China viral News: బతికున్న 8 కప్పలను మింగిన బామ్మ.. తర్వాత ఏమైందో తెలుసా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
China viral News: అనారోగ్యాన్ని బాగు చేసుకోవాలని ఓ 82 ఏళ్ల బామ్మ.. బతికున్న 8 కప్పలను మింగింది. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలుసా.. చైనాలో. గతంలో మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో ఎవరైనా అనారోగ్యం పాలైతే నాటు వైద్యం చేసే వారి వద్దకు వెళ్లే వాళ్లు. ఈ బామ్మ కథ తెలిసిన తర్వాత ఇలాంటి వాళ్లు ఇంకా ఉన్నారా అనే ఆశ్చర్యం వేయకమానదు. చైనా బామ్మ తన అనారోగ్యం నయం చేసుకోవాలని తనకు తానే నాటు వైద్యం చేసుకుంది. ఆమె చేసిన పనికి అనారోగ్యం తగ్గడం పక్కన పెడితే.. కాస్తోకూస్తో మంచిగా ఉన్న ఆరోగ్యం మరింత క్షీణించింది.
READ ALSO: Smriti Mandhana: చేసింది 23 పరుగులే.. అయినా చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన!
Also Read
- Nag Ashwin: కమల్ హాసన్ మిస్ చేసుకున్న కథతో.. నాన్-స్టాప్ మ్యూజికల్ వింతగా ‘సింగ్ గీతం’
- Manav Suthar: టీమిండిలో మరో యువ కెరటం.. భారత టెస్టు జట్టులోకి దూసుకొచ్చిన ఈ కుర్రాడు ఎవరో తెలుసా?
- CM Revanth Reddy: నన్ను మభ్యపెట్టడం అంత ఈజీ కాదు.. సీఎం రేవంత్రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు..
- Visakhapatnam-Araku Vistadome Train: ఏపీకి జాతీయ స్థాయిలో గౌరవం.. దేశంలోనే నెం.1 రూట్గా విశాఖ-అరకు విస్టాడోమ్ రైలు ప్రయాణం.!
కొంప ముంచిన నడుము నొప్పి..
చైనాకు చెందిన బామ్మ పేరు జాంగ్. వాళ్లది తూర్పు చైనా. 82 ఏళ్ల బామ్మ నడుము నొప్పితో బాధ పడుతోంది. డాక్టర్ల వద్దకు వెళ్లకుండా తన అనారోగ్యాన్ని తానే నయం చేసుకోవాలని నాటు వైద్యంతో చేసుకోవాలనుకుంది. దీంతో బామ్మ బతికి ఉన్న కప్పలను తినడం వల్ల తన నొప్పి తగ్గుతుందని అనుకుంది. తన ఆలోచనను ఎవరితోనైనా చెప్పితే వద్దు అని వారిస్తారని ఎవరికీ చెప్పకుండా.. తన కోసం కొన్ని కప్పలను పట్టుకోవాలని కుటుంబ సభ్యులను కోరింది. బామ్మ వాళ్లు పట్టుకొచ్చిన వాటిలో మూడు కప్పలను ఒకరోజు.. మరుసటి రోజు మరో 5 కప్పలను బతికుండగానే మింగేసింది.
తర్వాత ఏమైందో తెలుసా..
కప్పలను మింగిన తర్వాత బామ్మకు తీవ్రమైన కడుపు నొప్పి రావడం మొదలైంది. కప్పలను తిన్న తర్వాత జాంగ్కు మొదట్లో అసౌకర్యంగా అనిపించింది. కానీ క్రమంగా కొన్ని రోజుల్లో నొప్పి తీవ్రమైంది. ఏమైందని ఆరా తీస్తే.. బామ్మ అప్పుడు తన కుటుంబానికి తాను ఏమి చేసిందో చెప్పింది. వెంటనే వాళ్ల కుటుంబ సభ్యులు బామ్మ బాధ చూడలేక సెప్టెంబర్ ప్రారంభంలో జెజియాంగ్ ప్రావిన్స్లోని హాంగ్జౌలోని ఒక ఆస్పత్రిలో చేర్పించారు. అనంతరం బామ్మ కొడుకు మాట్లాడుతూ.. కప్పలను తిన్న తర్వాత తన తల్లి నడవలేకపోయిందని చెప్పారు. తర్వాత ఆమెను జెజియాంగ్ యూనివర్సిటీ అనుబంధ ఆసుపత్రికి తరలించారు. అక్కడ బామ్మను పరీక్షించిన వైద్యులు ఆమె కడుపులో ఎక్కువ సంఖ్యలో ఆక్సిఫిల్ కణాలు ఉన్నట్లు గుర్తించారు. ఇది పారాసైట్ ఇన్ఫెక్షన్లు లేదా రక్త రుగ్మతలను సూచిస్తుందని పేర్కొన్నారు. కప్పలను మింగడంతో బామ్మ జీర్ణవ్యవస్థ దెబ్బతిందని.. స్పార్గనమ్తో సహా పలు రకాల పరాన్నజీవులు ఆమె శరీరంలో ఉన్నాయని ఆసుపత్రి వైద్యుడు చెప్పారు. రెండు వారాల చికిత్స తర్వాత బామ్మను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు.
చైనాలో చాలా మంది వృద్ధులు తమ ఆరోగ్యం గురించి కుటుంబ సభ్యులతో చెప్పకుండా ఇలాంటివి చేస్తారన్నారు డాక్టర్ వు జోంగ్వెన్ అన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వాళ్ల ఆరోగ్య పరిస్థితి తీవ్రం అయ్యాక ఆస్పత్రులకు వస్తారన్నారు. అయితే ఇలా బతుకున్న జంతువులను తింటే.. పరాన్నజీవులను శరీరంలోకి ప్రవేశిస్తాయని చెప్పారు. ఫలితంగా దృష్టి లోపం, ఇంట్రాక్రానియల్ ఇన్ఫెక్షన్లతో సోకుతాయని.. కొన్ని సార్లు ప్రాణాంతకం కూడా అవుతాయని వెల్లడించారు. వృద్ధుల్లోనే ఇలాంటి కేసులు ఎక్కువగా బయట పడుతున్నాయని తెలిపారు.
తాజావార్తలు
-
Kalki 2: వచ్చే నెల నుంచే ‘కల్కి 2’ నాన్-స్టాప్ షూటింగ్!
-
SlumDog – 33 Temple Road: ‘స్లమ్డాగ్ – 33 టెంపుల్ రోడ్’ కు డబ్బింగ్ చెప్పిన విజయ్ సేతుపతి… టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్
-
Nag Ashwin: కమల్ హాసన్ మిస్ చేసుకున్న కథతో.. నాన్-స్టాప్ మ్యూజికల్ వింతగా ‘సింగ్ గీతం’
-
Mobile Battery: రాత్రంతా ఫోన్ ఛార్జింగ్ పెడితే నిజంగానే బ్యాటరీ పాడవుతుందా? అసలు నిజం ఏమిటి?
-
Peddi : అప్పటి నుంచే జాన్వీ సీన్లు కట్ చేసిన ‘పెద్ది’!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!