CM Revanth Reddy: 12 ఏళ్లుగా జరుగుతున్న మైనింగ్ దోపిడీని తెలుస్తాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy: రాఘవ కన్స్ట్రక్షన్స్పై తాము ఇచ్చిన నోటీసునే బీఆర్ఎస్ ప్రస్తావించిందని సీఎం రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. ఇదే నోటీసులపై సభలో హడావిడి చేస్తున్నారని.. మైనింగ్ అక్రమాలపై విచారణకు ఆదేశించామని తెలిపారు. తాజాగా మైనింగ్ అంశంపై అసెంబ్లీలో సీఎం మాట్లాడారు. “12 ఏళ్లుగా జరుగుతున్న మైనింగ్ దోపిడీపై సీబీసీఐడీ విచారణ జరుపుతుంది. అక్రమాలను మేము గుర్తించి, మేమే నోటీసులు ఇచ్చాం. గత ప్రభుత్వం చేసిందేమీ లేదు. మీకు ఏ అనుమానం ఉన్నా సీబీసీఐడీ ఇవ్వండి. మైనింగ్ శాఖలో అవినీతి నిగ్గు తేల్చాలని మేం నిర్ణయించాం. నీవు చేసిన పనికి నేను ఇరుకున్నానని హరీష్ రావుపై కేటీఆర్ దాడి చేశారు. దాన్ని దృష్టి మళ్లించడానికే ఇవాళ సభలో గందరగోళం చేస్తున్నారు.” అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
READ MORE: Samantha : సినీ రంగం అమ్మయిలకు సురక్షితం కాదు.. సమంత ఎమోషనల్ స్పీచ్!
Also Read
- Pawan Kalyan: 21 సీట్ల వ్యూహం అసెంబ్లీ ఎన్నికలకే.. స్థానిక ఎన్నికల్లో జనసేన కొత్త వ్యూహం
- Southern Zonal Council Meeting: దక్షిణాది ఐక్యతే దేశ బలం.. జోనల్ కౌన్సిల్లో చంద్రబాబు కీలక ప్రసంగం
- Sugar: కొండెక్కిన చక్కెర ధర.. కేంద్రం కీలక నిర్ణయం
- Tarique Rahman: భారత్ పర్యటనపై బంగ్లాదేశ్ ప్రధాని యూటర్న్.. కారణమిదేనా?
ఆదాయాన్ని పెంచి పేదలకు పంచాలనే విధానంతో ముందుకు వెళుతున్నామని సీఎం తెలిపారు. “సంస్కరణలు తీసుకొచ్చి ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుతున్నాం. రాఘవ కన్స్ట్రక్షన్ విషయంలో 2025 లో వాస్తవ పరిస్థితులు తెలుసుకుని మైనింగ్ శాఖ పన్నులు రాబట్టుకుంది. ప్రభుత్వ ఆదాయానికి గండి పడకుండా చర్యలు తీసుకున్నాం. ఇంత పారదర్శకంగా మేం తీసుకున్న చర్యలను అభినందిస్తే మా అధికారులు మరింత ఉత్సాహంగా పనిచేసేవారు. హరీష్ రావు, కేటీఆర్, ఇతర సభ్యులకు విజ్ఞప్తి చేస్తున్నా. ఇతర పార్టీల సభ్యులు కూడా తెలంగాణ ఖనిజ సంపద దోపిడీకి సంబంధించి సమాచారం అధికారులకు ఇవ్వండి. సంపూర్ణంగా విచారణ చేసి దోషులను శిక్షించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. హౌస్ కమిటీ వేసినా నివేదికను మళ్లీ ఏదో ఒక ప్రభుత్వ విచారణ సంస్థకు ఇవ్వాల్సిందే. అందుకే మేం నేరుగా సీబీసీఐడీ విచారణకు ఆదేశించాం. సీబీసీఐడీ పై నమ్మకం లేకపోతే సీబీఐకి విచారణ అప్పగించాలా చెప్పండి.. బ్లాక్ మెయిల్ చేయడానికే వారు హౌస్ కమిటీ కోరుతున్నారు.. ఇక్కడ మీ పప్పులు ఉడకవు. భట్టి నీ సిఎల్పీ నేతను చేస్తే.. కక్ష కట్టి MLA లను పార్టీ నుంచి లాక్కుని ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు కేసీఆర్. భట్టిను సీఎల్పీ నేతగా తొలగించి పైశాచిక ఆనందం పొందారు. భట్టి బడ్జెట్ పెడితే.. నీకు బడ్జెట్ పెట్టరాదు. బడ్జెట్ ఇట్లనె పెట్టాలా..? అని అవమానిస్తున్నారు హరీష్ రావు. సభకు కేసీఆర్ రావడం లేదు. దళితుడు పైన కూర్చుంటే నేను మైక్ అడగాలా? నేను కింద కూర్చోవాలా అని అహంకారం కేసీఆర్కు ఉంది. ఆయన పెద్దోడు. అని చూసి చూడనట్టు వదిలేద్దాం. వీళ్లకు ఏం అయ్యింది.” అని సీఎం రేవంత్రెడ్డి ప్రశ్నించారు.
READ MORE: Houthis: కీలక మలుపు.. ఇరాన్కు మద్దతుగా యుద్ధంలోకి హౌతీల ప్రవేశం..
తాజావార్తలు
-
Pawan Kalyan: 21 సీట్ల వ్యూహం అసెంబ్లీ ఎన్నికలకే.. స్థానిక ఎన్నికల్లో జనసేన కొత్త వ్యూహం
-
Southern Zonal Council Meeting: దక్షిణాది ఐక్యతే దేశ బలం.. జోనల్ కౌన్సిల్లో చంద్రబాబు కీలక ప్రసంగం
-
Sugar: కొండెక్కిన చక్కెర ధర.. కేంద్రం కీలక నిర్ణయం
-
Tarique Rahman: భారత్ పర్యటనపై బంగ్లాదేశ్ ప్రధాని యూటర్న్.. కారణమిదేనా?
-
BC Reservation: బీసీలకు గుడ్న్యూస్.. స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ కోటా పెంపు.. ప్రభుత్వం ఉత్తర్వులు
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్తో అదిరిపోయే ఇయర్బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?