Site icon NTV Telugu

Pawan Kalyan: కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ భేటీ

Pawan Kalyan

Pawan Kalyan

Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ హస్తిన పర్యటనలో ఉన్నారు. తొలిసారి ఏపీ ఉపముఖ్యమంత్రి హోదాలో పవన్‌ కల్యాణ్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి అమిత్‌ షాతో సమావేశమయ్యారు. దాదాపు 15 నిమిషాల పాటు అమిత్‌ షాతో పవన్ భేటీ అయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల అంశం ఇరువురి మధ్య చర్చకు వచ్చినట్లు తెలిసింది. ఇదిలా ఉండగా.. అంతకుముందు పవన్‌ మీడియాతో మాట్లాడుతూ అమిత్ షాతో మర్యాదపూర్వకంగానే సమావేశమవుతున్నామని తెలిపారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటివరకూ ఢిల్లీ పెద్దలను కలవలేదని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో మర్యాదపూర్వకంగానే సమావేశమవుతున్నామని పవన్ వెల్లడించారు. ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి మరింత బాధ్యతగా ఉంటామన్నారు. అప్పుడైనా ఇప్పుడైనా బాధ్యతతోనే పర్యటనలు చేస్తున్నామని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ పేర్కొన్నారు.

Read Also: Deputy CM Pawan Kalyan: అమిత్‌ షాతో మర్యాదపూర్వకంగానే సమావేశమవుతున్నా..

 

Exit mobile version