ఉస్తాద్ రామ్ పోతినేని,డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీజగన్నాధ్ కాంబినేషన్ లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.రామ్ ,పూరి జగన్నాధ్ కు ఇస్మార్ట్ శంకర్ సినిమా బిగ్గెస్ట్ హిట్ అందించింది.ఇదిలా ఉంటే ఇస్మార్ట్ శంకర్ సినిమాకు సీక్వెల్ గా ప్రస్తుతం పూరి డబల్ ఇస్మార్ట్ తెరకెక్కిస్తున్నారు.డబుల్ ఇస్మార్ట్ మూవీ మార్చి 8 న గ్రాండ్ గా రిలీజ్ అయి వుండాల్సింది .కానీ పలు కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. ఇస్మార్ట్ శంకర్ లో రామ్ తన కెరీర్ లోనే సరికొత్తగా కనిపించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు.పూరి జగన్నాధ్ సొంత దర్శక నిర్మాణంలో డబల్ ఇస్మార్ట్ మూవీ తెరకెక్కుతుంది.
బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ ఎవరో మేకర్స్ వెల్లడించలేదు. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ జరిగిన ఈ సినిమా తాజాగా లాస్ట్ షెడ్యూల్ షూటింగ్ మొదలు పెట్టింది. ఆర్థిక ఇబ్బందుల వల్ల ఈ సినిమా షూటింగ్ నిలిచినట్లు గత కొంత కాలంగా వస్తున్నాయి.తాజాగా ముంబై లో కొత్త షూటింగ్ షెడ్యూల్ మొదలుపెట్టినట్టు ఈ సినిమా నిర్మాత ఛార్మి ప్రకటించడంతో రామ్ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకుంటున్నారు.తాజాగా షూటింగ్ సెట్ లో పూరి జగన్నాధ్, ఛార్మి పూజలు చేసిన ఫోటోలు తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. అద్భుతమైన షెడ్యూల్ ఆ గణేశుడి ఆశీర్వాదంతో మొదలయింది అని ఆమె తెలిపింది. ఈ షెడ్యూల్ లో బిగ్గెస్ట్ క్లైమాక్స్ తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.