CM Chandrababu: ఐదు కోట్ల మంది ప్రజల సెంటిమెంట్ అమరావతి.. మూడేళ్లలో పూర్తి చేస్తా..
అమరావతి రాజధాని పునర్నిర్మాణం చేస్తున్నామంటే ఈరోజు కంటే ప్రత్యేకమైన రోజు మరి ఏది ఉండదలని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలిపారు. గతంలో మోడీని ఎప్పుడు కలిసిన చాలా ఆహ్లాదకరంగా ఉండేవారని.. కానీ మొన్నటి సమావేశంలో అమరావతికి రమ్మని పిలవడానికి వెళ్తే.. తమ భేటీ చాలా గంభీరంగా సాగిందని గుర్తు చేశారు. దీనికి ఏకైక కారణం ఉగ్రవాదుల దాడితో నా దేశ ప్రజల ప్రాణాలు కోల్పోయారని మోడీ ఆవేదనను మోడీలో తాను చూసినట్లు సీఎం తెలిపారు. ఉగ్రవాదులను అంతం చేయడానికి కేంద్రం తీసుకునే ప్రతి నిర్ణయంలో తాము ప్రధానికి అండగా ఉంటామని ప్రతిజ్ఞ చేశారు. రాష్ట్రంలోని ఐదు కోట్ల మంది ప్రజలు మోడీకి అండగా ఉన్నారన్నారు.
Also Read
- IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..
- Donald Trump: పాకిస్తాన్ మధ్యవర్తిత్వం విఫలం.. ట్రంప్ సంచలన నిర్ణయం..
- Barrier Free Tolling: భారత్లో కొత్త రకం టోల్ విధానం.. వాహనాలు ఆపాల్సిన అవసరం లేకుండా...
- Off The Record : కాకినాడలో 'పేకాట' జోరు.. వెనుక ఉన్నది ఎమ్మెల్యేల అనుచరులేనా?
అమరావతిని మూడేళ్లలో పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. అప్పుడు ప్రధాని మోడీని మళ్లీ ఆహ్వానిస్తామని చెప్పారు.. “రూ.57,980 కోట్ల ప్రాజెక్టులకు ఇవాళ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరుగుతున్నాయి.. మోడీ గైడెన్స్తో అమరావతిని ప్రపంచం మెచ్చే రాజధానిగా తయారు చేస్తాం.. అమరావతి 5 కోట్ల మంది ప్రజల సెంటిమెంట్.. 5 లక్షల మంది అమరావతిలో చదువుకునే అవకాశం ఉంటుంది.. అమరావతిని హెల్త్, ఎడ్యుకేషనల్ హబ్గా చేస్తాం.. అమరావతిని పర్యావరణహితంగా తయారు చేస్తాం.. బిట్స్ పిలానీ, టాటా ఇన్నోవేషన్ హాబ్ లాంటి సంస్థలు ఇక్కడికి వస్తాయి.” అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
READ MORE: Deputy CM Pawan Kalyan: ఆ బాధను నేను మర్చిపోలేను..
“కేంద్రం తీసుకున్న కులగణన నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం.. 2024 ఎన్నికల్లో నేను, పవన్ కళ్యాణ్ కలిసి పని చేసి 94 శాతం స్ట్రైక్ రేట్ సాధించాం.. ఇప్పుడు కేంద్రం ఇచ్చిన ఆసరాతో ఏపీ అభివృద్ధిలో ముందుకు వెళ్తుంది.. కేంద్రం సహకారంతో అమరావతిని మళ్లీ పట్టాలెక్కిస్తున్నాం.. 34 వేల ఎకరాల భూమిని రాజధాని కోసం ల్యాండ్ పూలింగ్ కింద ఇచ్చారు.. అమరావతి రైతులు వీరోచితంగా పోరాడారు, ఇది వాళ్ల విజయం.. అమరావతి రైతులు చేసిన ఉద్యమం లాంటి ఉద్యమాన్ని ఇంత వరకు నేను ఎప్పుడూ చూడలేదు.” అని సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Aari Arjunan :‘GS’తో తెలుగులోకి బిగ్ బాస్ విన్నర్ ఆరి అర్జునన్!
-
IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..
-
Suhas: సుహాస్, సూరి ‘మండాడి’ షూటింగ్ పూర్తి!
-
Off The Record : నెల్లిమర్ల ఎమ్మెల్యే పీఏపై తీవ్ర ఆరోపణలు
-
TVS Raider 125 2026: కొత్త TVS రైడర్ 125 బైక్.. అదరహో అనిపించే ఫీచర్లతో.. లక్ష రూపాయల కన్నా తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!