Delhi Government: ఆ 70 మంది ఎమ్మెల్యేలకు ఐఫోన్ 16 ప్రోలు గిఫ్ట్ ఇచ్చిన సర్కార్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi Government: ఢిల్లీ ప్రభుత్వం ఎమ్మెల్యేలందరికీ సరికొత్త ఐఫోన్ 16 ప్రోలను అందజేసింది. కేంద్రం తీసుకొచ్చిన “వన్ నేషన్, వన్ అప్లికేషన్” కార్యక్రమంలో భాగంగా ఢిల్లీ ప్రభుత్వం నేషనల్ ఈ-విధాన్ అప్లికేషన్ అమలులో ముందుడువేస్తూ సోమవారం శాసన సభ్యులందరికీ సరికొత్త ఐఫోన్ 16 ప్రోలను అందజేసింది. వర్షాకాల సమావేశాల మొదటి రోజు ఫోన్ల పంపిణీ ముఖ్యాంశాల్లో నిలిచింది.
READ MORE: Singireddy Niranjan Reddy : కమిషన్లు కోర్టులు కావు.. నిరంజన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
Also Read
- PoK Protest: పాక్ ఆక్రమిత కాశ్మీర్లో హింసాకాండ.. 12 మంది మృతి, రేంజర్ల మోహరింపు..
- Gas Cylinder: గ్యాస్ వినియోగదారులకు భారీ శుభవార్త.. ఇక నిమిషాల్లోనే సిలిండర్ డెలివరీ..
- Mudragada Padmanabham: మరణానంతరం ఎలా ఉండాలో ముందే లేఖ రాసిన ముద్రగడ.. ఆసక్తికర అంశాలు
- ICC: కీలక నిర్ణయం తీసుకున్న ఐసీసీ.. టీ20, వన్డే ప్రపంచకప్ ఫార్మాట్లలో పలు మార్పులు..
70 మంది ఎమ్మెల్యేలకు ఐఫోన్లు
ప్రభుత్వం కాగిత రహిత పాలనలో తీసుకొచ్చిన ఫస్ట్ స్టెఫ్గా ఢిల్లీ అసెంబ్లీలోని 70 మంది ఎమ్మెల్యేకు సరికొత్త ఐఫోన్ 16 ప్రోను అందజేసినట్లు విధానసభ సెక్రటేరియట్ అధికారి ఒకరు తెలిపారు. ఎమ్మెల్యేలందరూ ఇప్పటి నుంచి వారివారి అధికారిక కార్యక్రమాల్లో వీటిని వినియోగిస్తారని పేర్కొన్నారు. సీఎం రేఖ గుప్తాతో సహా అందరు ఎమ్మెల్యేలకు ఐఫోన్లతో పాటు, ఐప్యాడ్లు, టాబ్లెట్లను కూడా అందజేశారు. టెక్-ఆధారిత పరిజ్ఞానం, కాగిత రహిత పాలనపై ప్రజాప్రతినిధులకు అవగాహన తీసుకురాడవంలో భాగంగా ఢిల్లీ అసెంబ్లీలో ఎమ్మెల్యేలకు ఈ స్మార్ట్ఫోన్లను అందజేసినట్లు ఓ జాతీయ మీడియా సంస్థ నివేదిక స్పష్టం చేసింది.
ట్రైనింగ్ తీసుకున్న ఎమ్మెల్యేలు..
గత నెలలో డిజిటల్ ఇంటర్ఫేస్ వాడకంపై ఎమ్మెల్యేలందరూ శిక్షణ పొందినట్లు అధికారులు పేర్కొన్నారు. శిక్షణలో మైక్రోఫోన్లు ఓటింగ్ ప్యానెల్లతో కూడిన స్మార్ట్ డెలిగేట్ యూనిట్లు, RFID/NFC (రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్) యాక్సెస్, బహుభాషా మద్దతు, ఐప్యాడ్ల ద్వారా రియల్-టైమ్ డాక్యుమెంట్ యాక్సెస్, HD కెమెరాలతో కూడిన ఆటోమేటెడ్ AV సిస్టమ్, సురక్షితమైన, పవర్-బ్యాక్డ్ నెట్వర్కింగ్ వాతావరణం పని తీరును వారు తెలుసుకున్నట్లు తెలిపారు.
READ MORE: PM Modi: గాల్వాన్ లోయ వివాదం తర్వాత.. తొలిసారి చైనాలో పర్యటించనున్న ప్రధాని మోడీ
తాజావార్తలు
-
PoK Protest: పాక్ ఆక్రమిత కాశ్మీర్లో హింసాకాండ.. 12 మంది మృతి, రేంజర్ల మోహరింపు..
-
Gas Cylinder: గ్యాస్ వినియోగదారులకు భారీ శుభవార్త.. ఇక నిమిషాల్లోనే సిలిండర్ డెలివరీ..
-
Mudragada Padmanabham: మరణానంతరం ఎలా ఉండాలో ముందే లేఖ రాసిన ముద్రగడ.. ఆసక్తికర అంశాలు
-
SS Rajamouli: ఎవరూ ఊహించని హీరోతో దర్శకధీరుడు రాజమౌళి కొత్త సినిమా..
-
ICC: కీలక నిర్ణయం తీసుకున్న ఐసీసీ.. టీ20, వన్డే ప్రపంచకప్ ఫార్మాట్లలో పలు మార్పులు..
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!