Uttarpradesh : మంచంపై పడుకున్న యువకుడు.. ప్యాంట్లోకి దూరి ప్రైవేట్ పార్టుపై కాటేసిన పాము
Uttarpradesh : ప్రస్తుతం వానాకాలంలో జనాలు పాముకాటుకు గురైన వార్తలు తరచూ వినిపిస్తూనే ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లోని దేవాస్లో కూడా ఇలాంటి ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఓ యువకుడిని విషసర్పం కాటు వేసింది. వెంటనే జిల్లా ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే చాలా ఆలస్యం అయింది. దీంతో యువకుడు మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ ఘటన కన్కుంద్ ఖతాంబ ప్రాంతంలో చోటుచేసుకుంది. 15 ఏళ్ల చందన్ మాల్వియా బుధవారం రాత్రి భోజనం చేసి తన గదిలో నిద్రపోయాడు. అయితే కొద్ది సేపటి తర్వాత అతడికి ఏం జరగబోతోందో అతడికి గానీ, అతడి కుటుంబసభ్యులకు గానీ తెలియదు. అర్థరాత్రి ఒక్కసారిగా చందన్ నా ప్యాంటులో పాము దూరిందని కేకలు వేయడం ప్రారంభించాడు. చందన్ అరుపు విని అతడి మామయ్య దగ్గరకు పరిగెత్తాడు.
Read Also:Gold Rate Today: మగువలకు శుభవార్త.. వరుసగా రెండోరోజు తగ్గిన బంగారం ధరలు!
Also Read
- Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
- Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
- RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
తయా వెంటనే తన ప్యాంటులోంచి పామును బయటకు తీసి చంపేశాడు. వెంటనే చందన్ని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే పాము విషం అతడి శరీరం అంతటా వ్యాపించింది. దీంతో చందన్ అప్పటికే మృతి చెందాడు. పోలీసులు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి చందన్ కుటుంబసభ్యులకు అప్పగించారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడి తండ్రి ఏడాదిన్నర క్రితం మృతి చెందాడు. నాలుగు నెలల క్రితం చందన్ తల్లి తన కుమార్తెతో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయింది. అప్పటి నుండి అతను తన మామయ్యతో నివసిస్తున్నాడు. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Read Also:CM Chandrababu: భారీ వర్షాలు, వరదలపై సీఎం సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు
చందన్ను కాటు వేసిన పాము విషపూరితమైనదని వైద్యులు తెలిపారు. అందుకే పాము కాటు వేసిన వెంటనే చనిపోయాడు. అయితే వెంటనే కుటుంబ సభ్యులు యువకుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పుడు అతని నోటి నుండి నురుగు వచ్చింది. శరీరం నీలంగా మారిపోయింది. యువకుడి ప్రైవేట్ పార్ట్పై పాము కాటు వేసింది. ఆస్పత్రికి తరలించేలోపే మృతి చెందాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించామని వైద్యులు తెలిపారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. ఈ విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!