Train Fire Accident : అగ్నిప్రమాదం జరిగిన రైలులో భారీగా నోట్ల కట్టలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fire Accident in train coach: తమిళనాడులోని మధురైలో శనివారం ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. లక్నో నుంచి రామేశ్వరం వెళ్తున్న రైలు టూరిస్ట్ కోచ్లో గ్యాస్ సిలిండర్ పేలి మంటలు చెలరేగగా 9 మంది మృతి చెందిన సంగతి విదితమే. ఈ ఘటనలో 20 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు కూడా. ఇక ఈ ప్రమాదానికి సంబంధించి దర్యాప్తు ప్రారంభించారు అధికారులు. అందులో భాగంగా తనిఖీలు నిర్వహించారు ఫోరెన్సిక్ నిపుణులు. ఈ దర్యాప్తులో భాగంగా వారికి కనిపించిన ఒక పెట్టెని చూసి షాక్ తిన్నారు అధికారులు. అందులో భారీగా నోట్ల కట్టలు బయటపడ్డాయి. అయితే ఆ నోట్ల కట్టలు సగం కాలి ఉన్న స్థితిలో కనిపించాయి. రూ. 500, రూ. 200 నోట్లు ఈ కట్టల్లో ఉన్నట్టు గుర్తించారు.
Also Read: Anu Emmanuel: నేను ఆ బాధితురాలినే: అను ఇమ్మానుయేల్
ఈ డబ్బు ఎవరిది? అనే కోణంలో కూడా ఇప్పుడు దర్యాప్తు జరుపుతున్నారు. అయితే రైలు ప్రమాదానికి సిలండర్ పేలడమే ప్రధాన కారణమని ప్రాధమిక దర్యాప్తులో తేలింది. అయితే ఇక్కడ మరో విషయాన్ని అధికారులు గుర్తించారు. అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఇద్దరు వ్యక్తులు అక్కడి నుంచి పారిపోయినట్లు అధికారులు గుర్తించారు. అయితే ఈ ఘటనతో వారికి సంబంధం ఉందా అనే కోణంలో కూడా ఆరా తీస్తున్నారు. ఒకవేళ అదే కనుక జరిగితే ఈ కేసు వేరే మలుపు తిరిగే అవకాశం ఉంది. ఇక ఆ కోచ్ లో నోట్ల కట్టలు దొరకడం కూడా పలు అనుమానాలకు దారి తీస్తుంది. అయితే ఈ మొత్తాన్ని ట్రావెల్ ఏజెన్సీ వారు యాత్రికుల కోసం మధ్యలో ఖర్చు పెట్టడం కోసం తెచ్చుకున్నట్లుగా అనుమానిస్తున్నారు. ఇక పారిపోయిన ఇద్దరు వ్యక్తుల కోసం ప్రత్యేక బలగాలు వెతుకుతున్నాయి. వారి అచూకీ తెలిస్తే రైలులో జరిగిన అగ్నిప్రమాదానికి సంబంధించి వివరాలు తెలిసే అవకాశం ఉంది. ఇక ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) టూరిస్ట్ రైలు లక్నో నుంచి రామేశ్వరం వెళుతుండగా ఈ ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఈ రైలులో 63 మంది యాత్రికులు ఉన్నట్లు సమాచారం. అయితే అందులో ఉన్న ఇద్దరు మహిళలు టీ పెట్టడానికి గ్యాస్ సిలండర్ వెలిగించగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
Also Read
- UP: బక్రీద్ రోజు హిందూ యువకుడి దారుణ హత్య.. పోలీసుల ఎన్కౌంటర్లో ప్రధాన నిందితుడు అసద్ ఖతం..
- East Godavari Horror: తూర్పుగోదావరి జిల్లాలో విషాదం.. భార్యను దారుణంగా హత్య చేసిన భర్త!
- Mantralayam Tragedy: మంత్రాలయంలో విషాదం.. తుంగభద్ర నదిలో ఐదుగురు గల్లంతు.. నాలుగు మృతదేహాలు లభ్యం!
- Siddipet District: వివాహేతర సంబంధం.. యువకుడికి కొట్టి చంపిన మహిళ కుటుంబీకులు..
తాజావార్తలు
-
UP: బక్రీద్ రోజు హిందూ యువకుడి దారుణ హత్య.. పోలీసుల ఎన్కౌంటర్లో ప్రధాన నిందితుడు అసద్ ఖతం..
-
IPL 2026 Final: ఆర్సీబీ vs జీటీ హై-వోల్టేజ్ మ్యాచ్.. ఫైనల్కు డిసైడ్ చేసే మూడు ప్లేయర్స్ బ్యాటిల్స్ ఇవే!
-
kajal Aggarwal: మగధీర సెట్లో చరణ్ అల్లరిని బయటపెట్టిన కాజల్.. అసలేం జరిగిందంటే!
-
East Godavari Horror: తూర్పుగోదావరి జిల్లాలో విషాదం.. భార్యను దారుణంగా హత్య చేసిన భర్త!
-
Japan Roasts China: డ్రాగన్ దేశాన్ని నవ్వులపాలు చేసిన జపాన్.. అణు ఆయుధాలపై లైవ్లో మాస్ ర్యాగింగ్!
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..