NTV Telugu Site icon

Corona Virus: వేగంగా విస్తరిస్తున్న మహమ్మారి.. ఆస్పత్రులకు క్యూ కడుతున్న జనం

China Corona

China Corona

Corona Virus: కరోనాకు పుట్టినిల్లు చైనాలో కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. దీంతో ప్రజలు వైద్యం కోసం ఆసుపత్రుల బాట పడుతున్నారు. చైనాలో కరోనా వ్యాప్తి నిత్యం అంతకంతకూ పెరుగుతోంది. అక్కడ ఆంక్షలకు వ్యతిరేకంగా ప్రజలు నిరసన వ్యక్తం చేయడంతో ఇప్పుడు అన్ని ఆంక్షలను సడలించారు. అయితే, రోజువారీ లెక్కలు కొత్త గరిష్టాలను చేరుతున్నాయి. చైనాలో 93 శాతానికి పైగా ప్రజలు ఈ వ్యాధి నివారణ వ్యాక్సిన్లు వేయించుకోలేదు. రోజుకు 10 లక్షల మందికి పైగా వ్యాక్సిన్లు వేస్తున్నారు. చైనాలోని బీజింగ్‌లో గత కొద్ది రోజులుగా కరోనా వేగంగా విస్తరిస్తోంది. బీజింగ్‌తో సహా ప్రధాన నగరాల్లో, ప్రజలు ఆసుపత్రుల ముందు చాలా క్యూలలో వేచి ఉన్నారు.

Read Also: Landslide : మలేషియాలో విషాదం.. కొండచరియలు విరిగిపడి 50 మంది గల్లంతు

ఫుట్ పాత్ లపై కూడా గంటల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొంది. చాలా మంది తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. ఈ పరిస్థితిలో, గత నెలలో కరోనా ఆంక్షలకు వ్యతిరేకంగా జరిగిన నిరసనలో విదేశీ కుట్ర ఉండవచ్చునని చైనా అనుమానిస్తోంది. నిరసన సందర్భంగా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌కు వ్యతిరేకంగా, అధికార కమ్యూనిస్టు పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ నిరసన బీజింగ్, షాంఘై, గ్వాంగ్‌డాంగ్‌తో సహా నగరాల్లో కూడా జరిగింది. కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తున్న సందర్భంలోనే విదేశీ శక్తులు ఈ రకంగా ప్రజల నిరసనకు ప్రేరేపించి ఉంటాయని చైనా అనుమానిస్తోంది. ఈ క్రమంలోనే దర్యాప్తును కొనసాగిస్తోంది.