Domestic Airlines : ఒక్క రోజులో 5 లక్షల మంది ప్రయాణం.. పెళ్లిళ్ల సీజన్లో రికార్డు క్రియేట్ చేసిన ఎయిర్లైన్స్
- రికార్డు క్రియేట్ చేసిన ఏవియేషన్ ఇండస్ట్రీ
- ఒక్క రోజులోనే 5లక్షల మంది ప్రయాణం
- పెళ్లిళ్ల సీజనే కారణమంటున్న నిపుణులు
Domestic Airlines : దేశంలో పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. నవంబర్ 12 నుంచి ప్రారంభమైన ఈ సీజన్ డిసెంబర్ 16 వరకు కొనసాగనుంది. కాగా, దాదాపు 48 లక్షల వివాహాలు జరుగుతాయని అంచనా. పెళ్లిళ్ల వల్ల భారత్లో రూ.6 లక్షల కోట్ల వ్యాపారం జరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఈ వ్యాపారంలో ప్రయాణం కూడా ఒక భాగం. దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్య ఆదివారం విపరీతంగా పెరగడానికి ఇదే కారణం. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం… ఒక రోజులో 5,00,000 కంటే ఎక్కువ మంది ప్రయాణికులు దేశీయ విమానాల్లో ప్రయాణించడం భారతదేశంలో ఇదే మొదటిసారి.
విమానయాన మంత్రిత్వ శాఖ ఏం చెప్పింది?
దీనికి సంబంధించి పౌర విమానయాన మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. ఆదివారం 3,173 విమానాలలో మొత్తం 5,05,412 మంది ప్రయాణికులు దేశీయ ప్రయాణాలకు వెళ్లారు. ఈ మేరకు మంత్రిత్వ శాఖ X లో ఓ పోస్ట్ పెట్టింది.. అందులో “దేశ విమానయాన రంగం ఇప్పుడు గతంలో కంటే ఉన్నత స్థాయిలో ఉంది, ఇది నిర్భయంగా కలలు, గమ్యస్థానాలను కలుపుతోంది.” అంటూ రాసుకొచ్చింది.
Also Read
- Soft Pink Lips Tips: మీ పెదాలు మృదువుగా.. గులాబీ రంగులో మెరిసిపోయే చిట్కాలు ఇవే..
- Viral Video: భారత్ వస్తున్న నౌకను ఇరాన్ ఎలా సీజ్ చేసిందో చూడండి..
- Islamabad in Lockdown: 10 రోజులుగా లాక్డౌన్లో ఇస్లామాబాద్.. తిట్టిపోస్తున్న పాక్ ప్రజలు..
- Iran Mocks Trump: ‘‘షట్ అప్, ట్రంప్’’.. హైదరాబాద్ ఇరాన్ కాన్సులేట్ సెటైర్లు..
Read Also:Tecno Pop 9 Launch: ‘టెక్నో పాప్ 9’ వచ్చేస్తోంది.. ధర 10 వేల కంటే తక్కువే!
ఎప్పుడు, ఎంత మంది ప్రయాణికులు ప్రయాణించారు?
దేశంలో గత రెండు వారాలుగా విమానాల్లో ప్రయాణించే వారి సంఖ్య నిరంతరం పెరుగుతోంది. ఏవియేషన్ ఇండస్ట్రీ డేటా ప్రకారం.. నవంబర్ 8న 4,90,000 మంది ప్రయాణికులు ప్రయాణించగా, అది నవంబర్ 9 నాటికి 4,96,000కి పెరిగింది. నవంబర్ 14న ఈ సంఖ్య 4,97,000 కాగా, నవంబర్ 15 నాటికి 4,99,000కి పెరిగి నవంబర్ 16 నాటికి 4,98,000కి చేరుకుంది.
ప్రయాణికుల సంఖ్య ఎందుకు పెరుగుతోంది?
దేశంలో పెరుగుతున్న వర్క్ ఫ్రమ్ హోమ్ సంస్కృతి సౌలభ్యం ప్రజలకు ప్రయాణించే అవకాశాన్ని కల్పిస్తుందని ICRA సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అండ్ కో-గ్రూప్ హెడ్ – కార్పొరేట్ రేటింగ్స్ కింజల్ షా చెప్పారు. దీంతో పాటు టైర్-2, టైర్-3 నగరాల్లో కనెక్టివిటీ పెరగడం, విమానయాన సంస్థలు టిక్కెట్ ధరలను తగ్గించడం కూడా ప్రయాణికుల సంఖ్య పెరగడానికి కారణం. ఇది కాకుండా పెళ్లిళ్ల సీజన్ కావడంతో దేశీయ విమానాల్లో ప్రయాణికుల సంఖ్య పెరుగుతోంది.
Read Also:Rushikonda buildings: రుషికొండ భవనాలపై కౌన్సిల్లో డిష్యుం డిష్యుం..!
ఈ ప్రదేశాలకు బుక్ అవుతున్న టిక్కెట్లు
హిందుస్థాన్ టైమ్స్తో మాట్లాడుతూ , ఢిల్లీ, ముంబై, శ్రీనగర్, జైపూర్, గోవా వంటి ప్రధాన హాలిడే గమ్యస్థానాలకు విమాన బుకింగ్లు సంవత్సరానికి 70 నుండి 80శాతం వృద్ధిని కనబరుస్తున్నాయని ixigo గ్రూప్ సీఈవో చెప్పారు.
తాజావార్తలు
-
Soft Pink Lips Tips: మీ పెదాలు మృదువుగా.. గులాబీ రంగులో మెరిసిపోయే చిట్కాలు ఇవే..
-
Darling Re-release: రీ-రిలీజ్లో ‘డార్లింగ్’ విధ్వంసం.. మైండ్ బ్లాకింగ్ కలెక్షన్స్!
-
OMG: ఆడుకుంటూ గంగాళంలో ఇరుక్కున్న చిన్నారి.. చివరి ప్రయత్నంలో ఇలా..
-
Trisha : ఇట్స్ అఫీషియల్.. విజయ్’కి వోట్ వేయమని త్రిష హింట్?
-
Viral Video: భారత్ వస్తున్న నౌకను ఇరాన్ ఎలా సీజ్ చేసిందో చూడండి..
ట్రెండింగ్
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!