China: యుద్ధానికి సిద్ధమవుతున్న చైనా.. సంచలన వ్యాఖ్యలు తెరమీదకు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘China an existential threat to US says Indian-American Nikki Haley: కరోనా (కోవిడ్ 19) అనే మహమ్మారిని ప్రపంచ దేశాలపైకి వదిలి.. అందరినీ గడగడలాడించిన చైనా.. ఇప్పుడు అమెరికాతో పాటు ప్రపంచం మొత్తానికీ పెద్ద ముప్పుగా మారిందని, ఆ దేశం యుద్ధానికి సిద్ధమవుతోంది.. అందరూ జాగ్రత్తగా ఉండాలంటూ అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో ఉన్న నిక్కీ హేలీ కీలక వ్యాఖ్యలు చేశారు. స్థానిక కాలమానం ప్రకారం.. శుక్రవారం న్యూహ్యాంప్ షైర్ లో ఏర్పాటు చేసిన ఆర్థిక వ్యవస్థ విధి, విధానాలపై ఏర్పాటు చేసిన ప్రసంగంలో చైనాను ఉద్దేశించి ఆమె ప్రపంచ దేశాలకు ఈ హెచ్చరికలు జారీ చేశారు. అగ్రరాజ్యమైన తమ దేశానికి డ్రాగన్ కంట్రీ చైనాతో ప్రమాదం పొంచి ఉందని, తమపై యుద్ధానికి చైనా సిద్ధమవుతోందని నిక్కీ పేర్కొన్నారు. 50 ఏళ్లుగా చైనా తమపై యుద్ధం చేసి ఓడించేందుకు పన్నాగాలు పన్నుతోందని ఆమె చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఇప్పటికే కొన్ని విషయాలలో చైనా సైన్యం అమెరికా సైన్యంతో సమానంగా ఉందన్నారు.
Riniki Bhuyan Sarma: ఎంపీపై సీఎం భార్య పరువు నష్టం దావా
Also Read
- BJP: ‘‘మనుస్మృతి’’పై రాహుల్ గాంధీ వ్యాఖ్యలు.. ‘‘హిజాబ్’’ వీడియోతో బీజేపీ కౌంటర్..
- Earthquake: 7 రోజుల్లో 187 భూకంపాలు.. "రింగ్ ఆఫ్ ఫైర్"లో ఏం జరుగుతోంది?
- Modi Cabinet: కేంద్ర మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధం.. కొత్త ముఖాలకు చోటు!
- Renukaswamy Case: రేణుకాస్వామి మర్డర్ కేసులో దర్శన్కు భారీ ఎదురుదెబ్బ..
దేశ మనుగడకోసం కమ్యూనిస్టు దేశమైన చైనాను ఎదుర్కొనేందుకు బలం, ఆత్మాభిమానం చాలా అవసరమని ఆమె అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. చైనా.. అమెరికా వాణిజ్య రహస్యాలను తెలుసుకుని, తమపై గెలవాలని ప్రణాళికలు వేస్తోందని, చైనాను ఎదుర్కొనేందుకు అందరూ సంసిద్ధంగా ఉండాలని నిక్కీ హేలీ సూచించారు. ఆర్థిక ప్రణాళికలపై నిక్కీ హేలీ మాట్లాడుతూ.. దేశంలో ఉన్న మధ్యతరగతి ప్రజలకు నిజమైన ఆర్థిక స్వేచ్ఛను అందించేందుకు తనవంతు కృషి చేస్తానన్నారు. అమెరికా ప్రజలంతా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తారని తనకు పూర్తి నమ్మకం ఉందని, తనను అధ్యక్షురాలిని చేస్తే.. ఆర్థిక వినియోగంపై అందరికీ పూర్తి స్వేచ్ఛను తీసుకొస్తానని హామీ ఇచ్చారు. ఫెడరల్ గ్యాస్, డీజిల్ పన్నును పూర్తిగా తొలగిస్తామన్నారు. తద్వారా అధిక గ్యాస్ ధరలతో విసిగిపోతున్న మధ్యతరగతి కుటుంబాలకు కాస్తంత ఊరట లభిస్తుందన్నారు. అలాగే శ్రామిక కుటుంబాలకు ఆదాయపు పన్ను తగ్గించడంతో పాటు.. బైడెన్ ప్రభుత్వం చేపట్టిన 500 బిలియన్ డాలర్ల గ్రీన్ ఎనర్జీ సబ్సిడీలను కూడా తొలగిస్తానని నిక్కీ హేలీ హామీల వర్షం కురిపించారు.
తాజావార్తలు
-
BJP: ‘‘మనుస్మృతి’’పై రాహుల్ గాంధీ వ్యాఖ్యలు.. ‘‘హిజాబ్’’ వీడియోతో బీజేపీ కౌంటర్..
-
Tollywood Debut: బిగ్ బాస్ బ్యూటీకి బిగ్ ఛాన్స్.. హీరోయిన్గా టాలీవుడ్లోకి ఎంట్రీ!
-
Earthquake: 7 రోజుల్లో 187 భూకంపాలు.. “రింగ్ ఆఫ్ ఫైర్”లో ఏం జరుగుతోంది?
-
Modi Cabinet: కేంద్ర మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధం.. కొత్త ముఖాలకు చోటు!
-
Telangana Congress : కాంగ్రెస్లో బిగ్ షాక్.. కొండా సురేఖ, చిన్నారెడ్డికి ఎసరు.?
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!