Delhi Flu: పెరుగుతున్న ఫ్లూ బాధితులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీలో కరోనా కేసులు పెరుగుతుండటంతో, ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు ప్రారంభించింది. పబ్లిక్ ప్లేసెస్ లో మాస్కును తప్పనిసరి చేసింది. మాస్కులేకపోతే ఐదొందల రూపాయల జరిమానా తప్పదని హెచ్చరించింది. కార్లలో ప్రయాణించే వారికి మాస్కు నుంచి మినహాయింపు ఇచ్చింది ఢిల్లీ ప్రభుత్వం. అలాగే స్కూళ్లలో విద్యార్థులు, టీచర్లు, సిబ్బంది ప్రతి ఒక్కర్నీ థర్మల్ స్కానింగ్ చేసిన తర్వాతే, అనుమతించాలని తెలిపింది. పాజిటివ్ అని తేలిన పిల్లలను పాఠశాలకు పంపొద్దని తల్లిదండ్రులను కోరింది.
ఢిల్లీలో ఒక్కరోజే రికార్డుస్థాయిలో 967 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇండియాలో 2400కి పైగా కోవిడ్ కేసులు వెలుగు చూశాయి. దీంతో పలు రాష్ట్రాల ప్రభుత్వాలు కోవిడ్ కొత్త మార్గదర్శకాలు జారీ చేస్తున్నాయి. మాస్క్ నిబంధనను తప్పనిసరి చేస్తున్నాయి. మాస్క్ లేకుండా తిరిగితే జరిమానాలు వేయాలని ఢిల్లీ ప్రభుత్వం సూచించింది. మరోవైపు ఢిల్లీలో ఇన్ ఫ్లూయెంజా లక్షణాలున్న వారి సంఖ్య గణనీయంగా పెరగడంపై వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Also Read
- Two Trains: ఒకే ట్రాక్పై ఎదురెదురుగా వచ్చిన ట్రైన్లు.. తృటిలో తప్పిన ప్రమాదం..
- KC Venugopal: కాంగ్రెస్లో టీఎంసీ విలీనంపై కీలక వ్యాఖ్యలు.. సోనియా-మమత భేటీపై కేసీ.వేణుగోపాల్ క్లారిటీ
- Firing: హర్యానాలో దారుణం.. జిమ్ యజమానిపై బుల్లెట్ల వర్షం.. 5 సెకండ్లలో 10 రౌండ్ల కాల్పులు..
- Meenakshi Natarajan: మీనాక్షి నటరాజన్కు బిగ్ షాక్.. రాజ్యసభ ఆశలు ఆవిరి
ఫ్లూ లక్షణాలే కదా అని నిర్లక్ష్యం వద్దంటున్నారు డాక్టర్లు. ఈతరహా లక్షణాలు మూడు రోజులకు మించి కొనసాగితే కనుక వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు. జ్వరం, దగ్గు, అతిసారం, తీవ్ర బలహీనత, మగతగా ఉండడం, ఆక్సిజన్ శాచురేషన్ తగ్గడం ఇవన్నీ మూడు రోజులకు మించి ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలనేది సూచించారు.
ఆలస్యం చేస్తే ఫలితాలు వేరే విధంగా ఉంటాయని డాక్టర్లు అంటున్నారు. ఇన్ ఫ్లూయెంజా లక్షణాలున్న కేసులు గత వారం రోజుల్లో 30 శాతం పెరిగినట్లు తెలిపారు. గత వారం రోజుల్లో ఓపీకి వస్తున్న రోగుల్లో 40 శాతం మందిలో ఇన్ ఫ్లూయెంజా తరహా అనారోగ్య లక్షణాలు ఉంటున్నాయని ప్రముఖ ఆస్పత్రి వైద్యులు అంటున్నారు. కోవిడ్ తగ్గుముఖం పట్టినా వివిధ లక్షణాలు మాత్రం అలాగే వున్నాయంటున్నారు వైద్యులు. జ్వరం, దగ్గు, డయేరియా ఇతర లక్షణాలు కనిపించి రెండు మూడు రోజుల్లోనే తగ్గిపోతున్నాయి. అయినా కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు.
Read Also: Bomb Blast: ఆఫ్ఘనిస్తాన్లో ఉగ్ర దాడి.. 33 మంది మృతి.. 43 మందికి తీవ్రగాయాలు
తాజావార్తలు
-
Two Trains: ఒకే ట్రాక్పై ఎదురెదురుగా వచ్చిన ట్రైన్లు.. తృటిలో తప్పిన ప్రమాదం..
-
KC Venugopal: కాంగ్రెస్లో టీఎంసీ విలీనంపై కీలక వ్యాఖ్యలు.. సోనియా-మమత భేటీపై కేసీ.వేణుగోపాల్ క్లారిటీ
-
Rajya Sabha Elections: ఏపీ నుంచి రాజ్యసభకు నలుగురు సభ్యులు ఏకగ్రీవ ఎన్నిక.. అధికారిక ప్రకటన
-
Firing: హర్యానాలో దారుణం.. జిమ్ యజమానిపై బుల్లెట్ల వర్షం.. 5 సెకండ్లలో 10 రౌండ్ల కాల్పులు..
-
AP Schools: ఏపీలో మోగనున్న బడిగంట.. రేపటి నుంచి తెరుచుకోనున్న స్కూళ్లు
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!