China: సముద్రగర్భంలో చైనా ‘సైనిక’ వేగులు.. అమెరికా స్థావరాలే టార్గెట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
China: ప్రపంచ దేశాల సముద్ర జలాలపై పట్టు సాధించేందుకు చైనా సరికొత్త ‘సముద్రగర్భ’ యుద్ధానికి తెరలేపింది. శాస్త్రీయ పరిశోధనల ముసుగులో పసిఫిక్, హిందూ, ఆర్కిటిక్ మహాసముద్రాల్లో భారీ ఎత్తున మ్యాపింగ్ ప్రక్రియను చేపట్టింది. అమెరికా, దాని మిత్రదేశాల జలాంతర్గాములను ముప్పు తిప్పలు పెట్టడమే లక్ష్యంగా సాగుతున్న ఈ ఆపరేషన్ ఇప్పుడు అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది.
Also Read
- BC Reservation: బీసీలకు గుడ్న్యూస్.. స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ కోటా పెంపు.. ప్రభుత్వం ఉత్తర్వులు
- Rakhi Making at Home: థ్రెడ్, పూసలతో అందమైన రాఖీ.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా
- JPSC Exams: హేమంత్ సోరెన్ ప్రభుత్వానికి హైకోర్టు షాక్.. JPSC పరీక్షల రద్దుపై స్టే
- Bangladesh: బంగ్లాదేశ్ నూతన అధ్యక్షుడిగా మీర్జా ఫక్రుల్ ఎన్నిక
‘డాంగ్ ఫాంగ్ హాంగ్ 3’.. నిఘా నౌకల ప్రైవేట్ సైన్యం..
ఈ మొత్తం ఆపరేషన్లో చైనా సముద్ర విశ్వవిద్యాలయానికి చెందిన ‘డాంగ్ ఫాంగ్ హాంగ్ 3’ అనే నౌక కీలక పాత్ర పోషిస్తోంది. రాయిటర్స్ నివేదిక ప్రకారం.. ఈ నౌక 2024 నుంచి 2025 మధ్య కాలంలో తైవాన్, గ్వామ్లోని అమెరికా సైనిక స్థావరాలు, మలక్కా జలసంధి వంటి కీలక ప్రాంతాలను పదేపదే చుట్టేసింది. కేవలం ఇదొక్కటే కాకుండా, డజన్ల కొద్దీ నౌకలు, వందలాది సెన్సార్లు సముద్ర గర్భాన్ని క్షుణ్ణంగా మ్యాపింగ్ చేస్తున్నాయి. సముద్రపు లోతు, ఉష్ణోగ్రత, లవణీయత (Salinity), నీటి ప్రవాహాల సమాచారాన్ని సేకరించడం వెనుక చైనాకు రెండు ప్రధాన సైనిక ప్రయోజనాలు ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొదటిది చైనా జలాంతర్గాములు శత్రువుల కంట పడకుండా ఎక్కడ దాక్కోవచ్చో, ఏ మార్గాల్లో ప్రయాణించవచ్చో ఈ డేటా ద్వారా తెలుస్తుంది. రెండవది సముద్ర పరిస్థితులపై పట్టు ఉంటే, అమెరికా లేదా ఇతర దేశాల జలాంతర్గాముల నుంచి వెలువడే శబ్దాలను పసిగట్టి వాటిని సులభంగా వేటాడవచ్చు.
కీలక ప్రాంతాలపై నజర్
చైనా ప్రధానంగా హవాయి, గ్వామ్, జపాన్, ఫిలిప్పీన్స్ చుట్టూ ఉన్న జలాలపై దృష్టి సారించింది. చైనాకు అవసరమైన చమురు, వస్తు రవాణా మలక్కా జలసంధి గుండానే జరుగుతుంది. అందుకే ఈ ప్రాంతంపై పూర్తి అవగాహన కోసం ఇక్కడ మ్యాపింగ్ను ముమ్మరం చేసింది. భవిష్యత్తులో ఆర్కిటిక్ ప్రాంతంలో తన ఉనికిని చాటుకోవడానికి ఇప్పటి నుంచే సముద్రగర్భ సర్వేలను వేగవంతం చేసింది. చైనా అనుసరిస్తున్న ఈ విధానం ప్రకారం.. విశ్వవిద్యాలయాలు లేదా పౌర పరిశోధన సంస్థలు సేకరించే ఏ సమాచారమైనా నేరుగా సైన్యానికి (PLA) అందుతుంది. శాస్త్రీయ పరిశోధన పేరుతో అంతర్జాతీయ జలాల్లోకి ప్రవేశించి, ఆ సమాచారాన్ని యుద్ధ తంత్రాల కోసం ఉపయోగించుకోవడం చైనాకు అలవాటుగా మారిందని అంటున్నారు. మొత్తానికి, సముద్రపు అడుగున ప్రతి కదలికను పర్యవేక్షించగలిగేలా ‘పారదర్శక సముద్రాన్ని’ సృష్టించడమే చైనా అంతిమ లక్ష్యమని రక్షణ రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
READ ALSO: Prince Yawar: బిగ్బాస్ ఫేమ్ ప్రిన్స్ యావర్కు ‘హనీ ట్రాప్’ సెగ.. రూ.23 లక్షలు వసూలు!
తాజావార్తలు
-
BC Reservation: బీసీలకు గుడ్న్యూస్.. స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ కోటా పెంపు.. ప్రభుత్వం ఉత్తర్వులు
-
Rakhi Making at Home: థ్రెడ్, పూసలతో అందమైన రాఖీ.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా
-
TS Inter 2026 : ఇంటర్ పాస్.. మెమోలు రెడీ.. ఎక్కడ తీసుకోవాలంటే.?
-
Former OSD Sumanth : మంత్రి మాజీ ఓఎస్డీపై అటెంప్ట్ మర్డర్ కేసు..
-
JPSC Exams: హేమంత్ సోరెన్ ప్రభుత్వానికి హైకోర్టు షాక్.. JPSC పరీక్షల రద్దుపై స్టే
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్తో అదిరిపోయే ఇయర్బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?