China viral News: బతికున్న 8 కప్పలను మింగిన బామ్మ.. తర్వాత ఏమైందో తెలుసా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
China viral News: అనారోగ్యాన్ని బాగు చేసుకోవాలని ఓ 82 ఏళ్ల బామ్మ.. బతికున్న 8 కప్పలను మింగింది. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలుసా.. చైనాలో. గతంలో మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో ఎవరైనా అనారోగ్యం పాలైతే నాటు వైద్యం చేసే వారి వద్దకు వెళ్లే వాళ్లు. ఈ బామ్మ కథ తెలిసిన తర్వాత ఇలాంటి వాళ్లు ఇంకా ఉన్నారా అనే ఆశ్చర్యం వేయకమానదు. చైనా బామ్మ తన అనారోగ్యం నయం చేసుకోవాలని తనకు తానే నాటు వైద్యం చేసుకుంది. ఆమె చేసిన పనికి అనారోగ్యం తగ్గడం పక్కన పెడితే.. కాస్తోకూస్తో మంచిగా ఉన్న ఆరోగ్యం మరింత క్షీణించింది.
READ ALSO: Smriti Mandhana: చేసింది 23 పరుగులే.. అయినా చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన!
Also Read
- Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
- Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
- Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
- Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
కొంప ముంచిన నడుము నొప్పి..
చైనాకు చెందిన బామ్మ పేరు జాంగ్. వాళ్లది తూర్పు చైనా. 82 ఏళ్ల బామ్మ నడుము నొప్పితో బాధ పడుతోంది. డాక్టర్ల వద్దకు వెళ్లకుండా తన అనారోగ్యాన్ని తానే నయం చేసుకోవాలని నాటు వైద్యంతో చేసుకోవాలనుకుంది. దీంతో బామ్మ బతికి ఉన్న కప్పలను తినడం వల్ల తన నొప్పి తగ్గుతుందని అనుకుంది. తన ఆలోచనను ఎవరితోనైనా చెప్పితే వద్దు అని వారిస్తారని ఎవరికీ చెప్పకుండా.. తన కోసం కొన్ని కప్పలను పట్టుకోవాలని కుటుంబ సభ్యులను కోరింది. బామ్మ వాళ్లు పట్టుకొచ్చిన వాటిలో మూడు కప్పలను ఒకరోజు.. మరుసటి రోజు మరో 5 కప్పలను బతికుండగానే మింగేసింది.
తర్వాత ఏమైందో తెలుసా..
కప్పలను మింగిన తర్వాత బామ్మకు తీవ్రమైన కడుపు నొప్పి రావడం మొదలైంది. కప్పలను తిన్న తర్వాత జాంగ్కు మొదట్లో అసౌకర్యంగా అనిపించింది. కానీ క్రమంగా కొన్ని రోజుల్లో నొప్పి తీవ్రమైంది. ఏమైందని ఆరా తీస్తే.. బామ్మ అప్పుడు తన కుటుంబానికి తాను ఏమి చేసిందో చెప్పింది. వెంటనే వాళ్ల కుటుంబ సభ్యులు బామ్మ బాధ చూడలేక సెప్టెంబర్ ప్రారంభంలో జెజియాంగ్ ప్రావిన్స్లోని హాంగ్జౌలోని ఒక ఆస్పత్రిలో చేర్పించారు. అనంతరం బామ్మ కొడుకు మాట్లాడుతూ.. కప్పలను తిన్న తర్వాత తన తల్లి నడవలేకపోయిందని చెప్పారు. తర్వాత ఆమెను జెజియాంగ్ యూనివర్సిటీ అనుబంధ ఆసుపత్రికి తరలించారు. అక్కడ బామ్మను పరీక్షించిన వైద్యులు ఆమె కడుపులో ఎక్కువ సంఖ్యలో ఆక్సిఫిల్ కణాలు ఉన్నట్లు గుర్తించారు. ఇది పారాసైట్ ఇన్ఫెక్షన్లు లేదా రక్త రుగ్మతలను సూచిస్తుందని పేర్కొన్నారు. కప్పలను మింగడంతో బామ్మ జీర్ణవ్యవస్థ దెబ్బతిందని.. స్పార్గనమ్తో సహా పలు రకాల పరాన్నజీవులు ఆమె శరీరంలో ఉన్నాయని ఆసుపత్రి వైద్యుడు చెప్పారు. రెండు వారాల చికిత్స తర్వాత బామ్మను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు.
చైనాలో చాలా మంది వృద్ధులు తమ ఆరోగ్యం గురించి కుటుంబ సభ్యులతో చెప్పకుండా ఇలాంటివి చేస్తారన్నారు డాక్టర్ వు జోంగ్వెన్ అన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వాళ్ల ఆరోగ్య పరిస్థితి తీవ్రం అయ్యాక ఆస్పత్రులకు వస్తారన్నారు. అయితే ఇలా బతుకున్న జంతువులను తింటే.. పరాన్నజీవులను శరీరంలోకి ప్రవేశిస్తాయని చెప్పారు. ఫలితంగా దృష్టి లోపం, ఇంట్రాక్రానియల్ ఇన్ఫెక్షన్లతో సోకుతాయని.. కొన్ని సార్లు ప్రాణాంతకం కూడా అవుతాయని వెల్లడించారు. వృద్ధుల్లోనే ఇలాంటి కేసులు ఎక్కువగా బయట పడుతున్నాయని తెలిపారు.
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!