CM Chandrababu: ‘ఉత్తరాంధ్ర’ ఇక నుంచి ‘ఉక్కు ఆంధ్ర’: సీఎం చంద్రబాబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలైంది. ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని పారిశ్రామిక హబ్గా మార్చే దిశగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భారీ అడుగు వేశారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేటలో సుమారు రూ.1.36 లక్షల కోట్ల పెట్టుబడితో ఏర్పాటు కానున్న ‘ఆర్సెలార్ మిట్టల్ – నిప్పన్ స్టీల్’ ప్లాంట్కు సోమవారం ఆయన భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. “ఉత్తరాంధ్ర ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం. ఇకపై ఉత్తరాంధ్ర అంటే కేవలం వెనుకబడిన ప్రాంతం కాదు.. అది ‘ఉక్కు ఆంధ్ర’గా పిలవబడుతుంది” అని రాసుకొచ్చారు. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రతి రంగంలో, ప్రతి ప్రాంతంలో విప్లవాత్మక మార్పు తీసుకువస్తామని ఆయన పేర్కొన్నారు.
READ ALSO: Vijawada : పట్టుబడిన ముగ్గురు యువకులకు ఉగ్రవాదులతో లింక్.. వెలుగులోకి కీలక విషయాలు..!
Also Read
- విదేశాల్లో ఉద్యోగాల పేరుతో హైదరాబాద్లో భారీ మోసం.. రోడ్డున పడ్డ 90 మంది నిరుద్యోగులు.!
- Pakistan: అసిమ్ మునీర్ గుట్టు బట్టబయలు.. న్యూక్లియర్ డీల్ కోసం చైనాకు పాక్ తాకట్టు.!
- Ramchander Rao: బండి సంజయ్పై పార్టీ చర్యలు తీసుకుంటుందా? క్లారిటీ ఇచ్చిన బీజేపీ చీఫ్ రామచందర్రావు
- AP Heatwave Alert: ఏపీలో ఎండల తీవ్రత.. వారం రోజుల పాటు హీట్వేవ్స్ హెచ్చరిక
స్టీల్ సిటీగా నక్కపల్లి
ఆర్సెలార్ మిట్టల్ ప్లాంట్ కేవలం ఒక పరిశ్రమ మాత్రమే కాదని, ఇది ఈ ప్రాంతాన్ని ఒక పూర్తి స్థాయి ‘స్టీల్ సిటీ’గా మారుస్తుందని ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. ఉక్కు రంగంలో ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే అత్యున్నత స్థానానికి తీసుకెళ్లడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. రూ.1.36 లక్షల కోట్ల వ్యయంతో ఇది దేశంలోనే అతిపెద్ద గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్లాంట్గా ఇది అవతరించనుంది. ఈ ప్లాంట్ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 1 లక్ష మందికి పైగా యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా. రెండు దశల్లో పూర్తయ్యే ఈ ప్రాజెక్టు ద్వారా ఏడాదికి 17.8 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 2028 డిసెంబర్ నాటికి మొదటి దశ ఉత్పత్తి ప్రారంభం కానుంది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అందించిన పూర్తి సహకారం వల్లే ఇంతటి భారీ ప్రాజెక్టును రాష్ట్రానికి తీసుకురాగలిగామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
READ ALSO: Indian Spy Movies: సరిహద్దులు దాటిన ఇండియన్ సినిమా క్రేజ్.. పాక్లో మన సినిమాలదే హవా!
తాజావార్తలు
-
విదేశాల్లో ఉద్యోగాల పేరుతో హైదరాబాద్లో భారీ మోసం.. రోడ్డున పడ్డ 90 మంది నిరుద్యోగులు.!
-
Pakistan: అసిమ్ మునీర్ గుట్టు బట్టబయలు.. న్యూక్లియర్ డీల్ కోసం చైనాకు పాక్ తాకట్టు.!
-
Chinmayi: డబ్బింగ్ రూమ్లో భావోద్వేగానికి గురైన చిన్మయి శ్రీపాద
-
Ramchander Rao: బండి సంజయ్పై పార్టీ చర్యలు తీసుకుంటుందా? క్లారిటీ ఇచ్చిన బీజేపీ చీఫ్ రామచందర్రావు
-
Redmi K100: 200MP కెమెరాతో రెడ్మీ K100 చవకైన స్మార్ట్ఫోన్.. 10,000mAh బ్యాటరీ!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..