NTV Telugu Site icon

CM Chandrababu : ధాన్యం అమ్మిన రైతులకు 48 గంటల్లోనే సొమ్ము

Chandrababu Review

Chandrababu Review

సచివాలయంలో సోమవారం జరిగిన కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ పోలీసు శాఖ సమర్థవంతంగా పనిచేసేందుకు దోహదపడే అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని టీడీసీ ప్రభుత్వం తీసుకువస్తుందని అన్నారు. 2014-19లో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 15,000 సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయగా, దురదృష్టవశాత్తు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ (వైఎస్‌ఆర్‌సీపీ) ప్రభుత్వం వాటిని నిరుపయోగంగా మార్చేసింది. ప్రస్తుత డిస్పెన్సేషన్‌లో ఆ పరికరాలు ఏ మేరకు పనిచేస్తాయో పరిశీలిస్తుంది మరియు అవసరమైతే కొత్త వాటిని కొనుగోలు చేస్తుంది మరియు వాటిని వ్యూహాత్మక ప్రదేశాలలో పరిష్కరిస్తుంది, చంద్రబాబు నాయుడు చెప్పారు.

Bangladesh New Govt: నోబెల్ అవార్డు గ్రహీత ముహమ్మద్ యూనస్ సారథ్యంలో కొత్త ప్రభుత్వం..

అయితే… ఈ నేపథ్యంలోనే ఏపీ రైతులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది.. జిల్లాల కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. ఇకపై రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం అమ్మిన రైతులకు 48 గంటల్లోనే సొమ్ము చెల్లించాలని ఆదేశించారు. అంటే 48 గంటల్లోనే డబ్బుల్ని అకౌంట్‌‌లలో జమ చేయనున్నారు. అలాగే నాణ్యమైన గోతాలు ఇవ్వలేని పరిస్థితి నుంచి బయటపడాలని.. సేకరించిన ధాన్యాన్ని సమీప మిల్లులకే పంపాలని చంద్రబాబు సూచించారు. అంతేకాదు కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ధాన్యం బకాయిల్లో కొంత చెల్లించిన సంగతి తెలిసిందే. గత ప్రభుత్వంలో కాకినాడలోని ఒకే కుటుంబం చేతుల్లోకి సివిల్‌ సప్లైస్‌ కార్పొరేషన్, రైస్‌మిల్లర్ల అసోసియేషన్, ఎమ్మెల్యే పదవులన్నీ చేరాయన్నారు. అంటే దొంగ చేతికి తాళాలిచ్చారని వ్యాఖ్యానించారు.

Israel-Hamas war: ఇజ్రాయెల్‌పై ఏ క్షణమైనా ఇరాన్ దాడి చేసే ఛాన్స్: అమెరికా