China: యుద్ధానికి సిద్ధమవుతున్న చైనా.. సంచలన వ్యాఖ్యలు తెరమీదకు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘China an existential threat to US says Indian-American Nikki Haley: కరోనా (కోవిడ్ 19) అనే మహమ్మారిని ప్రపంచ దేశాలపైకి వదిలి.. అందరినీ గడగడలాడించిన చైనా.. ఇప్పుడు అమెరికాతో పాటు ప్రపంచం మొత్తానికీ పెద్ద ముప్పుగా మారిందని, ఆ దేశం యుద్ధానికి సిద్ధమవుతోంది.. అందరూ జాగ్రత్తగా ఉండాలంటూ అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో ఉన్న నిక్కీ హేలీ కీలక వ్యాఖ్యలు చేశారు. స్థానిక కాలమానం ప్రకారం.. శుక్రవారం న్యూహ్యాంప్ షైర్ లో ఏర్పాటు చేసిన ఆర్థిక వ్యవస్థ విధి, విధానాలపై ఏర్పాటు చేసిన ప్రసంగంలో చైనాను ఉద్దేశించి ఆమె ప్రపంచ దేశాలకు ఈ హెచ్చరికలు జారీ చేశారు. అగ్రరాజ్యమైన తమ దేశానికి డ్రాగన్ కంట్రీ చైనాతో ప్రమాదం పొంచి ఉందని, తమపై యుద్ధానికి చైనా సిద్ధమవుతోందని నిక్కీ పేర్కొన్నారు. 50 ఏళ్లుగా చైనా తమపై యుద్ధం చేసి ఓడించేందుకు పన్నాగాలు పన్నుతోందని ఆమె చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఇప్పటికే కొన్ని విషయాలలో చైనా సైన్యం అమెరికా సైన్యంతో సమానంగా ఉందన్నారు.
Riniki Bhuyan Sarma: ఎంపీపై సీఎం భార్య పరువు నష్టం దావా
Also Read
- Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
- Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
- NEET Paper Leak: రూ. 10 లక్షలకు కొని, రూ. 15 లక్షలకు అమ్మకం.. నీట్ పేపర్ లీక్ కేసులో నిందితుడి అరెస్ట్..
- KCR : బీఆర్ఎస్ సభ్యత్వ నమోదులో డిజిటల్ విప్లవం.. ఎర్రవెల్లిలో కేసీఆర్ సుదీర్ఘ మంతనాలు.!
దేశ మనుగడకోసం కమ్యూనిస్టు దేశమైన చైనాను ఎదుర్కొనేందుకు బలం, ఆత్మాభిమానం చాలా అవసరమని ఆమె అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. చైనా.. అమెరికా వాణిజ్య రహస్యాలను తెలుసుకుని, తమపై గెలవాలని ప్రణాళికలు వేస్తోందని, చైనాను ఎదుర్కొనేందుకు అందరూ సంసిద్ధంగా ఉండాలని నిక్కీ హేలీ సూచించారు. ఆర్థిక ప్రణాళికలపై నిక్కీ హేలీ మాట్లాడుతూ.. దేశంలో ఉన్న మధ్యతరగతి ప్రజలకు నిజమైన ఆర్థిక స్వేచ్ఛను అందించేందుకు తనవంతు కృషి చేస్తానన్నారు. అమెరికా ప్రజలంతా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తారని తనకు పూర్తి నమ్మకం ఉందని, తనను అధ్యక్షురాలిని చేస్తే.. ఆర్థిక వినియోగంపై అందరికీ పూర్తి స్వేచ్ఛను తీసుకొస్తానని హామీ ఇచ్చారు. ఫెడరల్ గ్యాస్, డీజిల్ పన్నును పూర్తిగా తొలగిస్తామన్నారు. తద్వారా అధిక గ్యాస్ ధరలతో విసిగిపోతున్న మధ్యతరగతి కుటుంబాలకు కాస్తంత ఊరట లభిస్తుందన్నారు. అలాగే శ్రామిక కుటుంబాలకు ఆదాయపు పన్ను తగ్గించడంతో పాటు.. బైడెన్ ప్రభుత్వం చేపట్టిన 500 బిలియన్ డాలర్ల గ్రీన్ ఎనర్జీ సబ్సిడీలను కూడా తొలగిస్తానని నిక్కీ హేలీ హామీల వర్షం కురిపించారు.
తాజావార్తలు
-
Shubman Gill: “మా ప్లాన్ వర్కవుట్ అయింది”.. హైదరాబాద్పై భారీ విజయం తర్వాత గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
Ramayana: ‘రామాయణ’లో..సాయి పల్లవిపై మేకర్స్ కీలక నిర్ణయం!
-
Daily Horoscope: బుధవారం రాశి ఫలాలు.. ఆ రాశుల వారికి ఊహించని శుభవార్తలు!
-
Pat Cummins: “ఏం పర్వాలేదు.. ప్లేఆఫ్స్కు ఇంకా ఛాన్స్ ఉందిగా”.. కెప్టెన్ కమిన్స్ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
SRH vs GT : గుజరాత్ ధాటికి సన్రైజర్స్ కుప్పకూలింది.. 86 పరుగులకే ఆలౌట్.!
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!