిమా హిట్ చాలా తప్పనిసరి!
-
Iran-Trump: ‘హార్ముజ్ మా కంట్రోల్లోనే ఉంది’.. ట్రంప్ వ్యాఖ్యలకు ఇరాన్ కౌంటర్
-
Operation Sindoor: రఫెల్ భయంతో వణికిన పాకిస్తాన్.. తన ఎఫ్-16లను దాచి పెట్టిన దాయాది..
ట్రెండింగ్
-
బ్లాక్ డిజైన్, హైబ్రిడ్ పవర్తో Toyota Hyryder Aero Black Edition వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..!
-
5,000 నిట్స్ డిస్ప్లే, 50MP కెమెరాలు, 6,500mAh బ్యాటరీతో Vivo X300 FE కొత్త వేరియంట్ లాంచ్..!
-
Airtel Recharge Plans: రూ.299 సహా 4 ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు.. ఇకపై కొత్త ఆప్షన్లు ఇవే.!
-
Money Plant Growing Tips: మానీ ప్లాంట్ వేగంగా, గుబురుగా పెరగాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.!
-
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!