DC vs MI IPL 2026: రిజ్వీ విధ్వంసం.. ముంబై ఓటమి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
DC vs MI IPL 2026: ఐపీఎల్ 2026లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్ ప్రేక్షకులను హోరెత్తించింది.. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ఈ పోరులో ఢిల్లీ క్యాపిటల్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. సమీర్ రిజ్వీ అద్భుతమైన బ్యాటింగ్తో మ్యాచ్ను ఏకపక్షంగా మార్చి జట్టుకు విజయాన్ని అందించాడు. ముంబై నిర్దేశించిన టార్గెట్ను సునాయసంగా చేధించింది ఢిల్లీ..
Read Also: Petrol, Diesel, LPG: పెట్రోల్, డీజిల్, ఎల్పీజీపై కేంద్రం కీలక ప్రకటన..
Also Read
- Bengaluru: కన్నడ నటి ఇంట్లో వ్యాపారవేత్త మృతి.. మిస్టరీగా మారిన కేసు
- Yogurt Facial for Glowing Skin: ఖర్చు లేకుండా కాంతివంతమైన చర్మం.. పెరుగు ఫేషియల్ రహస్యం
- T20 World Cup: మహిళా ప్రపంచకప్లో సరికొత్త చరిత్ర సృష్టించిన తెలుగమ్మాయి.. రికార్డులు బద్దలు..
- India Vs Ireland: మళ్లీ మారిన టీ20 కెప్టెన్.. ఐర్లాండ్తో తలపడే ప్రతి టీ-20 సిరీస్లోనూ కొత్త కెప్టెనే..
మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. ఆరంభంలోనే రెండు కీలక వికెట్లు కోల్పోయిన ముంబై, రోహిత్ శర్మ (35), సూర్యకుమార్ యాదవ్ (51) ఇన్నింగ్స్తో కొంత పుంజుకుంది. అయితే మధ్యలో వికెట్లు కోల్పోవడంతో భారీ స్కోర్ చేయలేకపోయింది. చివర్లో మిచెల్ శాంట్నర్ (18 నాటౌట్), కార్బిన్ బాష్ (11) పరుగులు జోడించడంతో 162 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఢిల్లీ తరఫున ముఖేష్ కుమార్ రెండు వికెట్లు పడగొట్టాడు.
ఇక, 163 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్కు మంచి ఆరంభం దక్కలేదు. కేఎల్ రాహుల్, నితీశ్ రాణా త్వరగా పెవిలియన్ చేరడంతో జట్టు ఒత్తిడిలో పడింది. ఈ సమయంలో పతుమ్ నిస్సాంక (44) మరియు సమీర్ రిజ్వీ కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. ఆ తర్వాత రిజ్వీ తన విధ్వంసకర బ్యాటింగ్తో మ్యాచ్ దిశనే మార్చేశాడు. సమీర్ రిజ్వీ కేవలం 51 బంతుల్లో 7 ఫోర్లు, 7 సిక్సర్లతో 90 పరుగులు చేసి అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఇక, అతనికి తోడుగా డేవిడ్ మిల్లర్ 21 పరుగులతో నిలిచి జట్టును విజయానికి చేర్చాడు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ 18.1 ఓవర్లలో లక్ష్యాన్ని చేధించింది.
ఈ విజయంతో ఢిల్లీ క్యాపిటల్స్ ఈ సీజన్లో వరుసగా రెండో విజయం సాధించింది. మరోవైపు, ముంబై ఇండియన్స్కు ఇది తొలి ఓటమిగా నిలిచింది. హార్దిక్ పాండ్యా గైర్హాజరీలో సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్గా వ్యవహరించినా, జట్టుకు విజయాన్ని అందించలేకపోయాడు. మొత్తంగా చూస్తే, సమీర్ రిజ్వీ అద్భుత ప్రదర్శనతో ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం సాధించగా, ముంబై ఇండియన్స్ మరో మ్యాచ్లో మెరుగైన ప్రదర్శన చేయాల్సిన అవసరం ఉంది.
తాజావార్తలు
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
Bengaluru: కన్నడ నటి ఇంట్లో వ్యాపారవేత్త మృతి.. మిస్టరీగా మారిన కేసు
-
Yogurt Facial for Glowing Skin: ఖర్చు లేకుండా కాంతివంతమైన చర్మం.. పెరుగు ఫేషియల్ రహస్యం
-
T20 World Cup: మహిళా ప్రపంచకప్లో సరికొత్త చరిత్ర సృష్టించిన తెలుగమ్మాయి.. రికార్డులు బద్దలు..
-
India Vs Ireland: మళ్లీ మారిన టీ20 కెప్టెన్.. ఐర్లాండ్తో తలపడే ప్రతి టీ-20 సిరీస్లోనూ కొత్త కెప్టెనే..
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!