Assault: మంచి నీళ్ల కోసం ఇంట్లోకి చొరబడి.. 35 ఏళ్ల మహిళపై దారుణం..HIV ఉందన్నా వదలకుండా..
- దాహం వేస్తుందంటూ ఇంట్లోకి ప్రవేశించిన దుండగుడు..
- అత్యంత పాశవికంగా లైంగిక దాడి..
- అనారోగ్యంతో ఉన్నానన్నా కనికరించని వైనం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పల్నాడు జిల్లాలోని మాచర్ల పట్టణంలో సభ్య సమాజం తలదించుకునేలా ఒక అమానుష ఘటన వెలుగుచూసింది. తన ఇంటి వద్ద ఒంటరిగా ఉన్న ఒక మహిళపై గుర్తు తెలియని దుండగుడు పాశవికంగా దాడి చేసి, ప్రాణాపాయ స్థితిలోకి నెట్టాడు. ప్రస్తుతం బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. పోలీసులు నిందితుడి కోసం వేట మొదలుపెట్టారు.
ఏం జరిగిందంటే..
Also Read
- Uttar Pradesh: టీ-షర్ట్, ప్యాంట్ వేసుకోవడంపై గొడవ.. భార్యను చంపిన భర్త ఆత్మహత్య..
- Delhi Gang R*ape: కదులుతున్న బస్సులో మహిళపై సామూహిక అత్యాచారం.. కండక్టర్, డ్రైవర్ అరెస్ట్.!
- Murder Case: జైలు నుంచే స్కెచ్.. రిటైర్డ్ ఐపిఎస్ హత్య కేసులో బయటపడుతున్న సంచలన విషయాలు.!
- TCS Nashik Case: టీసీఎస్ నాసిక్ మతమార్పిడి కేసు.. నిదాఖాన్కు ఆశ్రయం ఇచ్చిన ఇంటిని కూల్చి వేస్తారా.?
ఏప్రిల్ 2వ తేదీ గురువారం సాయంత్రం, మాచర్లలో ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తున్న ఓ 35 ఏళ్ల మహిళ తన నివాసంలో ఒంటరిగా ఉంది. ఆ సమయంలో ఒక వ్యక్తి ‘దాహంగా ఉంది.. మంచినీళ్లు కావాలి’ అని ఆమెను నమ్మించి లోపలికి ప్రవేశించాడు. ఆమెపై లైంగిక దాడికి ప్రయత్నించగా.. తాను అనారోగ్యంతో (హెచ్ఐవీ) ఉన్నానని మొరపెట్టుకున్నా ఆ కిరాతకుడు కనికరించలేదు. బాధితురాలిని స్కార్ఫ్తో కట్టేసి, కత్తితో బెదిరించి అత్యాచారానికి ఒడిగట్టాడు. అంతటితో ఆగకుండా, ఆమెను తీవ్రంగా కొట్టి, మర్మాంగాల్లోకి ఇనుప రాడ్ను చొప్పించి అత్యంత క్రూరంగా ప్రవర్తించి అక్కడి నుంచి పారిపోయాడు.
Also Read:Mee Seva Shutdown: నేటి రాత్రి నుంచి మీ సేవా కేంద్రాలు బంద్.. ఎన్ని రోజులంటే..
వెలుగులోకి వచ్చిందిలా..
బాధితురాలితో కలిసి నివసిస్తున్న ఆమె మేనల్లుడు పదో తరగతి పరీక్షల అనంతరం తల్లిదండ్రుల వద్దకు వెళ్లాడు. సాయంత్రం అత్తకు ఫోన్ చేసినా తీయకపోవడంతో అనుమానం వచ్చి బంధువులను పంపాడు. వారు వెళ్లి చూడగా, ఆమె రక్తపు మడుగులో అపస్మారక స్థితిలో పడి ఉండటం చూసి హతాశులయ్యారు. వెంటనే ఆమెను మాచర్ల నుంచి నరసరావుపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
ఈ ఘటనపై మాచర్ల టౌన్ సీఐ వెంకట రమణ నేతృత్వంలో కేసు నమోదైంది. పల్నాడు జిల్లా పోలీసులు నిందితుడిని పట్టుకునేందుకు నాలుగు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. పట్టణంలోని సీసీటీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఈ అమానవీయ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
తాజావార్తలు
-
Off The Record : విచ్చలవిడిగా ఇసుక అక్రమాలు.. మైనింగ్ ఏడీ ఫణిభూషణ్ పై తీవ్ర ఆరోపణలు
-
Story Board : నిర్లక్ష్యానికి శిక్షల్లేవా? పిల్లల మానసిక వేదన పట్టించుకోరా?
-
Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
-
DGP CV Anand: ఉగ్ర ముప్పుపై తెలంగాణ అప్రమత్తం.. OCTOPUS యాక్షన్ ప్లాన్..!
-
Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!