Money Prasad in Temple : దేవుడి ప్రసాదంగా డబ్బులు పంచుతున్నరు.. భక్తులారా త్వరపడండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Money Prasad in Temple : సాధారణంగా ఏ గుడికి వెళ్లినా భక్తులే డబ్బులను కానుకల రూపంలో ఆలయ హుండీల్లో వేస్తుంటారు. అదే తిరుపతి లాంటి ఆలయానికి వెళ్లితే తిరుమలేశుడికి నిలువుదోపిడీ ఇస్తుంటారు. తమ మొక్కులు చెల్లించుకుని కోరికలు నెరవేర్చమని భక్తులు దేవుడిని వేడుకుంటారు. అలాగే పూజారులు సైతం భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేస్తుంటారు. కానీ, ఓ ఆలయంలో మాత్రం భక్తులకు ప్రసాదానికి బదులు డబ్బులను పంచుతారు. అదీ దీపావళి పండుగ రోజున. మహారాష్ట్ర అమరావతిలోని ఉన్న కాళీమాత ఆలయంలో ఈ సంప్రదాయం కొనసాగుతోంది. దాదాపు 40 ఏళ్ల కిందట ఈ ఆచారాన్ని పూజారులు మొదలుపెట్టారు. దీపావళి రోజున రాత్రి 11 గంటల తర్వాత భక్తులకు డబ్బులను ప్రసాదంగా అందజేస్తారు.
Read Also: EC Shocking Decision: ఎన్నికల వేళ ఈసీ షాకింగ్ డెసిషన్.. ఏకంగా 900మంది బదిలీ
Also Read
- Trump vs Netanyahu: ట్రంప్ నిర్ణయంపై నెతన్యాహు తీవ్ర ఆగ్రహం.. అమెరికా 'లెటర్ ఆఫ్ ఇంటెంట్' పై ఇజ్రాయెల్ అనుమానాలు!
- Bandi Bhagirath Case: బండి భగీరథ్ కేసులో కొత్త ట్విస్ట్..
- Green Moong Chaat Recipe: రొటీన్ బ్రేక్ ఫాస్ట్ బోర్ కొట్టిందా..? సింపుల్గా హై ప్రోటీన్ పెసరపప్పు చాట్ ట్రై చేయండి..
- Petrol Diesel Price Hike: పెట్రోల్-డీజిల్ ధరలపై భారీ హెచ్చరికలు.. మరోసారి పెరుగుతాయా?
దీపావళి రోజు భక్తులకు డబ్బులు పంచితే మంచిదని, అందుకే ఇలా చేశామని అమ్మవారి ఆలయ పూజారి శక్తి మహారాజ్ తెలిపారు. 1984లో తానే ఈ ఆచారాన్ని ప్రారంభించానని, అప్పటి నుంచి ప్రతేడాది దీపావళి రోజు డబ్బులను పంచుతామన్నారు. పెద్ద పాత్రలో పది రూపాయలు నోట్లు ఉంచి ఒక్కొక్కరికీ రెండు, మూడు అందజేశారు. సోమవారం రాత్రి 11 గంటలకు మొదలుపెట్టి తెల్లవారుజామున 3 గంటల వరకూ వితరణ చేశారు. అమ్మవారి ప్రసాదంగా భావించి ఈ డబ్బులు తీసుకోడానికి గుడికి భక్తులు పోటెత్తారు. కరోనా మహమ్మారి కారణంగా గత రెండేళ్లుగా ఆలయాలు మూతపడ్డాయి. కోవిడ్-19 ప్రస్తుతం అదుపులోకి రావడంతో ఈ ఏడాది దీపావళి వితరణకు పోటెత్తారు.
Read Also: Vemula Prashanth Reddy: బిడ్డా మీ ఆటలు ఇక్కడ సాగవు.. ఇది కేసీఆర్ అడ్డా
శక్తి మహరాజ్ నుంచి డబ్బులు తీసుకుంటే అమ్మవారి ఆశీర్వదం లభించినట్టే భావిస్తారు. ఈ నోట్లను ఇంట్లో, తమ వ్యాపార కార్యాలయాలు, షాపులో ఉంచితే అమ్మవారి ఆశీస్సులు ఉంటాయని భక్తుల నమ్మకం. ఈ కార్యక్రమంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటుచేశారు.
తాజావార్తలు
-
Dragon Glimpse Records: ‘డ్రాగన్’ గ్లింప్స్తో చరిత్ర సృష్టించిన ఎన్టీఆర్.. 24 గంటల్లో భారతీయ సినీ హిస్టరీలోనే ఆల్టైమ్ రికార్డ్!
-
IPL 2026 Playoffs Race: ముంబైపై కేకేఆర్ విజయం.. సీఎస్కే ప్లేఆఫ్స్ ఛాన్సెస్ గల్లంతే, దేవుడు దిగొస్తే తప్ప!
-
Trump vs Netanyahu: ట్రంప్ నిర్ణయంపై నెతన్యాహు తీవ్ర ఆగ్రహం.. అమెరికా ‘లెటర్ ఆఫ్ ఇంటెంట్’ పై ఇజ్రాయెల్ అనుమానాలు!
-
iQOO Pad 6 Pro: ఐకూ ప్యాడ్ 6 ప్రో విడుదల.. 13,000mAh బ్యాటరీ, 13.2-అంగుళాల 4K LCD స్క్రీన్
-
Bandi Bhagirath Case: బండి భగీరథ్ కేసులో కొత్త ట్విస్ట్..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!