Site icon NTV Telugu

Singareni: సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్..

Singareni Workers

Singareni Workers

సీఎం రేవంత్ రెడ్డి సింగరేణి కార్మికులకు దీపావళి పండగకు ముందే అదిరిపోయే శుభవార్త చెప్పారు. సింగరేణి కార్మికులకు దీపావళి కానుక ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్ ఇవ్వనుంది. బోనస్ కింద రూ. 358 కోట్లు విడుదల చేసింది సర్కార్. ఈ మేరకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. శుక్రవారం ప్రతి కార్మికుని ఖాతాలో రూ. 93,750 జమ కానున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. దీంతో.. సంస్థలోని 42 వేల మంది కార్మికులు దీపావళి బోనస్ అందుకోనున్నారు. అంతకుముందు లాభాల వాట రూ. 796 కోట్లను కార్మికుడికి సగటున రూ. 1.90 లక్షలు అందజేసిన సగంతి తెలిసిందే..

Exit mobile version