Site icon NTV Telugu

Corona : బీభత్సం సృష్టిస్తోన్న కరోనా.. మహమ్మారి బారిన పడి 10వేల మంది మృతి

Coronavirus Cases

Coronavirus Cases

Corona : మళ్లీ కరోనా కేసులు రావడం మొదలయ్యాయి. ఈసారి మరో కొత్త వేరియంట్‌తో ఈ వైరస్ ప్రజలను ప్రభావితం చేస్తోంది. గత నెలలో అంటే డిసెంబర్‌లో కరోనా కారణంగా 10,000 మంది మరణించారని ఐక్యరాజ్యసమితి బుధవారం ఒక నివేదికను విడుదల చేసింది. ఈ నివేదికపై ఏజెన్సీ చీఫ్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ పెరుగుతున్న కరోనా కేసులకు… సెలవుల్లో సామాజిక సమావేశాలే కారణమని పేర్కొన్నారు. డిసెంబర్‌లో దాదాపు 10,000 మరణాలు సంభవించాయని, కొత్త సంవత్సరంలో 50 దేశాల్లో ఆసుపత్రిలో చేరిన వారి సంఖ్య 42శాతం పెరిగిందని టెడ్రోస్ చెప్పారు. ఎక్కువ కేసులు యూరప్, అమెరికా నుండి వచ్చాయి.

మహమ్మారి గరిష్ట స్థాయి కంటే ఎక్కువగా ఉన్నాయి. ఈ మరణాల సంఖ్య ఆమోదయోగ్యం కాదు. నివేదికలు ఇవ్వని చోట్ల కూడా కేసులు పెరుగుతుండడం ఖాయమని, ప్రభుత్వాలు నిఘా ఉంచి చికిత్స, టీకాలు వేయించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ జెనీవాలో విలేకరుల సమావేశంలో సూచించారు. JN.1 వేరియంట్ ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతోందని టెడ్రోస్ తెలిపారు. ఇది ఓమిక్రాన్ వేరియంట్, కాబట్టి ఇప్పటికే ఉన్న టీకాలు కూడా దీని నుండి రక్షించగలవు. కరోనావైరస్‌తో పాటు, ఫ్లూ, రైనోవైరస్, న్యుమోనియా కారణంగా ప్రపంచవ్యాప్తంగా శ్వాసకోశ వ్యాధులు పెరుగుతున్నాయని WHO టెక్నికల్ లీడ్ మరియా వాన్ కెర్ఖోవ్ చెప్పారు.

Read Also:Shraddha Das: బిజినెస్ మ్యాన్ తో పెళ్లి పై క్లారిటీ ఇచ్చిన హాట్ బ్యూటీ..

భారతదేశంలో ఇప్పటివరకు ఎంత మంది మరణించారు?
ఇప్పటివరకు, జనవరి 2020లో ప్రారంభ వ్యాప్తి నుండి భారతదేశంలో మొత్తం కరోనావైరస్ కేసుల సంఖ్య 4,50,19, 819కి చేరుకోగా, మొత్తం మరణాల సంఖ్య 5,33,406కి చేరుకుంది. గత 24 గంటల్లో భారతదేశంలో 605 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి.. నలుగురు మరణించారు.

భారతదేశంలో ఎన్ని కేసులు?
మహారాష్ట్ర నుండి 250, కర్ణాటక నుండి 199, కేరళ నుండి 148, గోవా నుండి 49, గుజరాత్ నుండి 36, ఆంధ్రప్రదేశ్ నుండి 30, రాజస్థాన్ నుండి 30, తమిళనాడు నుండి 26 జెఎన్.1 సబ్‌వేరియంట్ కేసులు నమోదయ్యాయి. తెలంగాణ నుంచి 21 మంది, ఢిల్లీ నుంచి 21 మంది, ఒడిశా నుంచి 3 మంది, హర్యానా నుంచి ఒకరు ఉన్నారు.

Read Also:Virat Kohli: విరాట్ కోహ్లీ నాకు బావ అవుతాడు: హీరోయిన్‌

Exit mobile version