ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) దేశంలో తొలిసారిగా ఓ విమానాన్ని వేలం వేసి విక్రయించింది. హాకర్ 800ఏ (Hawker 800A) విమానాన్ని ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎస్టీసీ లిమిటెడ్ ద్వారా జూలై 1న ఈ-వేలం నిర్వహించి రూ.3 కోట్లకు విక్రయించినట్లు ఈడీ వెల్లడించింది. ఈ విమానాన్ని 2025 మార్చి 7న హైదరాబాద్ జోనల్ కార్యాలయానికి చెందిన ఈడీ అధికారులు నిర్వహించిన సోదాల్లో స్వాధీనం చేసుకున్నారు. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఈ విమానాన్ని జప్తు చేసినట్లు అధికారులు తెలిపారు.
ఈ కేసు అమర్దీప్ కుమార్, క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రైవేట్ లిమిటెడ్తో పాటు మరికొందరిపై నమోదైన ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (PMLA) కేసుకు సంబంధించినదని ఈడీ వెల్లడించింది. దర్యాప్తులో భాగంగా స్వాధీనం చేసుకున్న ఆస్తుల్లో భాగమైన ఈ విమానాన్ని చట్టపరమైన ప్రక్రియ పూర్తయ్యాక ఈ-వేలం ద్వారా విక్రయించినట్లు ఈడీ తెలిపింది. మనీలాండరింగ్ కేసులో జప్తు చేసిన విమానాన్ని ఈడీ ఈ విధంగా వేలం వేయడం దేశంలో ఇదే తొలిసారి కావడం విశేషం.
In a first of its kind, the Enforcement Directorate has auctioned an Aircraft (Hawker 800A) through MSTC Limited on July 1 for a sale consideration of Rs 3 crore. The aircraft was seized during a search operation conducted on March 7, 2025 by the ED's Hyderabad zonal office and… pic.twitter.com/pmkj5AkjXX
— ANI (@ANI) July 3, 2026

