Delhi Flu: పెరుగుతున్న ఫ్లూ బాధితులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీలో కరోనా కేసులు పెరుగుతుండటంతో, ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు ప్రారంభించింది. పబ్లిక్ ప్లేసెస్ లో మాస్కును తప్పనిసరి చేసింది. మాస్కులేకపోతే ఐదొందల రూపాయల జరిమానా తప్పదని హెచ్చరించింది. కార్లలో ప్రయాణించే వారికి మాస్కు నుంచి మినహాయింపు ఇచ్చింది ఢిల్లీ ప్రభుత్వం. అలాగే స్కూళ్లలో విద్యార్థులు, టీచర్లు, సిబ్బంది ప్రతి ఒక్కర్నీ థర్మల్ స్కానింగ్ చేసిన తర్వాతే, అనుమతించాలని తెలిపింది. పాజిటివ్ అని తేలిన పిల్లలను పాఠశాలకు పంపొద్దని తల్లిదండ్రులను కోరింది.
ఢిల్లీలో ఒక్కరోజే రికార్డుస్థాయిలో 967 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇండియాలో 2400కి పైగా కోవిడ్ కేసులు వెలుగు చూశాయి. దీంతో పలు రాష్ట్రాల ప్రభుత్వాలు కోవిడ్ కొత్త మార్గదర్శకాలు జారీ చేస్తున్నాయి. మాస్క్ నిబంధనను తప్పనిసరి చేస్తున్నాయి. మాస్క్ లేకుండా తిరిగితే జరిమానాలు వేయాలని ఢిల్లీ ప్రభుత్వం సూచించింది. మరోవైపు ఢిల్లీలో ఇన్ ఫ్లూయెంజా లక్షణాలున్న వారి సంఖ్య గణనీయంగా పెరగడంపై వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Also Read
- Dharmendra Pradhan: నీట్పై చర్చకు సిద్ధం.. విద్యార్థుల పేరుతో రాజకీయాలు వద్దు రాహుల్..
- Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
- Congress: బంగ్లాదేశ్ ఉదాహరణతో కాంగ్రెస్కు కేంద్రం స్ట్రాంగ్ వార్నింగ్.. ప్రధాని నివాసం ముందు నిరసనపై ఫైర్
- Rahul Gandhi: రాహుల్గాంధీని ఈడ్చుకెళ్లిన పోలీసులు.. ముక్కుకు గాయం?
ఫ్లూ లక్షణాలే కదా అని నిర్లక్ష్యం వద్దంటున్నారు డాక్టర్లు. ఈతరహా లక్షణాలు మూడు రోజులకు మించి కొనసాగితే కనుక వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు. జ్వరం, దగ్గు, అతిసారం, తీవ్ర బలహీనత, మగతగా ఉండడం, ఆక్సిజన్ శాచురేషన్ తగ్గడం ఇవన్నీ మూడు రోజులకు మించి ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలనేది సూచించారు.
ఆలస్యం చేస్తే ఫలితాలు వేరే విధంగా ఉంటాయని డాక్టర్లు అంటున్నారు. ఇన్ ఫ్లూయెంజా లక్షణాలున్న కేసులు గత వారం రోజుల్లో 30 శాతం పెరిగినట్లు తెలిపారు. గత వారం రోజుల్లో ఓపీకి వస్తున్న రోగుల్లో 40 శాతం మందిలో ఇన్ ఫ్లూయెంజా తరహా అనారోగ్య లక్షణాలు ఉంటున్నాయని ప్రముఖ ఆస్పత్రి వైద్యులు అంటున్నారు. కోవిడ్ తగ్గుముఖం పట్టినా వివిధ లక్షణాలు మాత్రం అలాగే వున్నాయంటున్నారు వైద్యులు. జ్వరం, దగ్గు, డయేరియా ఇతర లక్షణాలు కనిపించి రెండు మూడు రోజుల్లోనే తగ్గిపోతున్నాయి. అయినా కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు.
Read Also: Bomb Blast: ఆఫ్ఘనిస్తాన్లో ఉగ్ర దాడి.. 33 మంది మృతి.. 43 మందికి తీవ్రగాయాలు
తాజావార్తలు
-
Dharmendra Pradhan: నీట్పై చర్చకు సిద్ధం.. విద్యార్థుల పేరుతో రాజకీయాలు వద్దు రాహుల్..
-
CKYC: బ్యాంకు కస్టమర్స్ కు అలర్ట్.. మీ CKYC నంబర్ తెలుసా?.. ఇలా తెలుసుకోండి
-
Jana Nayagan : విజయ్ ముందు భారీ టార్గెట్స్.. ఫస్ట్ డే వసూళ్లలో రజనీకాంత్ డామినేట్
-
Astrology: జూలై 22 బుధవారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని శుభవార్త..!
-
Shamshabad : ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం..!
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!