Site icon NTV Telugu

Earthquake: అస్సాంలో 5.1 తీవ్రతతో భూకంపం.. మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్ లలో ప్రకంపనలు

Earthquake

Earthquake

ఇటీవల సంభవిస్తున్న భూకంపాలు భయాందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా అస్సాంలో సోమవారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. అస్సాంలోని మోరిగావ్ జిల్లాలో ఈ ప్రకంపనలు సంభవించాయి. ఆ సమయంలో ఇళ్లలో నిద్రిస్తున్న ప్రజలు ప్రాణ భయంతో బయటకు పరుగులు తీశారు. రిక్టర్ స్కేలుపై 5.1 తీవ్రత నమోదైంది. నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) ప్రకారం, భూకంప కేంద్రం 26.37 ఉత్తర అక్షాంశం, 92.29 తూర్పు రేఖాంశం వద్ద 50 కిలోమీటర్ల లోతులో కేంద్రీకృతమైంది.

Also Read:Jupally Krishna Rao : కృష్ణా జలాలపై కేసీఆర్ సంతకం తెలంగాణకు శాపం

మిడిల్ అస్సాంలోని కొన్ని ప్రాంతాలలో స్వల్పంగా ప్రకంపనలు అనుభవించినప్పటికీ, ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. అస్సాంతో పాటు, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, ఈశాన్యంలోని ఇతర ప్రాంతాలలో కూడా ప్రకంపనలు సంభవించాయి. అయితే, ఈ ప్రకంపనలు చాలా తేలికపాటివి కావడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

Exit mobile version