Devdutt Padikkal: విరాట్ – రోహిత్లకు సాధ్యం కానీ రికార్డ్.. ట్రోఫీ చరిత్రలో ఒకే ఒక్కడికి సొంతం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Devdutt Padikkal: విజయ్ హజారే ట్రోఫీ చరిత్రలో ఒకే ఒక్కడు సరికొత్త రికార్డును సొంతం చేసుకున్నాడు. ఈ టోర్నమెంట్లో పరుగుల వరద పారిస్తున్న ఆ ప్లేయర్ తాజాగా మరొక అరుదైన రికార్డును తన పేరున లిఖించుకున్నాడు. ఇంతకీ ఆ ప్లేయర్ ఎవరో తెలుసా.. కర్ణాటక బ్యాటర్ దేవ్దత్ పడిక్కల్. ఇప్పటికే ఈ టోర్నమెంట్లో వరుస సెంచరీలతో టన్నుల కొద్ది రికార్డులను తన పేరుపై నమోదు చేసుకుంటున్నా ఈ స్టార్.. తాజాగా మరొక అపూర్వ రికార్డ్ను తన పేరుపై లిఖించుకున్నాడు. అది ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.
READ ALSO: Jana Sena Party: ప్రజలకు, ప్రజా ప్రతినిధులకు జనసేన కీలక విజ్ఞప్తి.. అది వ్యవస్థ లోపమే..!
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
సోమవారం ముంబయితో జరిగిన క్వార్టర్ ఫైనల్లో ఈ కర్ణాటక బ్యాటర్ విజయ్ హజారే ట్రోఫీ సరికొత్త రికార్డును నెలకొల్పాడు. ఇప్పటి వరకు విరాట్- రోహిత్లకు సాధ్యం కానీ రికార్డును తన పేరున లిఖించుకొని సరికొత్త చరిత్రను లిఖించాడు. ఈ రోజు జరిగిన మ్యాచ్లో పడిక్కల్ (81*; 95 బంతుల్లో 11 ఫోర్లు) భారీ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ పాతికేళ్ల కుర్రాడు ప్రస్తుత సీజన్లో 721 పరుగులతో నిలిచాడు. దీంతో విజయ్ హజారే ట్రోఫీలో రెండుసార్లు 700కుపైగా రన్స్ చేసిన ఫస్ట్ బ్యాటర్గా హిస్టరీ క్రియెట్ చేశాడు. విజయ్ హజారే ట్రోఫీ 2020-21 సీజన్లోనూ దేవ్దత్ పడిక్కల్ 7 మ్యాచ్ల్లో 737 పరుగులు చేశాడు.
ఇక ఈ రోజు జరిగిన మ్యాచ్ విషయానికొస్తే.. ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబయి 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 254 పరుగులు చేసింది. ముంబై తరుఫున శామ్స్ ములానీ (86; 91 బంతుల్లో 8 ఫోర్లు) రాణించాడు. టార్గెట్ను ఛేదించడానికి మైదానంలోకి దిగిన కర్ణాటక.. పడిక్కల్ (81*; 95 బంతుల్లో 11 ఫోర్లు) భారీ ఇన్నింగ్స్, కరుణ్ నాయర్ (74*; 80 బంతుల్లో) రాణించడంతో 33 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 187 పరుగులు చేసింది. అనంతరం వర్షం పడటంతో ఆట నిలిచిపోయింది. దీంతో వీజేడీ పద్ధతి ప్రకారం కర్ణాటక 55 పరుగుల తేడాతో విజయం సాధించినట్లు తెలిపారు. ఈ టోర్నీలో పరుగుల వరద పారిస్తున్న దేవ్దత్ పడిక్కల్ పక్కా భవిష్యత్తులో భారత క్రికెట్ జట్టులో సుస్థిర స్థానాన్ని సంపాదించుకొని గొప్ప బ్యాట్స్మెన్గా నిలుస్తాడని పలువురు క్రికెట్ పండితులు అభిప్రాయపడుతున్నారు.
READ ALSO: Apple Watch Series 11: ఆపిల్ వాచ్లపై భారీ డిస్కౌంట్.. ఎన్ని వేలు తగ్గిందో చూసేయండి!
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!