NTV Telugu Site icon

CM YS Jagan: నేటితో ముగియనున్న సీఎం జగన్‌ కడప పర్యటన..

Ys Jagan

Ys Jagan

CM YS Jagan: ఆంధ్రప్రదశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి సొంత జిల్లా పర్యటన నేటితో ముగియనుంది.. ఈ నెల 23వ తేదీన కడప జిల్లా పర్యటనకు వెళ్లిన ఆయన.. నిత్యం వరుస కార్యక్రమాలతో బిజీగా గడుపుతున్నారు.. ఇక, ఇవాళ్టితో సీఎం జగన్ కడప జిల్లా పర్యటన ముగియనుంది.. మూడో రోజు తన పర్యటనలో భాగంగా ఇడుపులపాయ గెస్ట్‌ హౌస్‌ నుంచి కాసేపట్లో పులివెందులకు బయలుదేరనున్నారు సీఎం జగన్.. ఉదయం 9 గంటలకు పులివెందులోని సీఎస్‌ఐ చర్చికి చేరుకుంటారు.. సీఎస్ఐ చర్చిలో జరిగే క్రిస్మస్‌ ప్రార్ధనల్లో సీఎం వైఎస్‌ జగన్ ఆయన సతీమణి వైఎస్ భారతి, తల్లి వైఎస్‌ విజయమ్మ, ఇతర కుటుంబ సభ్యులు పాల్గొంటారు.. దాదాపు రెండు గంటల పాటు ఈ ప్రార్థనల్లో పాల్గొనబోతోంది వైఎస్‌ కుటుంబం.. ఆ తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు కడప ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోనున్నారు సీఎం వైఎస్‌ జగన్‌.. అక్కడి నుంచి తాడేపల్లికి తిరుగు ప్రయాణం అవుతారు. దీంతో.. కడప జిల్లాలో సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి పర్యటన ముగిసినట్టు అవుతుంది. కాగా, ఈ మూడు రోజుల పాటు.. శనివారం, ఆదివారం తన సొంత జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు సీఎం వైఎస్‌ జగన్‌.. జిల్లా నేతలతో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించారు.. అభివృద్ధి పనులపై సమీక్షలు నిర్వహించి.. అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు సీఎం వైఎస్‌ జగన్‌.

Read Also: Pakistan : షార్ట్ సర్క్యూట్ కారణంగా ఘోర అగ్ని ప్రమాదం.. 9మంది మృతి