CM Revanth: క్రిస్టియన్ సోదరులు, సోదరీమణులకు క్రిస్మస్ శుభాకాంక్షలు..

  • క్రిస్మస్ పర్వదినం సందర్భంగా క్రిస్టియన్ సోదరులకు, సోదరీమణులకు సీఎం శుభాకాంక్షలు
  • ఏసుక్రీస్తు బోధనలు ఇప్పటికీ.. ఎప్పటికీ మానవాళికి మార్గదర్శకం- రేవంత్ రెడ్డి
  • శాంతి దూత ఇచ్చిన సందేశం మనందరికీ ఆదర్శంగా నిలుస్తుంది- సీఎం.
Cm Revanth

Cm Revanth

క్రిస్మస్ పర్వదినం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్రిస్టియన్ సోదరులకు, సోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపారు. ఏసుక్రీస్తు బోధనలు ఇప్పటికీ.. ఎప్పటికీ ప్రపంచంలోని మానవాళికి మార్గదర్శకమని అన్నారు. అన్ని మతాల సారాంశం మానవత్వమేనని ఆయన ఎంచుకున్న మార్గం అందరికీ దిక్సూచిగా నిలుస్తోందన్నారు. ఇతరుల పట్ల ప్రేమ, సహనం, శాంతి, సేవాభావం వంటి గొప్ప గుణాలను ఆచరించాలని.. శాంతి దూత ఇచ్చిన సందేశం మనందరికీ ఆదర్శంగా నిలుస్తుందని ముఖ్యమంత్రి అన్నారు.

Read Also: Sritej Health Bulletin : శ్రీ తేజ హెల్త్ బులిటెన్.. కళ్లు తెరుస్తున్నాడు..

×
×
Ad

ఏసు ప్రభువు బోధనలను అనుసరించి అన్ని మతాల సంక్షేమం, అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని తెలిపారు. క్రిస్టియన్ మైనారిటీల సర్వతోముఖాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంటుందన్నారు. క్రిస్టియన్ సోదరులు సంతోషముతో, ఆనందోత్సహాలతో క్రిస్మస్ ను జరుపుకోవాలని, క్రీస్తు అనుసరించిన మార్గాన్ని అనుసరించి సమాజ అభివృద్ధికై అందరు పాటుపడాలని అన్నారు. రాష్ట్రమంతటా క్రిస్మస్ వేడుకలను ఆనందంగా జరుపుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.

Read Also: Kishan Reddy: నైతిక విలువలకు ప్రాధాన్యత ఇచ్చిన వ్యక్తి వాజ్ పేయి..