CNG Price Hike: సామాన్యుడిపై ఇంధన భారం.. మరోసారి సీఎన్జీ ధరల పెంపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CNG Price Hike: పెట్రోల్ ధరలతో పాటు సీఎన్జీ ధరలు కూడా వరుసగా పెరుగుతూనే ఉ్నాయి.. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు ఇప్పుడు సీఎన్జీ ధరల పెంపు కూడా అదనపు భారంగా మారింది. తాజాగా సీఎన్జీ ధరను కిలోకు రూ.2 మేర పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి కొత్త ధరలు అమల్లోకి వచ్చాయి. తాజా పెంపుతో జాతీయ రాజధాని ఢిల్లీలో సీఎన్జీ ధర కిలోకు రూ.83.09కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో చమురు, గ్యాస్ సంక్షోభం కారణంగా దేశీయంగా ఇంధన ధరలు పెరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు.
ఇటీవలి రోజుల్లో సీఎన్జీ ధరలు వరుసగా రెండుసార్లు పెరిగాయి. మొత్తంగా గత 12 రోజుల్లోనే కిలోకు రూ.6 మేర ధర పెరగడం గమనార్హం. దీంతో పెట్రోల్, డీజిల్ తర్వాత ఇప్పుడు సీఎన్జీ కూడా సామాన్యుడి జేబుకు భారంగా మారింది. ప్రత్యేకంగా ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో వాణిజ్య వాహనాలపై ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. ఆటోలు, టాక్సీలు, స్కూల్ వ్యాన్లు, ప్రైవేట్ కార్లు పెద్దఎత్తున సీఎన్జీపై ఆధారపడుతున్నాయి. తరచూ ధరలు పెరగడం వల్ల తమ రోజువారీ ఆదాయం తగ్గిపోతోందని ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెరుగుతున్న ఇంధన వ్యయాలతో జీవనోపాధి కష్టంగా మారుతోందని ఆటో, టాక్సీ యూనియన్లు చెబుతున్నాయి. ఈ పరిస్థితి కొనసాగితే రాబోయే రోజుల్లో ప్రయాణ ఛార్జీలు, సరుకు రవాణా ఖర్చులు కూడా పెరిగే అవకాశముందని వారు హెచ్చరిస్తున్నారు.
Also Read
- Mehbooba Mufti: 'దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం'.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
- Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
- Salman Khan: విద్యార్థులు ఇంటికెళ్లిపోండి.. సోనమ్కు ఇంటి భోజనం పంపిస్తా.. సల్మాన్ ఖాన్ ఆసక్తికర ట్వీట్
- Kusha Missile: కుశ మిస్సైల్ సక్సెస్.. భారత అమ్ములపొదిలో మరో అస్త్రం..
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యార్థుల యూనిఫాంల నాణ్యతపై రాజీపడేది లేదు
-
OTR : విశ్వేశ్వర్ రెడ్డి ఒక్క మాటతో వైసీపీ ఇరుక్కుందా?
-
Covid 19: కోవిడ్పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!
-
Mehbooba Mufti: ‘దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం’.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?