Site icon NTV Telugu

TDP vs YCP Tension: పల్నాడులో టెన్షన్.. టీడీపీ- వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ.. ఈసీ కీలక నిర్ణయం!

Palnadu

Palnadu

TDP-YCP Clash in Palnadu: పల్నాడు జిల్లాలో పలు చోట్ల తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయి. పోలింగ్‌కు ముందే టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ కొనసాగుతుంది. రెంటాల, పాకాలపాడు, దూళిపాళ్ల, దాచేపల్లి, అచ్చంపేట, గురజాల గ్రామాల్లో పరస్పరం రాళ్లు, కర్రలతో దాడులు చేసుకుంటున్నారు. దీంతో ఈ ఘటనపై ఎలక్షన్ కమిషన్ ఆరా తీసింది. వెంటనే పరిస్థితిని అదుపు చేయాలని పోలీసులను ఆదేశాలను జారీ చేసింది. అవసరమైతే కేంద్ర బలగాలను అక్కడికి తరలించాలని సూచనలు చేసింది. అటు రెంటాడలో పోలింగ్ ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయినట్లుగా సమాచారం.

Read Also: Canada: కెనడా చరిత్రలోనే అతిపెద్ద బంగారం దోపిడి కేసులో మరో భారత సంతతి వ్యక్తి అరెస్ట్..

ఈ ఘర్షణ నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల్లోకి టీడీపీ ఏజెంట్లు వెళ్లడం లేదు. తమపై దాడులు చేస్తున్నారంటూ రోడ్డుపై బైఠాయించి ఆందోనళ చేస్తున్నారు. దీంతో పోలింగ్ ప్రక్రియపై టెన్షన్ కొనసాగతోంది. కాగా, ఈ ఘటనపై ఎన్నికల సంఘం సీరియస్ అయింది. ఇరు పార్టీలు ప్రశాంతంగా ఓటింగ్ జరిగేలా చూడాలని ఈసీ తెలిపింది. ఇక, పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరగేలా చూడాలంటూ పోలీస్ శాఖకు ఆదేశాలు ఇచ్చింది. అవసరమైతే కేంద్ర బలగాల సహాయం తీసుకోవాలని చెప్పుకొచ్చింది.

Exit mobile version