Site icon NTV Telugu

Mahua Moitra: మహువా మొయిత్రాకు మళ్లీ ఈడీ సమన్లు..

Mahuva

Mahuva

ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్ (ఫెమా) ఉల్లంఘనకు సంబంధించిన కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నాయకురాలు మహువా మోయిత్రాకు మళ్లీ సమన్లు ​​జారీ చేసింది. ఈ కేసులో మొయిత్రాను ఈడీ మార్చి 11న విచారణకు పిలిచింది. ఫిబ్రవరిలో ఫెమా కింద కేంద్ర దర్యాప్తు సంస్థ మొయిత్రాకు సమన్లు ​​జారీ చేసింది. కాగా.. ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిష్టను దిగజార్చేందుకే అదానీ గ్రూప్ కేసులో వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ తరపున మొయిత్రా బహుమతులు, డబ్బు తీసుకుని లోక్‌సభలో ప్రశ్నలు లేవనెత్తారని బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే ఆరోపించారు. మోయిత్రా ద్రవ్య లాభాల కోసం జాతీయ భద్రతను పణంగా పెట్టారని దుబే ఆరోపించారు. అయితే, అదానీ గ్రూప్ డీల్స్‌పై తాను ప్రశ్నలు లేవనెత్తినందుకే తనను టార్గెట్ చేస్తున్నారని మొయిత్రా పేర్కొంది.

Abu Dhabi Ramzan: ఉద్యోగులకు శుభవార్త.. వర్కింగ్ అవర్స్ తగ్గింపు

ఈ కేసులో మహువా మొయిత్రా పార్లమెంటు సభ్యత్వం కూడా రద్దయింది. ఈ వ్యవహారంపై స్పీకర్ ఓం బిర్లా విచారణ జరిపించాలని నిషికాంత్ దూబే డిమాండ్ చేశారు. ఎథిక్స్ కమిటీ ఈ ఆరోపణలను నిజమని అంగీకరించి పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేయాలని సిఫారసు చేసింది. మహువా మోయిత్రా దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు సోమవారం తిరస్కరించింది. ఇందులో.. నిషికాంత్ దూబే, న్యాయవాది జై అనంత్ దేహద్రాయ్ తనకు వ్యతిరేకంగా ఏదైనా ‘నకిలీ మరియు అవమానకరమైన’ విషయాలను పోస్ట్ చేయకుండా లేదా సర్క్యులేట్ చేయకుండా ఆపాలని అభ్యర్థించింది.

Chandini Chowdary: ‘గామి’ షూట్ లో లక్కీగా ప్రాణాలతో బయటపడ్డా : హీరోయిన్ చాందినీ చౌదరి ఇంటర్వ్యూ

Exit mobile version