Domestic Airlines : ఒక్క రోజులో 5 లక్షల మంది ప్రయాణం.. పెళ్లిళ్ల సీజన్లో రికార్డు క్రియేట్ చేసిన ఎయిర్లైన్స్
- రికార్డు క్రియేట్ చేసిన ఏవియేషన్ ఇండస్ట్రీ
- ఒక్క రోజులోనే 5లక్షల మంది ప్రయాణం
- పెళ్లిళ్ల సీజనే కారణమంటున్న నిపుణులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Domestic Airlines : దేశంలో పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. నవంబర్ 12 నుంచి ప్రారంభమైన ఈ సీజన్ డిసెంబర్ 16 వరకు కొనసాగనుంది. కాగా, దాదాపు 48 లక్షల వివాహాలు జరుగుతాయని అంచనా. పెళ్లిళ్ల వల్ల భారత్లో రూ.6 లక్షల కోట్ల వ్యాపారం జరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఈ వ్యాపారంలో ప్రయాణం కూడా ఒక భాగం. దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్య ఆదివారం విపరీతంగా పెరగడానికి ఇదే కారణం. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం… ఒక రోజులో 5,00,000 కంటే ఎక్కువ మంది ప్రయాణికులు దేశీయ విమానాల్లో ప్రయాణించడం భారతదేశంలో ఇదే మొదటిసారి.
విమానయాన మంత్రిత్వ శాఖ ఏం చెప్పింది?
దీనికి సంబంధించి పౌర విమానయాన మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. ఆదివారం 3,173 విమానాలలో మొత్తం 5,05,412 మంది ప్రయాణికులు దేశీయ ప్రయాణాలకు వెళ్లారు. ఈ మేరకు మంత్రిత్వ శాఖ X లో ఓ పోస్ట్ పెట్టింది.. అందులో “దేశ విమానయాన రంగం ఇప్పుడు గతంలో కంటే ఉన్నత స్థాయిలో ఉంది, ఇది నిర్భయంగా కలలు, గమ్యస్థానాలను కలుపుతోంది.” అంటూ రాసుకొచ్చింది.
Also Read
- KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
- PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
- Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
- Shreyas Iyer: మా ఓటమికి కారణం ఆ ఇద్దరే.. అస్సలు ఊహించలేదంటూ ఆవేదన వ్యక్తం చేసిన శ్రేయస్..
Read Also:Tecno Pop 9 Launch: ‘టెక్నో పాప్ 9’ వచ్చేస్తోంది.. ధర 10 వేల కంటే తక్కువే!
ఎప్పుడు, ఎంత మంది ప్రయాణికులు ప్రయాణించారు?
దేశంలో గత రెండు వారాలుగా విమానాల్లో ప్రయాణించే వారి సంఖ్య నిరంతరం పెరుగుతోంది. ఏవియేషన్ ఇండస్ట్రీ డేటా ప్రకారం.. నవంబర్ 8న 4,90,000 మంది ప్రయాణికులు ప్రయాణించగా, అది నవంబర్ 9 నాటికి 4,96,000కి పెరిగింది. నవంబర్ 14న ఈ సంఖ్య 4,97,000 కాగా, నవంబర్ 15 నాటికి 4,99,000కి పెరిగి నవంబర్ 16 నాటికి 4,98,000కి చేరుకుంది.
ప్రయాణికుల సంఖ్య ఎందుకు పెరుగుతోంది?
దేశంలో పెరుగుతున్న వర్క్ ఫ్రమ్ హోమ్ సంస్కృతి సౌలభ్యం ప్రజలకు ప్రయాణించే అవకాశాన్ని కల్పిస్తుందని ICRA సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అండ్ కో-గ్రూప్ హెడ్ – కార్పొరేట్ రేటింగ్స్ కింజల్ షా చెప్పారు. దీంతో పాటు టైర్-2, టైర్-3 నగరాల్లో కనెక్టివిటీ పెరగడం, విమానయాన సంస్థలు టిక్కెట్ ధరలను తగ్గించడం కూడా ప్రయాణికుల సంఖ్య పెరగడానికి కారణం. ఇది కాకుండా పెళ్లిళ్ల సీజన్ కావడంతో దేశీయ విమానాల్లో ప్రయాణికుల సంఖ్య పెరుగుతోంది.
Read Also:Rushikonda buildings: రుషికొండ భవనాలపై కౌన్సిల్లో డిష్యుం డిష్యుం..!
ఈ ప్రదేశాలకు బుక్ అవుతున్న టిక్కెట్లు
హిందుస్థాన్ టైమ్స్తో మాట్లాడుతూ , ఢిల్లీ, ముంబై, శ్రీనగర్, జైపూర్, గోవా వంటి ప్రధాన హాలిడే గమ్యస్థానాలకు విమాన బుకింగ్లు సంవత్సరానికి 70 నుండి 80శాతం వృద్ధిని కనబరుస్తున్నాయని ixigo గ్రూప్ సీఈవో చెప్పారు.
తాజావార్తలు
-
KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
-
PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
-
Ragi Mixture: సాయంత్రం స్నాక్స్లోకి క్రిస్పీ ‘రాగి మిక్సర్’.. సింపుల్గా హెల్తీగా ఇంట్లోనే ఇలా చేసుకోండి!
-
Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడికి షాక్.. రూల్స్ బ్రేక్ చేశారంటూ ట్రంప్కు ఫైన్ వేసిన అధికారులు! అసలేం జరిగిందంటే..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..