NTV Telugu Site icon

Delhi University : డీయూకు చెందిన బీఏ పొలిటికల్ సైన్స్ సిలబస్ లో మార్పు.. సావర్కర్‌పై కొత్త అధ్యాయం

Delhi University

Delhi University

Delhi University : ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన బీఏ పొలిటికల్ సైన్స్ సిలబస్‌లో అనేక మార్పులు చేశారు. యూనివర్శిటీ ఐదవ సెమిస్టర్‌లో హిందుత్వ సిద్ధాంతకర్త డిడి సావర్కర్‌పై ఒక అధ్యాయాన్ని చేర్చింది. అదే సమయంలో మహాత్ముడికి సంబంధించిన అధ్యాయం ఏడవ సెమిస్టర్‌కు మార్చబడింది. ఢిల్లీ యూనివర్శిటీ సిలబస్‌లో వీడీ సావర్కర్‌పై అధ్యాయాన్ని చేర్చడం ఇదే తొలిసారి. యూనివర్సిటీ పాఠ్యాంశాల్లో మార్పులు చేసేందుకు శుక్రవారం అకడమిక్ కౌన్సిల్ (ఏసీ) సమావేశం జరిగింది. ఈ రెండు ప్రధాన మార్పులకు ఈ సమావేశంలో ఆమోదం లభించింది. సమావేశంలో సభ్యుడు అలోక్ రంజన్ మాట్లాడుతూ.. ఇంతకుముందు సావర్కర్ సిలబస్‌లో భాగం కాదని, మహాత్మా గాంధీకి ఐదవ సెమిస్టర్‌లో బోధించారని చెప్పారు.

Read Also:New Parliament Inauguration: కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించిన ప్రధాని మోడీ

కొత్త మార్పు తర్వాత సావర్కర్‌ను ఐదో సెమిస్టర్‌లో, అంబేద్కర్‌ను ఆరో సెమిస్టర్‌లో, ఏడో సెమిస్టర్‌లో మహాత్మాగాంధీకి సంబంధించిన అధ్యాయాన్ని చేర్చినట్లు ఆయన చెప్పారు. సావర్కర్‌ అధ్యాయంను చేర్చుకోవడంపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, అయితే మహాత్మాగాంధీకి సంబంధించిన అధ్యాయం గురించి బోధించకూడదని రంజన్ అన్నారు. బీఏ పొలిటికల్‌ సైన్స్‌ సిలబస్‌ నుంచి కవి ముహమ్మద్‌ ఇక్బాల్‌ని తొలగించినట్లు శనివారం నాడు వార్తలు వచ్చాయి. మహమ్మద్ ఇక్బాల్ తొలగింపుపై, భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి పునాది వేసిన పాఠ్యాంశాల్లో అతనికి స్థానం లేదని డియు వైస్-ఛాన్సలర్ యోగేష్ సింగ్ అన్నారు.

Read Also:NTR Ghat: ఆయన కొడుకుగా పుట్టడం అదృష్టం.. ఎన్టీఆర్ ఘాట్ లో బాలకృష్ణ, జూ.ఎన్టీఆర్‌ నివాళి

ఈ సమావేశంలో ఇక్బాల్‌ను సిలబస్‌ నుంచి తొలగించడంపై పలువురు సభ్యులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. ‘సారే జహాన్ సే అచ్చా హిందుస్థాన్ హమారా’ కవిత ద్వారా ఇక్బాల్ భారతదేశానికి సాటిలేని సేవలందించారని సభ్యులు పేర్కొన్నారు. సమావేశంలో ఇక్బాల్‌ను తొలగిస్తూ ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకోలేదు. ఈ నిర్ణయంపై పలువురు సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. సమావేశంలో విసి సింగ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి మరింత బోధించాలని ఉద్ఘాటించారు. అంబేద్కర్ గురించి మరింత ఎక్కువ సమాచారం జోడించాలని అధ్యాపకులను కోరారు.