తెలుగు రాష్ట్రాల్లో వాణిజ్య పంటగా పత్తిని పండిస్తున్నారు.. సుమారుగా 20 లక్షల హెక్టార్లలో సాగు చేస్తున్నారు వేసిన పత్తి ప్రస్తుతం కాయ మొదటి తీత దశలో ఉంది.ఇప్పుడు వేసిన పత్తికి కాయలు వచ్చే దశ.అధిక వర్షాల వల్ల కాయకుళ్ళు తెగులు ఉధృతి ఉండే అవకాశం ఉన్నందున రైతులు తెగుళ్ల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు..
సాదారణంగా పంట కాయ దశలో ఉన్నప్పుడు అధిక వర్షాలు పడటం వలన అనేక రకాలైన శిలీంద్రాలు ఆశించడం వల్ల కాయలు కుళ్ళిపోతాయి. శిలీంధ్రాలలో ముఖ్యంగా కొల్లేటోట్రైకమ్ గోసిసి, డిప్లోడియా గోసిసి, అస్కోకైటా గోసిసి మరియు ఫ్యూజేరియం జాతికి సంబంధించిన శిలీంధ్రాలు ఆశించడం వల్ల పత్తి కాయలు కుళ్లి పోతాయి.. అలాగే కొన్ని వైరస్ లు కాయలలోకి చేరి పత్తి నాణ్యతను తగ్గిస్తాయి.. అంతేకాదు పురుగులు, కాయలను ఆశించడం వలన కాయల మీద ఏర్పడిన రంధ్రాల ద్వారా లేదా అంతరకృషి, యంత్రాలు వివిధ చర్యల ద్వారా కాయల మీద ఏర్పడిన గాయాలు లేదా సహజంగా కాయలు పగిలినప్పుడు వివిధ రకాలైన శిలీంద్రాలు కాయలోనికి ప్రవేశించి తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి..
ఫంగస్ శిలీంద్రాల వల్ల కలిగే కాయకుళ్ళులో కాయలపై బూజుని గమనించవచ్చు. కాయలు కుళ్ళి పోవడం వల్ల కాయలో ఉన్న దూది రంగు కూడా మారిపోయి నాణ్యత తగ్గిపోతుంది.. అధిక తేమతో కూడిన వాతావరణంలో ఈ తెగులు ఉధృతి పెరిగే అవకాశం ఉంటుంది. మబ్బులతో కూడిన చల్లని వాతావరణం, ఎడతెరిపిలేని వర్షాలు తక్కువ ఉష్ణోగ్రతలు ముఖ్యంగా ఈ దశలో ఉన్నప్పుడు ఈ తెగులు ఉధృతి పెరిగే అవకాశం ఉంటుంది.. అందుకే అధిక వర్షాలు కురిస్తే వెంటనే వ్యవసాయ నిపుణుల సలహా తీసుకొని తగిన మందులను పిచికారీ చెయ్యాలి లేకుంటే మాత్రం నష్టపోతారు..