Fish Prasadam : చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమంలో అపశృతి

  • నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో జరుగుతున్న చేప ప్రసాదం పంపిణీలో అపశృతి
  • మెదక్ జిల్లాకి చెందిన సత్యనారాయణ (75) వృద్ధుడు మృతి
  • ప్రసాదం తీసుకునేందుకు క్యూ లైన్ లో నిలబడిన వృద్ధుడికి హార్ట్ స్ట్రోక్
Heart Attack Fish Prasad

Heart Attack Fish Prasad

Fish Prasadam : నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జరిగిన ప్రముఖ చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమంలో అపశృతి చోటుల చేసుకుంది. ఈ కార్యక్రమానికి హాజరైన వృద్ధడు గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయారు. మెదక్ జిల్లాకు చెందిన సత్యనారాయణ (75) అనే వృద్ధుడు చేప ప్రసాదం పొందేందుకు ఏర్పాటు చేసిన క్యూ లైన్‌లో నిలబడి ఉన్న సమయంలో హఠాత్తుగా అస్వస్థతకు గురయ్యారు.

Janasena: మట్టి తవ్వకాలలో రెండు వర్గాలుగా విడిపోయి వీధికెక్కిన జనసేన నేతలు.. ఆపై దాడులు..!

×
×
Ad

సమాచారం అందుకున్న వెంటనే వైద్యులు ఆయనను పరీక్షించి వెంటనే సీపీఆర్ (కార్డియో పల్మనరీ రిససిటేషన్) చేశారు. అయితే అన్ని ప్రయత్నాలు విఫలమయ్యాయి. గుండెపోటుతో ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. సత్యనారాయణ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రి మార్చురీకి తరలించారు. ఈ ఘటనతో ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ వద్ద కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది.

Breakup Tips: బ్రేకప్ నుంచి బయటపడాలంటే.. ఈ టిప్స్ పాటించండి..