Drugs : డ్రగ్స్ కు అడ్డగా పబ్బులు.. ఎన్ని సార్లు రైడ్లు చేసినా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్లో డ్రగ్స్ ఎక్కడ దొరుకుతాయి? అని ఎవరైనా అడిగితే పబ్స్లో దొరుకుతాయని ఈజీగా సమాధానం చెప్పవచ్చు. అంతలా డ్రగ్స్ దందా అక్కడ నడుస్తోంది. ఏకంగా కొంత మంది డీజేలే పెడ్లర్ల అవతారం ఎత్తి వీఐపీలకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. డ్రగ్స్కు కేరాఫ్ అడ్రస్గా పబ్బులు.హైదరాబాద్లో పబ్బులు.. డ్రగ్స్కు కేరాఫ్ అడ్రస్గా మారుతున్నాయి.. పబ్బుల తీరు మారడం లేదనే విమర్శలు. ఒక్కసారి రెండుసార్లు కాదు.. పోలీసులు ఎన్నిసార్లు దాడులు చేసినా.. డ్రగ్స్ పట్టుబడుతూనే ఉన్నాయి. అంతే కాదు డ్రగ్స్ వినియోగంలో పబ్బుల తీరు మారడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.. .హైదరాబాద్ పబ్బులలో డ్రగ్స్ విచ్చలవిడిగా దొరుకుతున్నాయని మీడియా ఎప్పటి నుంచో చెబుతోంది. దాన్ని కంట్రోల్ చేసేందుకు పోలీసులు ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కానీ మాదక ద్రవ్యాల సప్లై మాత్రం ఆగడం లేదు…డ్రగ్స్ సప్లై చేస్తున్న డీజేలు.
ముఖ్యంగా పబ్లలో డ్రగ్స్ను.. అక్కడ పని చేసే డిస్క్ జాకీలు లేదా డీజేలు సప్లై చేస్తున్నారనే విషయం బయటపడింది. పెద్ద పెద్ద పబ్బులలో పనిచేస్తున్న డీజేలు తమ సైడు బిజినెస్గా డ్రగ్స్ అమ్మకాలు జరుపుతున్నారని పోలీసులు చెబుతున్నారు. హైదరాబాదులో పోలీసులు ఆకస్మికంగా పబ్బుల పైన సోదాలు నిర్వహించారు. ముఖ్యంగా డ్రగ్స్ గురించి సమాచారం అందిన తర్వాత గచ్చిబౌలి, మాదాపూర్లోని రెండు పబ్లపై దాడి చేశారు. పోలీసులు ఆన్-సైట్ డ్రగ్ పరీక్షలు నిర్వహించగా… నలుగురు యువకులకు పాజిటివ్గా తేలింది. పోలీసులకు దొరికిన వారంతా కూడా డీజేలే ఉన్నారు. నిబంధనలను ఉల్లంఘించి పనిచేస్తున్నట్లు సమాచారం. హైదరాబాద్లోని క్లబ్ రోగ్, ఫ్రాట్ హౌస్ పబ్లలో ఈ తనిఖీలు చేశారు పోలీసులు…
Also Read
- YCP vs TDP: బెజవాడలో ఉద్రిక్తత.. వైసీపీ దీక్షా శిబిరం టెంట్ తొలగించిన టీడీపీ శ్రేణులు!
- Tarun Tejpal: భారత మీడియాను ఊపేసిన కేసులో క్లైమాక్స్.. ‘తెహల్కా’ వ్యవస్థాపకుడికి హైకోర్టులో బిగ్ షాక్..
- Singareni Naini Coal Mine: సింగరేణి చరిత్రలో చారిత్రాత్మక ఘట్టం.. నైనీ గని నుంచి తెలంగాణకు చేరిన తొలి బొగ్గు రైలు
- Telangana Ration Cards: నూతన రేషన్ కార్డుల పంపిణీకి ముహూర్తం ఫిక్స్.. 1.05 కోట్ల మందికి కొత్త కార్డులు..
పబ్ యాజమాన్యంపై కూడా చర్యలు తీసుకునే అవకాశం . ఈ దాడుల్లో పోలీసులు అనేక మంది కస్టమర్లు మద్యం మత్తులో ఉన్నట్లు గుర్తించారు. స్థానికంగా నిర్వహించిన మాదకద్రవ్య పరీక్షల్లో నలుగురు వ్యక్తులు గంజాయి సేవించినట్లు నిర్ధారించారు. వారిని మాదాపూర్ పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకున్నారు. ఎన్డీపీఎస్ చట్టం కింద కేసులు నమోదు చేశారు. తమ ప్రాంగణంలో డ్రగ్ సంబంధిత కార్యకలాపాలను అనుమతించినందుకు పబ్ యాజమాన్యంపై కూడా చర్యలు తీసుకునే ఆలోచనలో ఉన్నారు… ఈ సంఘటన తర్వాత, మాదకద్రవ్యాల దుర్వినియోగాన్ని నివారించడానికి, చట్టపరమైన నిబంధనలను పాటించేలా చూడటానికి హైదరాబాద్ అంతటా నైట్ లైఫ్ సంస్థల పర్యవేక్షణను పెంచాలని పోలీసులు ప్రణాళికలు వేస్తున్నట్లు తెలుస్తోంది..
తాజావార్తలు
-
YCP vs TDP: బెజవాడలో ఉద్రిక్తత.. వైసీపీ దీక్షా శిబిరం టెంట్ తొలగించిన టీడీపీ శ్రేణులు!
-
Preity Zinta: ‘సగం ఇండియన్, సగం అమెరికన్… పిల్లలకు ఇండియన్ రూట్స్… ఎనిమిదేళ్ల రీఎంట్రీపై ప్రీతి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Tarun Tejpal: భారత మీడియాను ఊపేసిన కేసులో క్లైమాక్స్.. ‘తెహల్కా’ వ్యవస్థాపకుడికి హైకోర్టులో బిగ్ షాక్..
-
Mega Multistarrer : ఒకే స్క్రీన్పై వరుణ్ తేజ్ – నాగబాబు.. భారీ బడ్జెట్ పై నిర్మిస్తున్న నిహారిక
-
Singareni Naini Coal Mine: సింగరేణి చరిత్రలో చారిత్రాత్మక ఘట్టం.. నైనీ గని నుంచి తెలంగాణకు చేరిన తొలి బొగ్గు రైలు
ట్రెండింగ్
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!