TG: రాష్ట్రంలో బీర్ల కొరతకు కారణం ఇదే.. అసలు నిజం చెప్పిన అధికారులు
తెలంగాణలో బీరు తయారు చేసే బ్రూవరీస్ కంపెనీలకు మూడో షిప్టు అనుమతించక పోవడంతో కృత్రిమ కొరత ఏర్పడిరదని మీడియాలో వచ్చిన కథనం సత్యదూరమని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్టుమెంట్ కమిషనర్ శ్రీధర్ పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం ప్రెస్ నోట్ విడుదల చేశారు. ప్రెస్ నోట్ లోని వివరాల ప్రకారం… “ప్రస్తుతం తెలంగాణలో ఆరు బీరు తయారు చేసే బ్రూవరీస్ కంపెనీలు ఉన్నాయి. ప్రభుత్వ అనుమతి ఉన్న బీరు తయారీ కంపెనీలు లైసన్స్ షరతుల ప్రకారమే ఉత్పత్తి చేయడానికి అనుమతి ఉంటుంది. సాదారణంగా ఒక షిప్టుకు అనుమతి ఉంటుంది. కాని బీరు డిమండ్ మేరకు.. బ్రూవరీస్ అభ్యర్థనను పరిగణలోకి తీసుకొని అవసరమైన రుసుం చెల్లించిన వారికి మూడు షిప్టులకు అనుమతి ఇవ్వడం జరిగింది. ఆరు బ్రూవరీస్లో, నాలుగు బ్రూవరీస్ 95 శాతం వారి డిమాండ్ కలిగిన బ్రాండ్స్ ఉత్ప్సత్తి చేస్తాయి. బీరు ఉత్పత్తి కంపెనీలు చేసే నాలుగు కంపెనీలకు మూడు షిప్టులకు అనుమతి తీసుకున్నారు.” అని పేర్కొన్నారు.
READ MORE: Anand Deverakonda: అందుకే ఆనంద్ కరెక్ట్ ఆప్షన్ అనిపించింది: దర్శకుడు ఉదయ్ ఇంటర్వ్యూ
Also Read
- Shocking: వయాగ్రా ఓవర్ డోస్.. కాబోయే భార్య వచ్చే లోపే మృతి..
- Manappuram: నిబంధనలు ఉల్లంఘించిన మణప్పురం ఫైనాన్స్.. ఆగ్రహం వ్యక్తం చేసిన సెబీ..
- Anna Hazare: ‘‘ఆత్మపరిశీలన చేసుకోవాలి’’.. ఆప్పై అన్నాహజారే కీలక వ్యాఖ్యలు..
- Roti Pizza Recipe: మిగిలిపోయిన రోటీలతో ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ పిజ్జా.. మార్కెట్లో దొరికే పిజ్జాని మర్చిపోతారంతే..!
“డిమాండ్ ఉన్న నాలుగు కంపెనీల రోజు వారి ఉత్పత్తి సామార్ధ్యం 1,66,000 కేసులు. ఇలా మూడు షిప్టుల్లో 4,98,000 కేసులు తయారు చేయాల్సి ఉంటుంది. కాని మూడు షిప్టులు నడుపుకోవడానికి అనుమతి తీసుకున్న కంపెనీలు మూడు షిప్టుల్లో కేవలం 2.51 లక్షల కేసుల బీరును మాత్రమే ఉత్పత్తి చేశాయి. తెలంగాణలో వేసవిలో బీరు సరాసరి రోజుకు 2.00 లక్షల కేసులు అమ్మకాలు జరుగుతాయి. ఇప్పటి వరకు 7.57 లక్షల కేసుల బీరు కేసులు బ్రెవరీస్ కార్పొరేషన్ డిపోల్లో, బ్రూవరీస్ల్లో నిల్వలు ఉన్నాయి. మొత్తంగా మార్కెట్లో బీరు కొరత లేదు. కింగ్ ఫిషర్ బ్రాండ్ కొరత తప్పా మిగిలిన అన్ని రకాలు బీర్లు అందు బాటులో ఉన్నాయి. బీరు తయారు చేసే కంపెనీలు మూడు షిప్టుల అనుమతి తీసుకున్న కూడ తగిన బీరు ఉత్పత్తి చేయలేకపోవడం వల్ల కింగ్ బీరు కొతర కొరత ఏర్పడిరది. ఐయిప్పటికి ఎక్సైజ్ శాఖ యంత్రాంగం అన్ని రకాల చర్యలు తీసుకొని బీరు నిల్వలకు కొరత లేకుండా చూశారు. ” అని స్పష్టం చేశారు.
“తెలంగాణలో కొత్త బ్రాండ్ల అనుమతికి సంబంధించి చాల సంవత్సరాలుగా ఉన్న పద్దతిని కొనసాగిస్తున్నారు. కొత్త సంస్థలు తమ బ్రాండ్స్ను తెలంగాణ బేవరీజెస్ కార్పోరేషన్కు సరఫరా చేయడానికి బ్రెవరేజ్స్ నిబంధనలకు కట్టుబడి ఉంటామని అన్నవారికి అనుమతిస్తారు. గత ఐదేళ్లలో తెలంగాణలో దాదాపు 360 కొత్త మద్యం బ్రాండ్లకు అనుమతి ఇవ్వడం జరిగింది. గడిచిన ఐదు నెల్లలో నాలుగు బీరు బ్రాండ్స్ను సరఫరా చేయుటకు కార్పొరేషన్ వద్ద రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఈ విషయంపై పలు పత్రికల్లో వచ్చిన కథనాల్లో వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదని భావిస్తున్నాం.” అని వెల్లడించారు.
తాజావార్తలు
-
Kitchen Hacks : గోధుమలను పురుగులు పట్టకుండా తాజాగా ఉంచాలా.? అద్భుతమైన చిట్కాలు ఇవే.!
-
Shocking: వయాగ్రా ఓవర్ డోస్.. కాబోయే భార్య వచ్చే లోపే మృతి..
-
Manappuram: నిబంధనలు ఉల్లంఘించిన మణప్పురం ఫైనాన్స్.. ఆగ్రహం వ్యక్తం చేసిన సెబీ..
-
Mercedes CLA EV: భారత్ లో విడుదలైన మెర్సిడెస్ బెంజ్ CLA EV.. 792 km రేంజ్, 800V ఫాస్ట్ ఛార్జింగ్ – పూర్తి వివరాలు
-
Karimnagar : కరీంనగర్ త్రీటౌన్ ఎస్సై ఓవరాక్షన్.. సెలూన్ వర్కర్ పై దాడి
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!