Cumin Price Hike: బంగారాన్ని మించి దూసుకుపోతున్న జీలకర్ర ధర
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cumin Price Hike: దేశంలో సంబరాల వాతావరణం నెలకొంది. రిటైల్ ద్రవ్యోల్బణం 25 నెలల కనిష్టానికి చేరుకుంది. టోకు ద్రవ్యోల్బణం మైనస్ 3.50 శాతానికి చేరుకుంది. అయినా సామాన్యుల వంట గది సమస్యల్లోనే ఉంది. దీనిని ఎవరూ పట్టించుకోవడం లేదు. వంటగదికి కావాల్సిన పాలు, పప్పు ధరలు ఇంకా తగ్గలేదు. పాలు, పప్పులు పక్కన పెడితే, వంటగదిలోని మసాలా పెట్టెలో ఉంచిన జీలకర్ర ఈ రోజుల్లో ‘బంగారం’ కంటే కాస్లీ అయింది. నేడు క్వింటాల్ జీలకర్ర ధర రూ.60 వేలు దాటింది.
దేశంలోని ప్రతి వంటగదిలో 99 శాతం కూరల్లో జీలకర్రను ఉపయోగిస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో దీని ధరలు ఆకాశాన్నంటడం ప్రారంభిస్తే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి. గుజరాత్లోని ఉంఝా మండిలో జీలకర్ర ధరలు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. ఈరోజు ధర రూ.60 వేలు దాటింది. కొద్ది రోజుల క్రితం జీలకర్ర ధర కూడా 67 వేలుగా నమోదైంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే 9 ఏళ్లలో జీలకర్ర ధర 500 శాతానికి పైగా పెరిగింది. వ్యవసాయానికి సంబంధించిన 20 వస్తువులలో జీలకర్ర ధర గరిష్టంగా పెరిగింది.
Also Read
- iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
- AP Government Jobs: గుడ్న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. ఉద్యోగాల వయోపరిమితి పెంపు.. ఎప్పటి వరకు అంటే?
- Telangana Congress New In-Charge: తెలంగాణ కాంగ్రెస్ కి కొత్త ఇంచార్జ్.?
- Chandrababu Tirumala Visit: తిరుమలకు సీఎం చంద్రబాబు.. శ్రీవారికి పట్టువస్త్రాల సమర్పణలో రికార్డు
తొమ్మిదేళ్లలో 500 శాతం పెరిగిన ధర
జూన్ 2, 2014న జీలకర్ర ధర రూ.11,120. జూన్ 22న క్వింటాల్కు రూ.67,500తో జీవితకాల గరిష్ట స్థాయికి చేరుకుంది. అంటే జీలకర్ర ధరలు 500 శాతానికి పైగా పెరిగాయి. కాగా, జూన్ 26న ఊంజ మండిలో జీలకర్ర ధర కాస్త తగ్గి రూ.60,125కి చేరింది. ఈ నేపథ్యంలో కూడా దాదాపు 9 ఏళ్లలో జీలకర్ర ధరల్లో 441 శాతం పెరుగుదల కనిపించింది. ఫ్యూచర్స్ మార్కెట్ ఎన్సిడిఎక్స్ డేటా ప్రకారం.. ఆగస్టు ఫ్యూచర్స్ జీలకర్ర క్వింటాల్కు రూ. 58,205 వద్ద ముగిసింది. ఇది ట్రేడింగ్ సెషన్లో రూ. 58,750కి చేరుకుంది. ఇందులో అంతకుముందు రోజుతో పోలిస్తే 5 శాతానికి పైగా పెరుగుదల కనిపించింది.
Read Also:Students Missing: విశాఖలో విద్యార్థుల మిస్సింగ్ కలకలం.. ఒకేసారి ముగ్గురు..
జీలకర్ర ధర పెరగడానికి డిమాండ్, సప్లయ్ మధ్య అసమతుల్యత ఏర్పడడమే ప్రధాన కారణమని మార్కెట్ అధికారులు చెబుతున్నారు. సుగంధ ద్రవ్యాల కోసం ప్రపంచంలోనే అతిపెద్ద హోల్సేల్ మార్కెట్ అయిన ఉంఝా APMCలో ప్రముఖ కమీషన్ ఏజెంట్ సీతారాం పటేల్ మాట్లాడుతూ.. ఈ ఏడాది డిమాండ్ కంటే దాదాపు 50 శాతం తక్కువ దిగుబడి ఉంది..దీంతో వ్యాపారులు ధరలు పెంచాల్సి వస్తోందన్నారు.
జీలకర్ర ధర ఎందుకు పెరుగుతోంది?
