Elephants Attack : ఛత్తీస్గఢ్లో ఏనుగుల భీభత్సం.. పాఠశాలలకు సెలవు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Elephants Attack : ఛత్తీస్గఢ్లోని బలరాంపూర్ జిల్లా వాద్రాఫ్నగర్లో అడవి ఏనుగుల భీభత్సంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ ఏనుగుల చేష్టల కారణంగా ఇక్కడ ఐదు పాఠశాలలు మూతపడిన పరిస్థితి నెలకొంది. రోజు అస్తమించగానే అడవి ఏనుగులు గ్రామంలోకి ప్రవేశిస్తున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. ఆ తర్వాత ఇళ్లను ధ్వంసం చేయడం ప్రారంభిస్తున్నాయి. ఇప్పటి వరకు చాలా మంది రైతుల పంటలు కూడా నాశనమయ్యాయి. ఈ ఏనుగులపై అటవీశాఖ అధికారులు ఎలాంటి కఠిన చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.
వాద్రాఫ్నగర్లోని కాకనేసలో గత పది రోజులుగా మూడు ఏనుగుల గుంపు భీభత్సం సృష్టిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ గ్రామం అడవికి కూతవేటు దూరంలో ఉంది. ఈ ఏనుగుల గుంపు ఇంట్లో ఉంచిన ధాన్యం బస్తాలను కూడా నమిలేసింది. ఫిబ్రవరి 23 రాత్రి ఏనుగులు ఆ ప్రాంతంలోని పాఠశాలకు చాలా దగ్గరగా ఉన్న ఇంటిని కూడా కూల్చివేశాయి. ఏనుగుల బెడద దృష్ట్యా జిల్లా విద్యాశాఖాధికారి సమీపంలోని ఐదు పాఠశాలలకు రెండు రోజుల పాటు సెలవు ప్రకటించారు.
Also Read
- FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు 'ఛాంపియన్షిప్ రింగ్స్'..
- Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
- Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
- Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
Read Also:Group2 Exam: రేపు గ్రూప్-2 పరీక్ష.. అభ్యర్థులు ఇబ్బంది పడకుండా వసతులు
సెలవు ప్రకటించిన పాఠశాలల్లో ధంజరాలోని మధ్య, ప్రాథమిక పాఠశాల, బేత్రిపరాలోని ప్రాథమిక పాఠశాల, మరో రెండు ఉన్నాయి. ఈ ఏనుగులు రోజంతా అడవిలోనే ఉంటాయని, సాయంత్రం అయితే ఈ మూడు ఏనుగులు గ్రామం వైపు వస్తున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. గోధుమలు, కూరగాయల పంటలను ఏనుగులు ధ్వంసం చేయగా.. గ్రామంలోని మూడు ఇళ్లను కూడా ఏనుగులు ధ్వంసం చేశాయి.
అడవుల్లోకి వెళ్లవద్దని, అవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని జిల్లా కలెక్టర్ తరపున ప్రజలకు సూచించారు. ఏనుగుల దాడితో గ్రామ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అలాగే రాత్రిపూట మెలకువగా ఉండాల్సి వచ్చింది. ఏనుగుల సమస్యను పరిష్కరించేందుకు అటవీ శాఖ, ప్రభుత్వ యంత్రాంగం ప్రస్తుతం ఎలాంటి నిర్ధేశకమైన చొరవ చూపకపోవడం వల్లనే గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోందని ఇక్కడి ప్రజలు భావిస్తున్నారు.
Read Also:TTD EO Dharmareddy: తిరుపతి అభివృద్ధికి టీటీడీ సంపూర్ణ సహకారం
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?