Site icon NTV Telugu

Jammu & Kashmir: జమ్మూ కాశ్మీర్‌లో మూడోసారి భూకంపం..

Kashmir

Kashmir

జమ్మూకశ్మీర్‌లో భూకంపం గత కొద్దిరోజులుగా భూకంపం వస్తూనే ఉంది. జమ్మూ కాశ్మీర్‌లోని కిష్త్వార్ జిల్లాలో ఇవాళ (ఆదివారం) తెల్లవారు జామున 3.5 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (ఎన్‌సిఎస్) తెలిపింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ భూకంపం తెల్లవారుజామున 2: 47 గంటల సమయంలో సంభవించింది తెలిపారు. అలాగే, నిన్న కూడా జమ్మూ కాశ్మీర్‌లోని కిష్త్వార్ జిల్లాలో 3.8 తీవ్రతతో భూకంపం వచ్చింది.

Read Also: PM Modi: నేడు బీహార్‌లో ప్రధాని మోడీ బహిరంగ సభ..

అయితే, జమ్మూకశ్మీర్‌లో వరుసగా గత మూడు రోజుల నుంచి ఆ ప్రాంతంలో భూ ప్రకంపనలు చోటు చేసుకోవడం ఇది మూడోసారి అని ఎన్సీఎస్ తెలిపింది. అంతకు ముందు శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో భూకంపం రాగా, రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 3.2గా నమోదు అయింది. ఇక, శనివారం మధ్యాహ్నం వచ్చిన భూకంపంలో 3. 8 తీవ్ర నమోదైంది. ఇక, ఇవాళ తెల్లవారు జామున వచ్చిన భూకంపం 3.5 శాతంగా రిక్టార్ స్కేలుపై నమోదైంది. అయితే, అదృష్టవశాత్తూ భూకంపం తీవ్రత స్వల్ప వ్యవధిలోనే ఉండటంతో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదు.

Exit mobile version