Aravind Kejriwal : నేడు కోర్టుకు సీఎం కేజ్రీవాల్.. అరెస్ట్ పై నిరసన తెలుపనున్న ఆప్
Aravind Kejriwal : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కష్టాలు తగ్గే సూచనలు కనిపించడం లేదు. మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఆయన ఈరోజు రోస్ అవెన్యూ కోర్టుకు హాజరయ్యారు. కేజ్రీవాల్ సీబీఐ రిమాండ్ గడువు నేటితో ముగియనుంది. జూన్ 26న సీబీఐ అతడిని అరెస్ట్ చేసింది. దీంతో కోర్టు అతడిని మూడు రోజుల సీబీఐ కస్టడీకి పంపింది. రూస్ అవెన్యూ కోర్టులో సిబిఐ సిఎం కేజ్రీవాల్ను ఐదు రోజుల కస్టడీని కోరింది. అయితే ఏజెన్సీకి కోర్టు నుండి 3 రోజుల రిమాండ్ మాత్రమే లభించింది. మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కేజ్రీవాల్కు ట్రయల్ కోర్టు జూన్ 20న బెయిల్ మంజూరు చేసింది. దిగువ కోర్టు ఇచ్చిన ఈ నిర్ణయాన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఢిల్లీ హైకోర్టులో సవాలు చేసింది. ట్రయల్ కోర్టు నిర్ణయంపై హైకోర్టు మధ్యంతర స్టే విధించింది.
Read Also:Madhya Pradesh: మహిళలు తమ భర్తల్ని ఇంట్లోకే మద్యం తెచ్చుకోని తాగమనండి.. మంత్రి సలహా..
Also Read
- UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
- PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
- S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
- Petrol Bunks Rush: పెట్రోల్ బంకుల వద్ద రద్దీకి అసలు కారణాలు ఇవే..!
కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత మనీష్ సిసోడియాపై పూర్తి నిందలు మోపారని, ఈ కేసులో ఇప్పటికే మనీష్ సిసోడియాను జైలులో పెట్టారని సీబీఐ కోర్టులో పేర్కొంది. ఎక్సైజ్ పాలసీపై తనకు ఎలాంటి అవగాహన లేదని కేజ్రీవాల్ చెప్పినట్లు దర్యాప్తు సంస్థ తెలిపింది. సీబీఐ చేసిన ఈ ప్రకటనపై కేజ్రీవాల్ మాట్లాడుతూ నేను సిసోడియాపై ఎలాంటి నిందలు వేయలేదు. నేను కూడా నిర్దోషినే, సోసాదియా కూడా నిర్దోషి అని కేజ్రీవాల్ అన్నారు. సుప్రీంకోర్టులో విచారణకు ముందు కేజ్రీవాల్ను సీబీఐ అరెస్ట్ చేసింది. కేజ్రీవాల్ అరెస్టుపై ఆయన భార్య సునీతా కేజ్రీవాల్ మాట్లాడుతూ.. అరవింద్ కేజ్రీవాల్కు జూన్ 20న బెయిల్ లభించిందని చెప్పారు. ఈడీ వెంటనే స్టే తెచ్చుకుంది. ఆ మరుసటి రోజే సీబీఐ అతడిని నిందితుడిగా చేసి అరెస్ట్ చేసింది. కేజ్రీవాల్ జైలు నుంచి బయటకు రాకుండా చూసేందుకు మొత్తం వ్యవస్థ ప్రయత్నిస్తోంది. ఇది చట్టం కాదు. ఇది నియంతృత్వం అన్నారు.
Read Also:Margani Bharat: మాజీ ఎంపీ ప్రచార రథాన్ని తగలబెట్టిన గుర్తు తెలియని వ్యక్తులు..
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో