Assault: మంచి నీళ్ల కోసం ఇంట్లోకి చొరబడి.. 35 ఏళ్ల మహిళపై దారుణం..HIV ఉందన్నా వదలకుండా..
- దాహం వేస్తుందంటూ ఇంట్లోకి ప్రవేశించిన దుండగుడు..
- అత్యంత పాశవికంగా లైంగిక దాడి..
- అనారోగ్యంతో ఉన్నానన్నా కనికరించని వైనం..
పల్నాడు జిల్లాలోని మాచర్ల పట్టణంలో సభ్య సమాజం తలదించుకునేలా ఒక అమానుష ఘటన వెలుగుచూసింది. తన ఇంటి వద్ద ఒంటరిగా ఉన్న ఒక మహిళపై గుర్తు తెలియని దుండగుడు పాశవికంగా దాడి చేసి, ప్రాణాపాయ స్థితిలోకి నెట్టాడు. ప్రస్తుతం బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. పోలీసులు నిందితుడి కోసం వేట మొదలుపెట్టారు.
ఏం జరిగిందంటే..
Also Read
- Extramarital affair: భర్త స్నేహితుడితో ఏమిటా పని.. పైగా వాట్సాప్ స్టేటస్ కూడా పెట్టేసింది..
- Anantapur Honey Trap Case: అనంతపురం హనీ ట్రాప్ కేసులో బిగ్ ట్విస్ట్.. వైసీపీ నేత అరెస్ట్..!
- TCS Nashik Case: ఛాతి వైపు అసభ్యంగా చూపులు… పిల్లల కోసం మౌల్వీని కలవమని ఒత్తిడి
- IRS Officer Daughter Murder: నిందితుడి నేర చరిత్ర తెలిసి షాకైన పోలీసులు.. బ్యాగ్రౌండ్ ఎంత ఘోరమంటే..!
ఏప్రిల్ 2వ తేదీ గురువారం సాయంత్రం, మాచర్లలో ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తున్న ఓ 35 ఏళ్ల మహిళ తన నివాసంలో ఒంటరిగా ఉంది. ఆ సమయంలో ఒక వ్యక్తి ‘దాహంగా ఉంది.. మంచినీళ్లు కావాలి’ అని ఆమెను నమ్మించి లోపలికి ప్రవేశించాడు. ఆమెపై లైంగిక దాడికి ప్రయత్నించగా.. తాను అనారోగ్యంతో (హెచ్ఐవీ) ఉన్నానని మొరపెట్టుకున్నా ఆ కిరాతకుడు కనికరించలేదు. బాధితురాలిని స్కార్ఫ్తో కట్టేసి, కత్తితో బెదిరించి అత్యాచారానికి ఒడిగట్టాడు. అంతటితో ఆగకుండా, ఆమెను తీవ్రంగా కొట్టి, మర్మాంగాల్లోకి ఇనుప రాడ్ను చొప్పించి అత్యంత క్రూరంగా ప్రవర్తించి అక్కడి నుంచి పారిపోయాడు.
Also Read:Mee Seva Shutdown: నేటి రాత్రి నుంచి మీ సేవా కేంద్రాలు బంద్.. ఎన్ని రోజులంటే..
వెలుగులోకి వచ్చిందిలా..
బాధితురాలితో కలిసి నివసిస్తున్న ఆమె మేనల్లుడు పదో తరగతి పరీక్షల అనంతరం తల్లిదండ్రుల వద్దకు వెళ్లాడు. సాయంత్రం అత్తకు ఫోన్ చేసినా తీయకపోవడంతో అనుమానం వచ్చి బంధువులను పంపాడు. వారు వెళ్లి చూడగా, ఆమె రక్తపు మడుగులో అపస్మారక స్థితిలో పడి ఉండటం చూసి హతాశులయ్యారు. వెంటనే ఆమెను మాచర్ల నుంచి నరసరావుపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
ఈ ఘటనపై మాచర్ల టౌన్ సీఐ వెంకట రమణ నేతృత్వంలో కేసు నమోదైంది. పల్నాడు జిల్లా పోలీసులు నిందితుడిని పట్టుకునేందుకు నాలుగు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. పట్టణంలోని సీసీటీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఈ అమానవీయ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
తాజావార్తలు
-
Off The Record : కాంగ్రెస్ పెద్దలకు తలనొప్పిగా ఆర్మూర్ వ్యవహారాలు
-
Rose Lassi Recipe: ఎప్పుడైనా రోజ్ లస్సీని రుచి చూశారా..? ఇలా సింపుల్గా తయారు చేయండి.. వన్ మోర్ అనాల్సిందే..
-
Telangana Cabinet: రాష్ట్ర కేబినెట్లో కీలక నిర్ణయాలు.. అక్కడ అతి పెద్ద స్టేడియం నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
-
India New Gaming Rules 2026: సర్కార్ సరి కొత్త గేమింగ్ రూల్స్.. ప్రయోజనకరమా లేక హానికరమా..?
-
Sanju Samson: సంజూ శాంసన్ వీర విహారం.. దెబ్బకు ఆ రికార్ట్స్ అన్నీ బ్రేక్..
ట్రెండింగ్
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!