Damodara Raja Narasimha : కోల్కతా వైద్యురాలి అత్యాచార ఘటనపై సీబీఐ కేసును వేగవంతం చేయాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోల్ కతా వైద్యురాలి అత్యాచార ఘటనపై దేశవ్యాప్తంగా డాక్టర్లు, నర్సులు చేస్తున్న ఆందోళన కు రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖల మంత్రి దామోదర్ రాజనర్సింహ సంఘీభావం తెలిపారు. ఇంతటి దారుణానికి పాల్పడిన నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి డిమాండ్ చేశారు. CBI కేసును వేగవంతం చేయాలన్నారు మంత్రి దామోదర్ రాజనర్సింహ. ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసి నిండుతుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు చేపట్టాలని దామోదర్ రాజనర్సింహ కోరారు. ఉస్మానియా , గాంధీ ఆసుపత్రుల ప్రిన్సిపల్స్, ఆస్పత్రుల సూపరిoటెoడెంట్ లతో డాక్టర్లు నర్సింగ్ ఆఫీసర్ల, వైద్య సిబ్బంది కి భద్రత కల్పించాలనీ ఆదేశించారు. అలాగే, రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో సేవలను అందిస్తున్న డాక్టర్లు, నర్సులు, వైద్య సిబ్బంది భద్రత పై శాఖ ఉన్నతాధికారులతో మంత్రి చర్చించారు.
Vizianagaram SP: వృద్ధురాలు ఒంటిపై ఉన్న బంగారం కోసమే హత్య..
Also Read
- Asaduddin Owaisi: RSS అనుబంధ సంస్థ సమావేశానికి అస్సాం రైఫిల్స్.. ఓవైసీ ఆగ్రహం.
- Donald Trump: ఇరాన్తో సీజ్ఫైర్ ముగిసింది, కానీ చర్చలు కొనసాగుతాయి..
- Digital Train Ticket: వాట్సాప్ టిక్కెట్లకు చెల్లుచీటి.. రైల్వే శాఖ తెచ్చిన సరికొత్త రూల్స్..
- Pakistan: చేతులెత్తేసిన అసిమ్ మునీర్.. పాక్లో BLA-TTP వరస దాడులు..
ఇలాంటి, సంఘటనలు పునరావృతం కాకుండా డాక్టర్లు, నర్సుల, వైద్యా ఆరోగ్య శాఖ సిబ్బంది భద్రతపై చర్యలు చేపట్టాలని మంత్రి దామోదర్ రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. డాక్టర్లు, నర్సులపై దాడులు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి హెచ్చరించారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ లో డాక్టర్లు, నర్సులు, వైద్య సిబ్బంది యొక్క భద్రత, సంరక్షణ కు సంబంధించిన అంశాలను పొందుపరిచాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మహిళల రక్షణ, భద్రత పై ఇప్పటికే ‘షీ టీమ్స్’ కట్టుదిట్టంగా పనిచేస్తున్నాయన్నారు.
Ricky Ponting: కోహ్లీ కాదు.. సచిన్ ప్రపంచ రికార్డు అతడే బద్దలు కొడతాడు: పాంటింగ్
తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ చేసిన విజ్ఞప్తిలో భాగంగా వర్క్ స్టేషన్లలో మహిళ డాక్టర్ల భద్రత కు తీసుకోవాల్సిన అంశాల పై కట్టుబడి ఉన్నామని మంత్రి వెల్లడించారు. కోల్కత్తాలో జరిగిన వైద్యురాలి అత్యాచార ఘటన అనంతరం రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టామన్నారు మంత్రి దామోదర్ రాజనర్సింహ.
తాజావార్తలు
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో SIR ప్రక్రియ ఎలా నడుస్తోంది..? ఓటర్ల సాధకబాధకాలేంటి..?
-
OTR: ఒంగోలు వైసీపీలో వర్గ పోరు.. పార్టీ ఆఫీసులోనే రచ్చ, అధిష్టానం సీరియస్!
-
MHSRB: ANM మెరిట్ లిస్ట్ విడుదల.. అభ్యంతరాలకు ఛాన్స్
-
Asaduddin Owaisi: RSS అనుబంధ సంస్థ సమావేశానికి అస్సాం రైఫిల్స్.. ఓవైసీ ఆగ్రహం.
-
Donald Trump: ఇరాన్తో సీజ్ఫైర్ ముగిసింది, కానీ చర్చలు కొనసాగుతాయి..
ట్రెండింగ్
-
IND vs ENG: భారత్తో సిరీస్లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్కార్ట్ భాగస్వామ్యం.!
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!