Site icon NTV Telugu

CM Revanth Reddy : అక్బరుద్దీన్ ఆరోపణల్లో వాస్తవం లేదు..

Revanth Reddy

Revanth Reddy

అక్బరుద్దీన్ ఆరోపణలపై అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. అక్బరుద్దీన్ ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. ఎన్నికల ప్రచారంలో చిన్నపిల్లలను ప్రచారంలో వినియోగించారని అమిత్ షా, కిషన్ రెడ్డి పై ఫిర్యాదు చేసేందే కాంగ్రెస్ అని ఆయన వెల్లడించారు. ఎవరు ఔనన్నా కాదన్నా మోదీ దేశానికి ప్రధానమంత్రి… ఆయన రాష్ట్రాలన్నింటికి పెద్దన్నలాంటి వారు అని, గుజరాత్, బీహార్ లా తెలంగాణకు నిధులు ఇవ్వాలని ఆయన్ను కోరామన్నారు సీఎం రేవంత్‌ రెడ్డి. వివక్ష చూపకుండా పెద్దన్నలా వ్యవహరించి రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేసామని, ఈ మాటలు నేను ఎక్కడో చెవిలో చెప్పలేదు.. ఆదిలాబాద్ సభలో అందరి ముందే చెప్పా అన్నారు సీఎం రేవంత్‌ రెడ్డి. రాజకీయ ప్రయోజనం కోసం కాదు… రాష్ట్ర ప్రయోజనాల కోసమే మోదీని పెద్దన్నలా వ్యవహరించాలని చెప్పా అని ఆయన వెల్లడించారు. అంతేకాకుండా.. ఓల్డ్ సిటీని ఇస్తాంబుల్ చేస్తామని మేం మాటలతో కాలయపన చేయమని ఆయన వెల్లడించారు. అక్బరుద్దీన్ కు నేను మాట ఇస్తున్నానని, వచ్చే ఎన్నికల నాటికి మెట్రో రైల్ లో ఓల్డ్ సిటీలో తిరుగుతామన్నారు సీఎం రేవంత్‌ రెడ్డి. మేం ఏం చెప్పామో అది చేసి తీరుతామని, కేంద్రం నిధులు ఇచ్చినా…ఇవ్వకపోయినా ఓల్డ్ సిటీ మెట్రో పూర్తిచేస్తామన్నారు సీఎం రేవంత్‌ రెడ్డి.

 

Exit mobile version