ప్రభుత్వ అంచనాల ప్రకారం, భారతదేశ జీలకర్ర ఉత్పత్తి 2019-20లో 9.12 లక్షల టన్నులు ఉండగా, 2020-21లో 7.95 లక్షల టన్నులకు, 2021-22లో 7.25 లక్షల టన్నులకు తగ్గింది. ప్రధానంగా ఈసారి మార్చి ద్వితీయార్థంలో కురిసిన అకాల వర్షాల కారణంగా 2022-23 పంట పరిమాణం కాస్త తగ్గుతుందని వ్యాపారులు భావిస్తున్నారు. తక్కువ ఉత్పత్తి మాత్రమే ధరల పెరుగుదలకు ప్రధాన కారణం కాదు. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ స్పైస్ స్టేక్హోల్డర్స్ ప్రకారం.. ఫిబ్రవరి 2022లో క్యారీ-ఫార్వర్డ్ స్టాక్లో దాదాపు 35 లక్షల బ్యాగులు (ఒక్కొక్కటి 55 కిలోలు) ఉన్నాయి. ఈసారి 2021-22 పంట క్యారీ ఫార్వార్డ్ 34 లక్షల బస్తాలు మాత్రమే. వ్యాపారుల వద్ద నిల్వలు తక్కువగా ఉండడం, ఉత్పత్తి పడిపోవడంతో ధరలు పెరిగాయి.
భారతదేశం జీలకర్ర ఉత్పత్తి దేశీయ మార్కెట్తో పాటు పలు దేశాలకు ఎగుమతి అవుతాయి. 2022-23 (ఏప్రిల్-మార్చి)లో జీలకర్ర ఎగుమతులు 1.87 లక్షల టన్నులు (రూ. 4,193.60 కోట్లు), గత ఆర్థిక సంవత్సరంలో 2.17 లక్షల టన్నులు (రూ. 3,343.67 కోట్లు)గా ఉన్నాయి. అగ్ర ఎగుమతి దేశాల గురించి మాట్లాడుతూ, చైనా, బంగ్లాదేశ్, అమెరికా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, పాకిస్తాన్, సౌదీ అరేబియా, టర్కీ ఉన్నాయి.
Read Also:Akhil Akkineni : మరోసారి భారీ బడ్జెట్ సినిమాతో రాబోతున్న అఖిల్…?
ఉంజా ఆధారిత జీలకర్ర ఎగుమతి సంస్థ MR ఆగ్రో ఇండస్ట్రీస్కు చెందిన అల్పేష్ పటేల్ మాట్లాడుతూ.. చైనా భారతీయ జీలకర్రను దూకుడుగా దిగుమతి చేసుకుంటోందని చెప్పారు. గత మూడు నెలల్లోనే చైనా 25,000-30,000 టన్నుల జీలకర్రను భారతదేశం నుండి దిగుమతి చేసుకుంది. ఎందుకంటే అక్కడి పంట డిమాండ్కు అనుగుణంగా లేదు. దీర్ఘకాల కోవిడ్-19 ఆంక్షల తర్వాత హోటళ్లు, రెస్టారెంట్లు తిరిగి తెరవడంతో ఈ సంవత్సరం డిమాండ్ పెరిగింది. ఈ నెలాఖరులో జరిగే బక్రీద్ పండుగ కారణంగా బంగ్లాదేశ్, పాకిస్థాన్ దేశాల నుంచి కూడా డిమాండ్ ఉంది.
ప్రపంచంలోని జీలకర్రలో 70 శాతం భారతదేశంలోనే ఉంది?
ప్రపంచంలోని జీలకర్రలో 70 శాతం భారతదేశం ఉత్పత్తి చేస్తోంది. ఆ తర్వాత సిరియా, టర్కీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇరాన్ వంటి ఇతర దేశాలు 30 శాతం జీలకర్రను ఉత్పత్తి చేస్తాయి. ఆ దేశాల్లో కొన్ని అంతర్యుద్ధం, ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఉత్పత్తి తగ్గింపును ఎదుర్కొంటున్నాయి. భారతదేశంలో జీలకర్ర దాదాపు 8 లక్షల హెక్టార్లలో పండుతుంది. 2021-22లో మొత్తం 7.25 లక్షల టన్నుల ఉత్పత్తిలో, రెండు రాష్ట్రాలు – గుజరాత్ (4.20 లక్షల టన్నులు) మరియు రాజస్థాన్ (3.03 లక్షల టన్నులు) కలిపి 99.7 శాతం వాటాను కలిగి ఉన్నాయి.
తాజావార్తలు
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
OTT Releases: ఈ వారం ఓటీటీ లవర్స్ కు పండగే.. అదిరిపోయే హాలీవుడ్ కంటెంట్ సిద్దం
-
Honor Play 11 5G: వాటర్ప్రూఫ్ ఫోన్ లాంచ్.. 8,300mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Honor Play 11
-
AP Government Jobs: గుడ్న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. ఉద్యోగాల వయోపరిమితి పెంపు.. ఎప్పటి వరకు అంటే?
-
Vaibhav Sooryavanshi: వైభవ్ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
ట్రెండింగ్
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!