China: యుద్ధానికి సిద్ధమవుతున్న చైనా.. సంచలన వ్యాఖ్యలు తెరమీదకు!
‘China an existential threat to US says Indian-American Nikki Haley: కరోనా (కోవిడ్ 19) అనే మహమ్మారిని ప్రపంచ దేశాలపైకి వదిలి.. అందరినీ గడగడలాడించిన చైనా.. ఇప్పుడు అమెరికాతో పాటు ప్రపంచం మొత్తానికీ పెద్ద ముప్పుగా మారిందని, ఆ దేశం యుద్ధానికి సిద్ధమవుతోంది.. అందరూ జాగ్రత్తగా ఉండాలంటూ అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో ఉన్న నిక్కీ హేలీ కీలక వ్యాఖ్యలు చేశారు. స్థానిక కాలమానం ప్రకారం.. శుక్రవారం న్యూహ్యాంప్ షైర్ లో ఏర్పాటు చేసిన ఆర్థిక వ్యవస్థ విధి, విధానాలపై ఏర్పాటు చేసిన ప్రసంగంలో చైనాను ఉద్దేశించి ఆమె ప్రపంచ దేశాలకు ఈ హెచ్చరికలు జారీ చేశారు. అగ్రరాజ్యమైన తమ దేశానికి డ్రాగన్ కంట్రీ చైనాతో ప్రమాదం పొంచి ఉందని, తమపై యుద్ధానికి చైనా సిద్ధమవుతోందని నిక్కీ పేర్కొన్నారు. 50 ఏళ్లుగా చైనా తమపై యుద్ధం చేసి ఓడించేందుకు పన్నాగాలు పన్నుతోందని ఆమె చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఇప్పటికే కొన్ని విషయాలలో చైనా సైన్యం అమెరికా సైన్యంతో సమానంగా ఉందన్నారు.
Riniki Bhuyan Sarma: ఎంపీపై సీఎం భార్య పరువు నష్టం దావా
Also Read
- Tamilnadu Elections: తమిళనాడులో ఓటేసిన సినీ, రాజకీయ ప్రముఖులు
- Petrol, Diesel Price Hike: ఎలక్షన్ తర్వాత పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై కేంద్రం క్లారిటీ.. పాత రికార్డులు గుర్తు చేస్తూ..
- Nandre Burger: కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘన.. రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్ కు జరిమానా, డీమెరిట్ పాయింట్ కూడా.!
- Bengal Tiger: రూటు మార్చిన బెంగాల్ టైగర్.. మళ్లీ తూర్పుగోదావరి జిల్లాలోకి ఎంట్రీ!
దేశ మనుగడకోసం కమ్యూనిస్టు దేశమైన చైనాను ఎదుర్కొనేందుకు బలం, ఆత్మాభిమానం చాలా అవసరమని ఆమె అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. చైనా.. అమెరికా వాణిజ్య రహస్యాలను తెలుసుకుని, తమపై గెలవాలని ప్రణాళికలు వేస్తోందని, చైనాను ఎదుర్కొనేందుకు అందరూ సంసిద్ధంగా ఉండాలని నిక్కీ హేలీ సూచించారు. ఆర్థిక ప్రణాళికలపై నిక్కీ హేలీ మాట్లాడుతూ.. దేశంలో ఉన్న మధ్యతరగతి ప్రజలకు నిజమైన ఆర్థిక స్వేచ్ఛను అందించేందుకు తనవంతు కృషి చేస్తానన్నారు. అమెరికా ప్రజలంతా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తారని తనకు పూర్తి నమ్మకం ఉందని, తనను అధ్యక్షురాలిని చేస్తే.. ఆర్థిక వినియోగంపై అందరికీ పూర్తి స్వేచ్ఛను తీసుకొస్తానని హామీ ఇచ్చారు. ఫెడరల్ గ్యాస్, డీజిల్ పన్నును పూర్తిగా తొలగిస్తామన్నారు. తద్వారా అధిక గ్యాస్ ధరలతో విసిగిపోతున్న మధ్యతరగతి కుటుంబాలకు కాస్తంత ఊరట లభిస్తుందన్నారు. అలాగే శ్రామిక కుటుంబాలకు ఆదాయపు పన్ను తగ్గించడంతో పాటు.. బైడెన్ ప్రభుత్వం చేపట్టిన 500 బిలియన్ డాలర్ల గ్రీన్ ఎనర్జీ సబ్సిడీలను కూడా తొలగిస్తానని నిక్కీ హేలీ హామీల వర్షం కురిపించారు.
తాజావార్తలు
-
Tamilnadu Elections: తమిళనాడులో ఓటేసిన సినీ, రాజకీయ ప్రముఖులు
-
Petrol, Diesel Price Hike: ఎలక్షన్ తర్వాత పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై కేంద్రం క్లారిటీ.. పాత రికార్డులు గుర్తు చేస్తూ..
-
Nandre Burger: కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘన.. రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్ కు జరిమానా, డీమెరిట్ పాయింట్ కూడా.!
-
Bengal Tiger: రూటు మార్చిన బెంగాల్ టైగర్.. మళ్లీ తూర్పుగోదావరి జిల్లాలోకి ఎంట్రీ!
-
Tollywood – Bollywood : బాలీవుడ్ హీరోలతో టాలీవుడ్ డైరెక్టర్స్
ట్రెండింగ్
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?