Dharmendra Pradhan Resigns: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా సీజేపీ (CJP) ఆధ్వర్యంలో జరుగుతున్న వరుస నిరసనలు, ధర్నాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. పేపర్ లీక్కు నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా లేఖను ప్రధాని నరేంద్ర మోదీకి సమర్పించారు. యువత ఆకాంక్షలను గౌరవించే నిర్ణయమే ఇదని ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు. దేశంలో నీట్ (NEET) సహా పలు పోటీ పరీక్షల పేపర్ లీక్ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతున్న నేపథ్యంలో, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పనితీరుపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ క్రమంలో ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) నేతృత్వంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆయన రాజీనామాను డిమాండ్ చేస్తూ నిరసన ప్రదర్శనలు మరింత ముమ్మరమయ్యాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలలో ఈ అంశంపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నామని ప్రకటించినప్పటికీ, విద్యాశాఖ మంత్రి పదవి నుంచి ధర్మేంద్ర ప్రధాన్ తప్పుకున్న తర్వాతే దేనిపైనైనా చర్చ జరుగుతుందని కాంగ్రెస్ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు ప్రభుత్వం దిగి వచ్చింది.
Dharmendra Pradhan Resigns: విద్యాశాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా

Dharmendra Pradhan
