Chandrayaan-3: దక్షిణ ధ్రువమే ఎందుకు?.. చంద్రయాన్-3 లక్ష్యాలను వెల్లడించిన ఇస్రో చీఫ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chandrayaan-3: జాబిల్లిపై చంద్రయాన్-3 విజయవంతంగా ల్యాండ్ అయిన సంగతి అందరికి తెలిసిందే. చంద్రయాన్-3 చంద్రుని ఉపరితలంపై విజయవంతమైన సాఫ్ట్ ల్యాండింగ్కు ముందు అనేక అసమానతలను అధిగమించి భారతదేశాన్ని ఎలైట్ స్పేస్ క్లబ్లో చేర్చింది. ఇటీవల చంద్రుడి దక్షిణ ధ్రువంపై రష్యా విఫలయత్నం తర్వాత.. స్పేస్ క్రాఫ్ట్ను ల్యాండ్ చేసిన తొలి దేశంగా భారత్ నిలిచింది. చంద్రుని ఉపరితలంపై అంతరిక్ష నౌకను ల్యాండ్ చేయడంలో భారతదేశం చేసిన మూడవ ప్రయత్నం ఇది. చివరిది చంద్రయాన్ -2, సెప్టెంబర్ 2019 లో చంద్రునిపై ల్యాండర్ క్రాష్ అయిన తర్వాత పాక్షిక వైఫల్యంగా జాబితా చేయబడింది. చంద్రయాన్-3 మిషన్ విజయవంతం అయింది. కానీ ఇందుకు సంబంధించిన చాలా ప్రశ్నలకు సమాధానం లభించాల్సి ఉంది. చంద్రయాన్ 3 ద్వారా ఇస్రో సాధించాలనుకుంటున్న లక్ష్యాలు ఏమిటో తెలియాల్సి ఉంది. అసలు దక్షిణ ధ్రువాన్నే ఇస్రో ఎందుకు ఎంచుకుందనే.. ప్రశ్నలపై ఇస్రో చీఫ్ ఎస్.సోమనాథ్ సమాధానాలిచ్చారు.
Read Also: Viral Video: మేం ఆల్రెడీ చంద్రుడి మీదే ఉన్నాం.. చంద్రయాన్-3పై పాకిస్థాన్ యువకుడి ఫన్నీ కామెంట్
Also Read
- Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
- Supreme Court: 6వ తరగతిలో త్రిభాషా విధానంపై సుప్రీం కోర్టు కీలక సూచన
- Accident: కాకినాడ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. 30 మంది బంధువులు పెళ్లి వేడుక ముగించుకుని వెళ్తుండగా ఇలా..
- Prithvi Shaw: యువ క్రికెటర్ పృథ్వీ షా–ఆకృతి అగర్వాల్ సంచలన నిర్ణయం.. పెళ్లికి ముందే బ్రేకప్..
చంద్రయాన్-2 దారుణం క్రాష్ అయినందున, తాము ఏమీ కోలుకోలేకపోయామని, ప్రతిదీ తాజాగా చేయాల్సి వచ్చిందని ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్ చెప్పారు. చంద్రయాన్-3 మిషన్ను పూర్తిగా కొత్తగా ప్రారంభించాల్సి వచ్చిందన్నారు. నాలుగేళ్లు తాము పూర్తిగా చంద్రయాన్-3 ప్రాజెక్టుపైనే దృష్టిని కేంద్రీకరించామన్నారు. “మొదటి సంవత్సరం చంద్రయాన్-2లో ఏమి తప్పు జరిగిందో తెలుసుకోవడానికి సమయం కేటాయించాం, మరుసటి సంవత్సరం తప్పులు సరిచేయడానికి పనిచేశాం. ఇక చివరి రెండు సంవత్సరాల్లో అనేక పరీక్షలు చేశాం. ” అని ఆయన చెప్పారు. కొవిడ్ మహమ్మారి వల్ల అంతరిక్ష పరిశోధనా సంస్థ తీవ్రంగా దెబ్బతిందని ఆయన అన్నారు.”కొవిడ్ మా కార్యక్రమాలలో కొన్నింటిని కలవరపరిచింది. కానీ మేము ఇంకా కొన్ని రాకెట్లను ప్రయోగిస్తున్నాము. కొవిడ్ తర్వాత తిరిగి ట్రాక్లోకి వచ్చాము” అని ఇస్రో చీఫ్ సోమనాథ్ చెప్పారు. దక్షిణ ధ్రువాన్నే ఎందుకు ఎంచుకున్నారనే ప్రశ్నకు కూడా ఆయన సమాధానం ఇచ్చారు. చంద్రయాన్ 3 ద్వారా చంద్రుడిపై వాటర్ ఐస్కు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవచ్చని తెలిపారు. చంద్రుడిపై మనకు లభించే విలువైన వనరుల్లో ఇది ఒకటి అంటూ ఆయన వెల్లడించారు. చంద్రుని దక్షిణ ధ్రువం దగ్గర సాఫ్ట్ ల్యాండింగ్ను మరే ఇతర అంతరిక్ష నౌక కూడా సాధించలేకపోయినందున చంద్రయాన్-3 విజయం చాలా ప్రత్యేకమైనదన్నారు.
Read Also: Bharat Jodo Yatra: భారత్ జోడో యాత్ర-2 తేదీ ఖరారు.. గాంధీ పుట్టిన గడ్డ నుంచే..
“చంద్రయాన్ 3 ఇన్స్ట్రుమెంటేషన్ మొత్తం చంద్రుడి దక్షిణ ధ్రువం లేదా దానికి సమీపంలో ల్యాండింగ్ కోసం సిద్ధం చేసిందే. ఎందుకంటే దక్షిణ ధ్రువం వద్ద పెద్ద మొత్తంలో శాస్త్రీయ విషయాలు తెలుసుకునే అవకాశం ఉన్నది. నీరు, ఇతర ఖనిజాలు, లవణాలు ఎక్కువగా ఈ దక్షిణ ధ్రువం వద్దే నిల్వ ఉన్నాయి’ అని ఇస్రో చీఫ్ సోమనాథ్ వివరించారు. చంద్రయాన్-3 మిషన్ నుంచి కనుగొన్న విషయాలు చంద్రుని అత్యంత విలువైన వనరులలో ఒకటైన చంద్ర నీటి మంచు గురించిన జ్ఞానాన్ని అభివృద్ధి చేయగలవని ఆయన పేర్కొన్నారు. దీంతో పాటు అనేక మంది శాస్త్రవేత్తలు చంద్రుడి పుట్టుక, ఏర్పాటు, అక్కడి పరిస్థితుల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారని.. వీటి గురించి అన్వేషించడానికి చంద్రయాన్-3 సమర్థవంతమైనదని ఇస్రో చీఫ్ సోమనాథ్ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Supreme Court: 6వ తరగతిలో త్రిభాషా విధానంపై సుప్రీం కోర్టు కీలక సూచన
-
Accident: కాకినాడ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. 30 మంది బంధువులు పెళ్లి వేడుక ముగించుకుని వెళ్తుండగా ఇలా..
-
Prithvi Shaw: యువ క్రికెటర్ పృథ్వీ షా–ఆకృతి అగర్వాల్ సంచలన నిర్ణయం.. పెళ్లికి ముందే బ్రేకప్..
-
Swara Bhasker: ‘‘రామ మందిర తీర్పుతో బాధపడ్డా.. షారుఖ్, సల్మాన్లకు క్షమాపణలు’’.. స్వరా భాస్కర్ మరో వివాదం..
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!