CPI Narayana : 500 అమ్మాయిలను రే*ప్ చేసి పూడ్చి పెట్టారు.. ధర్మస్థల ఘటనపై నారాయణ హాట్ కామెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CPI Narayana comments: కర్నాటకలోని పవిత్ర పుణ్యక్షేత్రం ధర్మస్థల. రెండు దశాబ్దాల్లో అక్కడ అనేక మంది మహిళలు, యువతులు హత్యకు గురయ్యారని, వారి మృతదేహాలను తానే పూడ్చి పెట్టానని పారిశుద్ధ్య ఉద్యోగి ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనం రేపింది. తన 20 ఏళ్ల సర్వీసులో, వందలాది శవాలను తాను ఖననం చేశానని, కొన్నిటిని డీజిల్ ఉపయోగించి కాల్చానని మంజునాథ ఆలయంలో 1995 నుంచి 2014 వరకు పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేసిన ఒక వ్యక్తి, జులై 3న దక్షిణ కన్నడ జిల్లా పోలీసులకు ఫిర్యాదు చేయడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ శవాల్లో ఎక్కువగా మహిళలు, మైనర్ బాలికలే ఉన్నారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ సామూహిక ఖనన కేసును సిట్ దర్యాప్తు చేస్తోంది. మృతదేహాలు పూడ్చి పెట్టిన 15 అనుమానిత ప్రదేశాలను పోలీసులు గుర్తించిన విషయం తెలిసిందే.
READ MORE: Road Accident: రాఖీ పౌర్ణమి రోజు విషాదం.. చెల్లి వద్దకు రాఖీ కోసం వెళ్తూ అనంత లోకాలకు..
Also Read
- IND vs AFG: ధర్మశాలలో గుర్బాజ్ సెంచరీతో విశ్వరూపం.. ఒకే ఇన్నింగ్స్తో భారత్పై బద్దలైన రికార్డులు...
- Jaishankar-Rubio: హార్ముజ్లో అమెరికా ఆదేశాలు పాటించాల్సిందే.. జైశంకర్కు రూబియో సూచన
- Trump: రేపు ట్రంప్ 80వ బర్త్డే.. వైట్హౌస్లో ప్రత్యేక ఏర్పాట్లు
- Missing Girl: ఆ చిన్నారి నవ్వులు ఏ క్రూరులు లాగేసుకున్నారు..? అంతుచిక్కని తుని మిస్టరీ.. ఏం జరిగింది..?
తిరుపతిలో సీపీఐ నారాయణ మాట్లాడుతూ..
తిరుపతిలో శ్రీవారి దర్శనం అనంతరం సీపీఐ నారాయణ ధర్మస్థల అంశంపై మాట్లాడారు.. ధర్మస్థల ట్రస్ట్ ఒక కుటుంబం చేతిలో ఉందని, ట్రస్ట్ సభ్యులు 1980 నుంచి ఇప్పటి వరుకు 500 మంది అమ్మాయిలను రేప్ చేసి చంపేసి ఆలయ ప్రాంగణంలోనే పూడ్చిపెట్టారని ఆరోపించారు. ఘటనపై ప్రజలందరూ ఆందోళన చేస్తే కర్ణాటకలో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి విచారణకు సిట్ వేసింది. అదే అక్కడ బీజేపీ సర్కార్ ఉంటే సిట్ వేసింది కాదన్నారు. గుడి కాంపోండ్ వెలుపల తవ్వకాలు చేపడితే ఎముకలు, పుర్రెలు బయటపడుతున్నాయని అన్నారు. అదేమన్న శ్మశాన వాటికనా, లేదా పవిత్ర దేవస్థలమా అని ప్రశ్నించారు. ధర్మస్థల ట్రస్ట్ ఛైర్మన్కి బీజేపీ బాసటగా ఉందని, ఆయను బీజేపీ వాళ్లు రాజ్యసభకు ఎంపీగా నామినేట్ చేయించారని తెలిపారు.
1980 లో ట్రస్ట్కు ఒక సీపీఎం నాయకుడు పోటీ చేశాడు. ట్రస్ట్ బోర్డుకు సంబంధం లేకుండా లోకల్ బోర్డుకు పోటీ చేయడానికి వీల్లేదన్నారు. దానికి ఆయన ఒప్పుకోలేదు. ఇది జరిగిన ఐదో రోజు ఆయన మైనర్ కుమార్తెను రేప్ చేసి చంపేశారని తెలిపారు. అప్పటి నుంచి ఆ ట్రస్ట్లో ఉన్నవాళ్లు ఇవే పనులు చేసుకుంటూ వస్తున్నారని విమర్శించారు. తమ పార్టీ డిమాండ్ ఏమిటంటే వెంటనే ఆ ట్రస్ట్ను ప్రభుత్వం స్వాధీనం చేసుకోని, ట్రస్ట్ బోర్డు సభ్యులందరిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
READ MORE: Sathya Raj : తలమీద కాలు పెట్టే సీన్.. ప్రభాస్ అలా అన్నాడు
తాజావార్తలు
-
Ragi Halwa: ముప్పై దాటిన మహిళల హెల్త్ కోసం బెస్ట్ స్వీట్.. రాగి పిండితో నోరూరించే హెల్దీ హల్వా!
-
IND vs AFG: ధర్మశాలలో గుర్బాజ్ సెంచరీతో విశ్వరూపం.. ఒకే ఇన్నింగ్స్తో భారత్పై బద్దలైన రికార్డులు…
-
Jaishankar-Rubio: హార్ముజ్లో అమెరికా ఆదేశాలు పాటించాల్సిందే.. జైశంకర్కు రూబియో సూచన
-
Maharashtra Politics: మహారాష్ట్రలో ‘ఆపరేషన్ టైగర్’ కలకలం.. షిండే గూటికి ఉద్ధవ్ ఎంపీలు జంప్! మాతోశ్రీలో అర్జెంట్ మీటింగ్..
-
Trump: రేపు ట్రంప్ 80వ బర్త్డే.. వైట్హౌస్లో ప్రత్యేక ఏర్పాట్లు
ట్రెండింగ్
-
Garlic for High Cholesterol: ఖాళీ కడుపుతో వెల్లుల్లి తినడం వల్ల బ్లాక్స్ తగ్గుతాయా..?
-
Home Remedies : ఇంట్లో చీమల బెడదా.? 2 పదార్థాలతో శాశ్వత పరిష్కారం.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు బెడదా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Nilufer: టర్కీ యువరాణి నుంచి హైదరాబాద్ ప్రజల ఆరాధ్యురాలిగా.. ‘నీలోఫర్’ అసాధారణ ప్రయాణం.!
-
Tirumala ఆలయ అద్భుతాలు.. శాస్త్రానికి అంతుచిక్కని వెంకటేశ్వరుని మహిమలు.!