Adudam Andhra: ఈనెల 13న విశాఖకు సీఎం జగన్.. ‘ఆడుదాం ఆంధ్రా’ ముగింపు వేడుకలకు హాజరు

Adudam Andra

Adudam Andra

ఈనెల 13న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విశాఖ పట్నం వెళ్లనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘ఆడుదాం ఆంధ్రా’ ముగింపు వేడుకల్లో ఆయన పాల్గొననున్నారు. ముగింపు వేడుకలు విశాఖలోని ACA స్టేడియంలో జరుగనున్నాయి. ఈ సందర్భంగా వైఎస్సార్ క్రికెట్ స్టేడియంలో జరిగే క్రికెట్ పోటీలను సీఎం జగన్ వీక్షించనున్నారు. అందుకోసం జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది.

Read Also: AP Assembly: ఏపీ అసెంబ్లీ నిరవధిక వాయిదా..

ఇదిలా ఉంటే.. రేపటి నుంచి విశాఖ వేదికగా ‘ఆడుదాం ఆంధ్రా’ ఫైనల్స్ జరుగనున్నాయి. ఈ పోటీల్లో 5 కేటగిరీల్లో 3వేల మంది క్రీడాకారులు పాల్గోనున్నారు. రేపు విశాఖ రైల్వే గ్రౌండ్ లో ప్రారంభ వేడుకలను క్రీడల శాఖా మంత్రి ఆర్కే రోజా ప్రారంభించనున్నారు. అందుకోసం కలెక్టర్ మల్లిఖార్జున షెడ్యూల్ ప్రకటించారు. ఇక ‘ఆడుదాం ఆంధ్రా’ పోటీల్లో విజేత జట్టుకు రూ. 5 లక్షలు, రన్నరప్ కు, మూడో స్థానంలో నిలిచిన జట్టుకు రూ. 2లక్షలు చొప్పున ప్రైజ్ మనీ అందజేస్తారు.

Read Also: OBC Row: “ప్రధాని ఓబీసీ కులంలో పుట్టలేదు”.. రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై కీలక విషయాలను గుర్తు చేసిన కేంద్రం